IND vs PAK: అదరగొట్టు ఇండియా
క్రికెట్లో అత్యున్నత టోర్నీ వన్డే ప్రపంచకప్. క్రికెట్ను అమితంగా ఇష్టపడే అభిమానులున్న దేశం.. భారత్. ప్రపంచంలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం ఉన్నది.. అహ్మదాబాద్లో. క్రికెట్లో అత్యంత ఆసక్తి రేకెత్తించే మ్యాచ్.. భారత్ × పాకిస్థాన్.
ప్రపంచకప్లో పాక్తో పోరు నేడే
మోదీ స్టేడియంలో మెగా మ్యాచ్
ఫేవరెట్ రోహిత్ సేన.. 8-0పై గురి
మధ్యాహ్నం2 నుంచి
అహ్మదాబాద్
క్రికెట్లో అత్యున్నత టోర్నీ వన్డే ప్రపంచకప్. క్రికెట్ను అమితంగా ఇష్టపడే అభిమానులున్న దేశం.. భారత్. ప్రపంచంలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం ఉన్నది.. అహ్మదాబాద్లో. క్రికెట్లో అత్యంత ఆసక్తి రేకెత్తించే మ్యాచ్.. భారత్ × పాకిస్థాన్.
మరి అత్యున్నత టోర్నీలో.. అత్యుత్తమ అభిమానుల మధ్య.. అతి పెద్ద మైదానంలో.. అత్యంత ఆసక్తి రేకెత్తించే మ్యాచ్ జరిగితే..?
శనివారం ఆ అద్భుతమే చూడబోతున్నాం.
క్రికెట్ ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. భారత్ ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్థుల పోరు నేడే.
చరిత్ర మనవైపే. వర్తమానంలోనూ మనదే జోరు. బలాబలాల్లోనూ పైచేయి మన జట్టుదే. అన్నింటికీ మించి ఆడుతోంది సొంతగడ్డపై. పాక్తో పోరులో ఫేవరెట్ నిస్సందేహంగా భారత జట్టే. మరి రోహిత్సేన అంచనాలను అందుకుంటుందా? వన్డే ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్థిపై ఓటమే ఎరుగని రికార్డును కొనసాగిస్తుందా?
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో అత్యంత ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తలపడబోయేది శనివారమే. దాదాపు లక్షా ముప్ఫైవేల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా మారిన నరేంద్ర మోదీ మైదానంలో ఈ మ్యాచ్ జరగబోతోంది. అంత పెద్ద స్టేడియం నిండుగా అభిమానులతో కళకళలాడుతుండగా.. భారత్-పాక్ తలపడుతుంటే చూడటం ఓ అద్భుత అనుభవం అనడంలో సందేహం లేదు. వన్డే ప్రపంచకప్లో తలపడ్డ ఏడుసార్లూ పాకిస్థాన్ను ఓడించిన అజేయ రికార్డు భారత్ సొంతం. ఇటీవలే ఆసియా కప్లో పాక్ను చిత్తు చేసింది రోహిత్ సేన. ఇప్పుడు ప్రపంచకప్లోనూ ఆడిన రెండు మ్యాచ్ల్లో మనదే విజయం. కాబట్టి అందరూ భారత్ను ఈ మ్యాచ్లో హాట్ ఫేవరెట్గా పరిగణిస్తున్నారు. అయితే పాక్ జట్టులో కొందరు ప్రమాదకర ఆటగాళ్లున్నారు. టోర్నీలో ఆ జట్టు కూడా వరుసగా రెండు మ్యాచ్లు గెలిచింది. ముఖ్యంగా శ్రీలంకపై రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన ఊపులో బాబర్ సేన ఈ మ్యాచ్లో అడుగు పెడుతోంది. కాబట్టి దాయాదిని తక్కువగా తీసుకునేందుకు అవకాశం లేదు.
గిల్ ఆడుతున్నట్లేనా?
పాక్తో కీలక పోరు ముంగిట భారత జట్టుకు ఉత్సాహాన్నిచ్చే విషయం.. ఓపెనర్ శుభ్మన్ గిల్ డెంగీ జ్వరం నుంచి కోలుకోవడం. చెన్నైలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంటనే జట్టు కంటే ముందే అహ్మదాబాద్ చేరుకున్న శుభమన్.. రెండు రోజులుగా బ్యాటింగ్ సాధన కూడా చేస్తున్నాడు. మ్యాచ్కు ముందు రోజు అతను పిచ్ను పరిశీలిస్తూ కనిపించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా శుభ్మన్ పాక్తో మ్యాచ్లో ఆడే అవకాశాలు 99 శాతం ఉన్నట్లు చెప్పాడు. కాబట్టి శనివారం శుభ్మన్ను మైదానంలో చూడబోతున్నట్లే. ఫామ్లో ఉన్న అతను.. అందుబాటులోకి వస్తే బ్యాటింగ్ మరింత బలోపేతమవుతుంది.
పిచ్ స్పిన్నర్లదే..
నరేంద్ర మోదీ స్టేడియంగా మారిన మొతెరా మైదానంలో పిచ్ స్పిన్కు బాగా అనుకూలిస్తుంది. పునర్నిర్మాణం తర్వాత మరింతగా స్పిన్నర్లు ప్రభావం చూపుతున్నారు. ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్లో స్పిన్నర్లు ఆధిపత్యం చలాయించారు. అయితే చెన్నైలో మాదిరి పరిస్థితులు బ్యాటింగ్కు మరీ కష్టంగా ఉండకపోవచ్చు. మ్యాచ్కు కొంతమేర వర్షం ముప్పుంది.
ఈసారి హీరో ఎవరో?
పాక్తో మ్యాచ్ను భారత అభిమానులు ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారో చెప్పాల్సిన పని లేదు. ఈ మ్యాచ్లో జట్టును గెలిపిస్తే ఆ ఆటగాడు జాతీయ హీరో అయిపోతాడు. పాక్పై 1992, 2003, 2011లో సచిన్ ఇన్నింగ్స్లను.. పాక్పై 1996, 1999లో వెంకటేశ్ ప్రసాద్ అద్భుత బౌలింగ్ను.. 2015లో కోహ్లి సెంచరీని.. 2019లో రోహిత్ భారీ శతకాన్ని అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అలా ఇప్పుడు హీరో ఎవరవుతారన్నది ఆసక్తికరం. బ్యాటింగ్లో సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి, రోహిత్, రాహుల్లపై భారీ అంచనాలున్నాయి. బౌలింగ్లో కుల్దీప్, బుమ్రాలపై జట్టు ఎక్కువ ఆశలు పెట్టుకుంది. మరి వీరిలో శనివారం హీరోగా నిలిచేదెవరో?
జట్టులో ఒకట్రెండు మార్పులు చేయాల్సిన అవసరం వస్తే చేస్తాం. పిచ్ను బట్టి అవసరమనిపిస్తే ముగ్గురు స్పిన్నర్లతో ఆడతాం. గత రెండు మ్యాచ్లకు ఎలా సన్నద్ధమయ్యామో ఈ పోరుకూ అలాగే సిద్ధమయ్యాం.
రోహిత్ శర్మ
తుది జట్లు (అంచనా)...
భారత్: రోహిత్ (కెప్టెన్), శుభ్మన్/ఇషాన్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, హార్దిక్, జడేజా, అశ్విన్/షమి, కుల్దీప్, బుమ్రా, సిరాజ్.
పాకిస్థాన్: షఫీక్, ఇమాముల్, బాబర్ (కెప్టెన్), రిజ్వాన్, సాద్ షకీల్, ఇఫ్తికార్, షాదాబ్, నవాజ్, షహీన్, రవూఫ్, హసన్ అలీ.
వీళ్లతోనే ముప్పు..
