Smriti Mandhana: స్మృతి మంధానకు ఐసీసీ అవార్డు
టీమ్ఇండియా మహిళ క్రికెటర్ స్మృతి మంధానకు మరో అవార్డు దక్కింది. ఐసీసీ విమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ - 2021 అవార్డు గెలుచుకుంది. అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ ఆటతీరుతో రాణించిందుకు ఆమెకు ఈ అవార్డు...
ఇంటర్నెట్ డెస్క్ : టీమ్ఇండియా మహిళ క్రికెటర్ స్మృతి మంధానకు మరో అవార్డు దక్కింది. ఐసీసీ విమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ - 2021 అవార్డు గెలుచుకుంది. అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ ఆటతీరుతో రాణించిందుకుగానూ ఆమెకు ఈ అవార్డు లభించింది. గతేడాది టీమ్ఇండియా చెప్పుకోతగ్గ ప్రదర్శన చేయకున్నా.. స్మృతి మంధానకు ఈ అవార్డు లభించడం విశేషం. గతేడాది మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే, టీ20 సిరీస్ల్లో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఐదు వన్డేల సిరీస్ను 1-4 తేడాతో, మూడు మ్యాచుల టీ20 సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయింది. అయితే, ఈ రెండు సిరీస్ల్లో కలిపి భారత్ గెలిచిన రెండు మ్యాచుల్లోనూ స్మృతి మంధాన కీలకంగా వ్యవహరించింది. అలాగే, ఆస్ట్రేలియా మహిళా జట్టుతో జరిగిన ఏకైక పింక్ బాల్ టెస్టులో మంధాన సెంచరీతో రికార్డు సృష్టించింది. పింక్ బాల్ టెస్టులో సెంచరీ నమోదు చేసిన తొలి మహిళ క్రికెటర్గా చరిత్రకెక్కిన విషయం తెలిసిందే.
* పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్కి ఉత్తమ వన్డే క్రికెటర్ అవార్డు..
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్కి ‘ఐసీసీ ఉత్తమ వన్డే క్రికెటర్’ అవార్డు దక్కింది. బాబర్ గతేడాది ఆడిన ఆరు వన్డేల్లో కలిపి 67.50 సగటుతో 405 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ జట్టు టెస్టు కెప్టెన్ జో రూట్కు ‘ఐసీసీ ఉత్తమ టెస్టు క్రికెటర్’ అవార్డు లభించింది. గతేడాది అద్భుతమైన ఆటతీరుతో రూట్ ఆకట్టుకున్నాడు. టెస్టుల్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో 1708 పరుగులు చేసిన మూడో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. పాక్ మాజీ ఆటగాడు మహమ్మద్ యూసుఫ్ (1788 పరుగులు), వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్ (1710 పరుగులు) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.
* ఉత్తమ అంపైర్గా ఎరాస్మస్..
దక్షిణాఫ్రికాకు చెందిన మరైస్ ఎరాస్మస్ ఉత్తమ అంపైర్గా ఎంపికయ్యాడు. అతడు మూడోసారి ఉత్తమ ఎంపైర్ అవార్డు దక్కించుకోవడం విశేషం. అంతకు ముందు 2016, 2017 సంవత్సరాల్లో కూడా ఎరాస్మస్ ఉత్తమ అంపైర్ అవార్డు అందుకున్నారు. ఇప్పటి వరకు 70 టెస్టులు, 102 వన్డేలు, 35 టీ20 మ్యాచులకు అతడు అంపైర్గా వ్యవహరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం