Cricket News: ఏడో ర్యాంక్కు విరాట్.. మైకెల్ వాన్కు భజ్జీ కౌంటర్!
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్లో (ODI WC 2023) ఆస్ట్రేలియాపై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ (Virat Kohli) ఐసీసీ ర్యాంకింగ్స్ను మెరుగుపర్చుకున్నాడు. భారత్ (Team India) వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ మ్యాచ్లకు ప్రేక్షకాదరణ సరిగా లేదనే మైకెల్ వాన్ వ్యాఖ్యలకు హర్భజన్ సింగ్ కౌంటర్ ఇచ్చాడు. ఆసియా క్రీడల్లో భారత్కు స్వర్ణ పతకం ప్రకటించడంపై అఫ్గాన్ ఆటగాడు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం..
రెండు ర్యాంకులు మెరుగుపర్చుకుని..
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అద్భుత ఫామ్లో ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఆస్ట్రేలియాపై కీలకమైన 85 పరుగులు చేయడంతో ఐసీసీ ర్యాంకింగ్స్లో తన స్థానాన్ని మెరుగుపర్చుకున్నాడు. ప్రస్తుతం 715 పాయింట్లతో ఏడో ర్యాంక్లో కొనసాగుతున్నాడు. శుభ్మన్ గిల్ (830పాయింట్లు) రెండో స్థానంలో ఉండగా.. బాబర్ అజామ్ (835) టాప్ ర్యాంకర్. ఇక ఆసీస్పై డకౌట్గా వెనుదిరిగిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ 11వ స్థానానికి పడిపోయాడు. అయితే, అఫ్గాన్పై తాజాగా చేసిన సెంచరీని ఐసీసీ ఇంకా పరిగణనలోకి తీసుకోలేదు. అలాగే కోహ్లీ కూడా అఫ్గాన్పై అర్ధశతకం చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఐసీసీ ర్యాంకింగ్స్లో వీరికి మరింత మెరుగైన స్థానాలు దక్కడం ఖాయం.
మ్యాచ్ను చూస్తున్నావా..? ఖాళీ కుర్చీలనా..?
టీమ్ఇండియా క్రికెట్కు సంబంధించిన అంశాలపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ ఎప్పుడూ వ్యగ్య ధోరణిలో ట్వీట్లు చేస్తుంటాడు. తాజాగా భారత్-అఫ్గానిస్థాన్ (IND vs AFG) మ్యాచ్ జరిగిన దిల్లీ స్టేడియంలో కుర్చీలు ఖాళీగా ఉన్నాయని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ ఎక్స్ వేదికగా పోస్టు చేశాడు. అయితే, దానికి భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ‘‘భారత్ మ్యాచ్కూ చాలా సీట్లు ఖాళీగా ఎందుకు ఉన్నాయి?’ అని వాన్ ట్వీట్ చేశాడు. దానికి హర్భజన్ ‘‘నువ్వు మ్యాచ్ చూస్తున్నావా..? ఖాళీ సీట్లనా?’’ అని సమాధానం ఇచ్చాడు.
స్వర్ణం పంచితే బాగుండేది: అఫ్గాన్ పేసర్ ఫరీద్ మాలిక్
ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ స్వర్ణ పతకం సొంతం చేసుకోగా.. అఫ్గానిస్థాన్ రజతంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. వర్షం కారణంగా మ్యాచ్ రద్దైంది. దాంతో టాప్ సీడ్గా ఉన్న టీమ్ఇండియాకు గోల్డ్ దక్కింది. అయితే, ఇలా ఇవ్వడం సరైంది కాదని అఫ్గాన్ పేసర్ ఫరీద్ మాలిక్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఫరీద్ వరల్డ్ కప్ కోసం అఫ్గాన్ రిజర్వ్ బెంచ్పై ఉన్నాడు. ‘‘స్వర్ణ పతకాన్ని ఇరు జట్లకూ పంచి ఇస్తే బాగుండేది. ర్యాంకింగ్స్ ప్రకారం ఇవ్వడం సరైంది కాదు. మ్యాచ్ జరిగి ఉంటే ఫుల్ మజా ఉండేది. చైనా, మలేషియా వంటి ఇతర దేశాలకూ క్రికెట్ విస్తరించడం ఆనందంగా ఉంది. అయితే, మ్యాచ్లను చూసేందుకు వచ్చిన చైనా ప్రేక్షకులకు నిబంధనలు కూడా తెలియవు. ప్రతి విషయానికి చప్పట్లు కొట్టారు. ఔటైనా.. సిక్స్ కొట్టినా అదే స్పందన’’ అని ఫరీద్ అసహనం వ్యక్తం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
ఐపీఎల్-17లో చెన్నై ఆరో విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. -
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
చెన్నై జట్టుకు గాయాలు ఇబ్బందిగా మారాయి. యువ పేసర్ పతిరన గాయం కారణంగా స్వదేశానికి వెళ్లిపోయాడు. -
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
డోపింగ్ పరీక్షకు శాంపిల్ ఇవ్వని కారణంగా రెజ్లర్ బజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) సస్పెన్షన్ వేటు వేసింది. -
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
ఐపీఎల్ 17వ సీజన్లో సిరాజ్ తొలిసారి అత్యుత్తమ బౌలింగ్తో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
క్రికెట్ అభిమానులను అలరించడానికి ప్రతి దేశం ఓ లీగ్ను నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే భారత్లో ఐపీఎల్, పాక్లో పీఎస్ఎల్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వచ్చే ఏడాది ఈ రెండు ఒకే సమయంలో జరిగే అవకాశం ఉంది. -
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
బెంగళూరు చేతిలో ఓటమితో గుజరాత్ కూడా ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. -
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్కు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ ఎదురైంది. అతడూ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. -
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
-
వైట్హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