బలాబలాల్లో భారత్తో పోలిస్తే తక్కువగా అనిపిస్తున్నప్పటికీ.. పాకిస్థాన్ జట్టులో కొందరు ప్రమాదకర ఆటగాళ్లున్నారు. బౌలింగ్లో షహీన్ అఫ్రిది నుంచి భారత్కు ప్రధానంగా ముప్పు పొంచి ఉంది. ఆరంభ ఓవర్లలో అతణ్ని కాచుకోవడం సవాలే. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకడైన హారిస్ రవూఫ్తోనూ ప్రమాదమే. బ్యాటింగ్లో ఆ జట్టుకు రిజ్వాన్ అత్యంత కీలకం. శ్రీలంకపై అజేయ సెంచరీతో అతను జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్లో షఫీక్ కూడా మేటి ఇన్నింగ్స్ ఆడాడు. బాబర్ అజామ్కు భారత్ మీద రికార్డు బాగా లేదు. ఇటీవల అతడి ఫామ్ కూడా బాగా లేదు. కానీ వన్డేల్లో నంబర్వన్ బ్యాటర్ అయిన బాబర్ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పిచ్ స్పిన్కు అనుకూలం కాబట్టి షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఇఫ్తికార్ అహ్మద్లతో జాగ్రత్తగా ఉండాలి.
ఒత్తిడిని జయిస్తే..
భారత్-పాక్ మ్యాచ్ అంటే ఏ స్థాయిలో ఒత్తిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భావోద్వేగాలను పతాక స్థాయికి తీసుకెళ్లే ఈ మ్యాచ్ను ఇరు దేశాల అభిమానులు ఒక యుద్ధంలా చూస్తారు. ప్రపంచకప్ గెలవడం సంగతి తర్వాత, ముందు ఈ మ్యాచ్ నెగ్గాలి అనుకుంటారు. పాకిస్థాన్కు అయితే ప్రపంచకప్ విజయం కంటే భారత్పై గెలుపు ఇంకా ప్రతిష్ఠాత్మకంగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. మూడు దశాబ్దాలుగా ఈ మెగా టోర్నీలో ఓటమి పాలవుతున్న జట్టు పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రతిసారీ ఒత్తిడిని తట్టుకోలేకే ఆ జట్టు దెబ్బ తింటుంటుంది. ఈసారి భారత్ను దాని సొంతగడ్డపై ఎదుర్కోవడం మరింతగా ఒత్తిడి పెంచేదే. దీన్ని భారత్ సొమ్ము చేసుకోవడం కీలకం. అన్ని విభాగాల్లో పాక్ కంటే మెరుగ్గా కనిపిస్తున్న టీమ్ఇండియా.. ఆత్మవిశ్వాసంతో ఆడితే, స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే చాలు.
- 10 పాకిస్థాన్పై ఆడిన 5 వన్డేల్లో కుల్దీప్ వికెట్లు. సగటు 13.5 కాగా, ఉత్తమ ప్రదర్శన 5/25.
- భారత గడ్డపై భారత్తో పాక్ రెండు ప్రపంచకప్ మ్యాచ్లు ఆడింది. 1996లో బెంగళూరులో జరిగిన క్వార్టర్స్లో 39 పరుగుల తేడాతో, 2011లో మొహాలిలో సెమీస్లో 29 పరుగుల తేడాతో ఓడింది.
- ప్రస్తుత జట్టులో పాకిస్థాన్పై అత్యధిక వన్డే ప్రపంచకప్ మ్యాచ్లు ఆడింది కోహ్లీనే. 3 మ్యాచ్ల్లో అతను 64.3 సగటుతో 193 పరుగులు చేశాడు. అందులో ఓ శతకం (2015లో 107), ఓ అర్ధశతకం (2019లో 77) ఉన్నాయి.
- 77.3: పాక్పై ఆడిన రెండు ప్రపంచకప్ మ్యాచ్ల్లో రోహిత్ సగటు. 2019లో అతను 140 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్