Yuvi opinion on POTT WC 2023: విరాట్, రోహిత్ కాదు.. అతడే ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’: యువీ
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వన్డే ప్రపంచకప్ ఫైనల్ (ODI World Cup 2023) జరుగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. కప్ను ఎవరు సొంతం చేసుకుంటారనేది పక్కన పెడితే ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’(Player of the Tournament)గా ఎవరు నిలుస్తారనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. తాజాగా ఇదే అంశంపై భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) స్పందించాడు. అద్భుతమైన ఓపెనింగ్తో జట్టుకు శుభారంభం అందిస్తున్న రోహిత్ శర్మతోపాటు ఈ టోర్నీలో అత్యధిక పరుగులతో అగ్రస్థానంలో ఉన్న విరాట్ కోహ్లీని కాదని.. పేస్ సంచలనం వైపు యువీ మొగ్గు చూపాడు. అలాగే హార్దిక్పాండ్య లేనిలోటు ఎక్కడా కనిపించలేదని.. రిజర్వ్ బెంచ్ చాలా బలంగా ఉందన్నాడు.
‘‘భారత్కు రిజర్వ్ బెంచ్పైనా మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. హార్దిక్ పాండ్య గాయపడటం వరమని నేను చెప్పను. అయితే, అవకాశం వచ్చిన తర్వాత షమీ ఎలాంటి ప్రదర్శన ఇస్తాడని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. షమీ(Mohammed Shami) మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేశాడు. గొప్ప ప్రదర్శనతో అదరగొట్టాడు. అందుకే, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ (POTT) అవార్డుకు అన్ని అర్హతలు కలిగిన వారిలో షమీ ముందుంటాడు. అతడికే వస్తుందని భావిస్తున్నా.
కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు అద్భుతమైన అవకాశం వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్లో మెగా టోర్నీని గెలిస్తే చూడటానికి చాలా బాగుంటుంది. ఆసియా కప్ ముందు భారత వన్డే టీమ్తో ఇప్పటి జట్టును పోల్చి చూస్తే ఆశ్చర్యమేస్తోంది. అప్పుడు సరైన కాంబినేషన్ కోసం ఇబ్బంది పడ్డారు. గాయాల నుంచి కోలుకుని వచ్చిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, బుమ్రా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు’’ అని యువరాజ్ సింగ్ (Yuvraj Singh) వ్యాఖ్యానించాడు.
ODI WC Final 2023: భారత్ vs ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ లైవ్ అప్డేట్స్
భారత్ గెలిస్తే భోజనం ఉచితం: దాబా యజమాని
వన్డే ప్రపంచకప్(ODI World Cup 2023)ను టీమ్ఇండియా గెలిస్తే తన దాబాలో భోజనం ఉచితంగా ఇస్తానని అహ్మదాబాద్కు చెందిన నరేంద్ర సింగ్ తెలిపారు. భారత్ తొలిసారి కప్ను గెలిచిన 1983 నుంచి ప్రతి మెగా టోర్నీని చూస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘కపిల్ దేవ్ నాయకత్వంలో భారత్ 1983లో విశ్వవిజేతగా నిలిచింది. అప్పటి నుంచి ప్రతి వరల్డ్ కప్ను చూస్తున్నా. ఇప్పుడు మళ్లీ టీమ్ఇండియా (Team India) ఫైనల్కు చేరింది. ఈసారి కప్ గెలిస్తే భోజనం ఉచితంగా పెడతా’’ అని నరేంద్ర వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
కోల్కతా చేతిలో భారీ ఓటమితో లఖ్నవూ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ బెర్తు ఖాయమవుతుంది. -
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
తన టీ20 కెరీర్లో తొలిసారి ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఐపీఎల్ 17వ సీజన్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో క్రీజ్లోకి వచ్చిన ధోనీ మొదటి బంతికే ఔటయ్యాడు. -
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన కోల్కతా ప్లేఆఫ్స్ బెర్తుకు దగ్గరైంది. తన చివరి మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిస్తే నాకౌట్ దశకు చేరుకోవడం ఖాయం. ఇప్పటికే అందరికంటే ముందున్న ఆ జట్టు ఓడినా ఇబ్బంది ఉండకపోవచ్చు. -
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
పంజాబ్ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
-
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్