WhatsApp: వాట్సాప్‌ కొత్త అప్‌డేట్‌.. వాయిస్‌ కాల్స్‌ లుక్కే మారిపోనుంది..!

యూజర్‌ ఫ్రెండ్లీ యాప్‌ వాట్సాప్‌ మరో కొత్తదనంపై దృష్టిపెట్టింది. కొత్త వాయిస్‌ కాల్‌ ఇంటర్‌ఫేస్‌, ఎమోజీల కోసం..

Published : 21 Feb 2022 16:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఎప్పుటికప్పుడు వినూత్న ఫీచర్లతో ఈ మధ్య దూకుడు ప్రదర్శిస్తున్న యూజర్‌ ఫ్రెండ్లీ యాప్‌ వాట్సాప్‌ మరో కొత్తదనంపై దృష్టిపెట్టింది. కొత్త వాయిస్‌ కాల్‌ ఇంటర్‌ఫేస్‌, ఎమోజీల కోసం షార్ట్‌కట్‌, అప్‌డేటెడ్‌ వాయిస్‌ నోట్‌ ఫార్వార్డ్‌ వంటి తాజా ఫీచర్లను వాట్సాప్‌ తీసుకురానున్నట్లు సమాచారం. ఇప్పటికే టెస్టింగ్‌ కోసం ఈ కొత్త ఫీచర్లను పలువురు బీటా యూజర్లకు వాట్సాప్‌ అందుబాటులోకి తెచ్చింది.

వాట్సాప్‌ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపిన సమచారం ప్రకారం.. వాయిస్‌ కాల్‌ కొత్త ఇంటర్‌ఫేస్‌ను ఐవోఎస్‌ బీటా టెస్టర్‌లకు వాట్సాప్‌ విడుదల చేసింది. ప్రత్యేకంగా గ్రూప్‌ వాయిస్‌ కాల్స్‌ కోసం ఈ ఫీచర్‌ను తీర్చిదిద్దారు. వాయిస్‌ కాల్‌ సమయంలో ఈ ఫీఛర్ గ్రూప్‌లోని ప్రతిఒక్కరికీ రియల్‌ టైమ్‌ వేవ్‌ఫారమ్‌లను చూపుతుంది. తద్వారా వాయిస్‌ కాల్‌లో ఎవరు మాట్లాడుతున్నారో, ఎవరు మ్యూట్‌లో ఉన్నారో ఈజీగా తెలుసుకునే వీలుంటుంది. అలాగే ఈ కొత్త ఇంటర్‌ఫేస్‌లో వాల్‌పేపర్‌లను కూడా వాట్సాప్‌ విడుదల చేయాలని యోచిస్తుంది.

మరోవైపు ఫార్వార్డ్‌ వాయిస్‌ నోట్స్‌, ఆడియో ఫైల్‌ల మధ్య తేడాను గుర్తించడానికి మరో సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్‌ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త ఫీచర్‌ ద్వారా ఫార్వాడ్‌ చేసిన వాయిస్‌ నోట్స్‌ ఇకపై నారింజ రంగులో కనిపించనున్నాయి. అలాగే ఇతరులతో చాటింగ్‌ చేస్తున్న సమయంలో ఎమోజీని త్వరగా ఎంచుకోవడానికి వాట్సాప్‌ షార్ట్‌కట్‌లు తీసుకువస్తుంది. ఈ మేరకు యూజర్లు ఇష్టపడే ఎమోజీకి సంబంధించి కీవర్ట్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ కొత్త ఫీచర్లను ప్రస్తుతానికి బీటా యూజర్లకు మాత్రమే పరిచయం చేసినా.. వీటిని ఐవోఎస్‌తో పాటు వెబ్‌, ఆండ్రాయిడ్‌ వినియోగదారులందరికీ వాట్సాప్‌ త్వరలో అందుబాటులోకి తీసుకొస్తుందని కచ్చితంగా చెప్పలేం. పైగా రాబోయే అప్‌డేట్‌లో ఈ ఫీచర్లకు సంబంధించి మరిన్ని మార్పులు కూడా ఉండొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని