ODI WC 2023: భారత్ ‘C’ టీమ్ కూడా పాక్ను ఓడిస్తుందన్న శ్రీశాంత్.. షహీన్ బౌలింగ్పై అక్రమ్ కీలక వ్యాఖ్యలు!
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్లో పాకిస్థాన్పై భారత్ (IND vs PAK) విజయం సాధించి ఐదు రోజులైనా ఆ వేడి మాత్రం ఇంకా తగ్గలేదు. పాక్ ఆడిన తీరుపై విమర్శలు ఆగడంలేదు. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ క్రికెటర్లు శ్రీశాంత్, గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అలాగే తమ జట్టు బౌలర్ షహీన్ ప్రదర్శనపై పాక్ మాజీ పేసర్ వసీమ్ అక్రమ్ కూడా స్పందించాడు. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం..
మికీ ఆర్థర్ చెప్పినట్టు జరగదులే: శ్రీశాంత్
‘‘పాక్ కోచ్-డైరెక్టర్ మికీ ఆర్థర్ భారత్ను ఫైనల్లో కలుసుకుంటామని చెప్పినట్లు విన్నా. అయితే, వారి ఆటను చూస్తే.. పాక్ ఎప్పుడూ కూడా ఐసీసీ ట్రోఫీల్లో గెలిచే అవకాశం ఉండకపోవచ్చు. అది వారి జట్టును చూస్తే అర్థమైపోతుంది. భారత్ ‘సి’ జట్టు కూడా పాక్ ప్రధాన టీమ్ను ఓడించగలదు. ఐపీఎల్లో ఆడిన భారత క్రికెటర్లకు కూడా పాక్ను ఓడించగల సత్తా ఉంది. పాకిస్థాన్ ఎప్పటికీ ఇలాంటి భారీ స్టేడియంలో ఆడాలని కలలు కూడా కనలేదు. ఒక వేళ మరో అవకాశం లభించినా.. ఇటువంటి ఆటతీరునే ప్రదర్శిస్తే మాత్రం గెలవడం కష్టం’’ అని శ్రీశాంత్ తెలిపాడు.
బాబర్ అజామ్ చాలా విషయాల్లో మారాలి: గౌతమ్ గంభీర్
‘‘పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ చాలా విషయాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అతడి ఆటతీరు, వ్యక్తిత్వంతోపాటు మైండ్సెట్ కూడా మారాలి. షాహిద్ అఫ్రిది, ఇమ్రాన్ నజిర్, సయీద్ అన్వర్, సోహైల్ వంటి దూకుడైన బ్యాటింగ్ లైనప్ గతంలో పాకిస్థాన్కు ఉండేది. అయితే, ఇప్పుడున్న జట్టులో టాప్-3 బ్యాటర్లు ఒకేలా ఆడుతున్నారు. వారిలో ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా కెప్టెన్ బాబర్ అజామ్ అయితే బెటర్. అతడు చాలా కీలకమైన మూడోస్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. గణాంకాలను చూసుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా పాక్ తరఫున అత్యధిక పరుగులు చేసే బ్యాటర్గా అతడు నిలుస్తాడు. కానీ, టోర్నీల్లో జట్టును గెలిపిస్తేనే గౌరవం దక్కుతుంది. వసీమ్ అక్రమ్ 1992 వరల్డ్ కప్ ఫైనల్లో మూడు వికెట్లు తీశాడు. అప్పటి వరకు ఎప్పుడూ ఐదు వికెట్ల ప్రదర్శన చేయలేదు. అయినా, సరే అతడి బౌలింగ్ గురించి అప్పట్లో మాట్లాడుకున్నారు. దానికి కారణంగా వారు వరల్డ్ కప్ను గెలిచారు. అలాగే 2011 ఫైనల్లో శ్రీలంక ఆటగాడు మహేల జయవర్థెనె సెంచరీ కొట్టినా.. ఎవరూ గుర్తు పెట్టుకోలేదు. ఎందుకంటే భారత్ వరల్డ్ కప్ నెగ్గింది’’ అని గంభీర్ వివరించాడు.
షహీన్ వికెట్లు తీయగల బౌలరే.. కానీ..: వసీమ్ అక్రమ్
పాకిస్థాన్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిది నుంచి ఇంకా ఆశించిన స్థాయిలో బౌలింగ్ ప్రదర్శన రాలేదని.. మున్ముందు మ్యాచుల్లో చూస్తామనే విశ్వాసం ఉందని పాక్ మాజీ దిగ్గజం వసీమ్ అక్రమ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘‘షహీన్ అద్భుతమైన బౌలర్. వరల్డ్ కప్లో నాణ్యమైన బౌలింగ్ వేస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వికెట్ తీయగల బౌలర్. కానీ, అతడిలో ఇప్పుడు ఆత్మవిశ్వాసం స్థాయి తక్కువగా ఉంది. ఒక వేళ వికెట్లు తీయలేనప్పుడు పరుగులను నియంత్రించాలి. అంతకుమించి ఏం చేయకూడదు. ఒకటీ లేదా రెండు మంచి బౌలింగ్ స్పెల్స్ పడితే చాలా వరకు గాడిలోకి వచ్చేస్తాడు’’ అని అక్రమ్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్