Hyd News: ‘బ్యాంకు క్యాషియర్’ కేసులో ఊహించని మలుపు!
బ్యాంకు సొమ్ము అపహరించి అదృశ్యమైన క్యాషియర్ కేసు ఊహించని మలుపు తిరిగింది. వారం రోజులుగా అదృశ్యమైన నిందితుడు హయత్నగర్ న్యాయస్థానంలో సోమవారం లొంగిపోయాడు.
హయత్నగర్ కోర్టులో లొంగిపోయిన ప్రవీణ్కుమార్
బ్యాంకు సిబ్బంది ఇరికించారంటూ ఆరోపణ
వనస్థలిపురం, న్యూస్టుడే: బ్యాంకు సొమ్ము అపహరించి అదృశ్యమైన క్యాషియర్ కేసు ఊహించని మలుపు తిరిగింది. వారం రోజులుగా అదృశ్యమైన నిందితుడు హయత్నగర్ న్యాయస్థానంలో సోమవారం లొంగిపోయాడు.
అసలేం జరిగిందంటే..
ఈ నెల 10న వనస్థలిపురం సాహెబ్నగర్లోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.23.53లక్షల నగదుతో క్యాషియర్ ప్రవీణ్కుమార్ మాయమయ్యాడు. ఆన్లైన్, క్రికెట్ బెట్టింగ్లకు అలవాటైన తాను నష్టపోయానంటూ తల్లికి వీడియో సందేశం పంపాడు. కోల్పోయిన సొమ్మును బెట్టింగ్లతో తిరిగి సంపాదిస్తే వచ్చి డబ్బు ఇచ్చేస్తానంటూ వివరించాడు. నష్టపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. అదే రోజు బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రెండ్రోజుల తరువాత ప్రవీణ్ మరో సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. బ్యాంకులో పోయిన సొమ్ముతో తనకేం సంబంధం లేదంటూ ఆవేదన వెలిబుచ్చాడు. బ్యాంకు మేనేజర్ కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ తెలిపాడు. ఈ క్రమంలో ప్రవీణ్కుమార్ ద్విచక్రవాహనం చిట్యాల బస్టాండ్ సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న సమయంలో నాటకీయ ఫక్కీలో నిందితుడు హయత్నగర్ కోర్టులో లొంగిపోయాడు.
తప్పునాది కాదు.. బయటకొచ్చాక నిరూపిస్తా
న్యాయస్థానంలో లొంగిపోయేందుకు వచ్చిన ప్రవీణ్కుమార్ మీడియాతో మాట్లాడారు. బ్యాంకులో కనిపించకుండా పోయిన నగదుతో తనకెటువంటి సంబంధంలేదని పేర్కొన్నారు. బ్యాంకులో డబ్బును బీరువాల్లో దాచేచోట సీసీ టీవీ కెమెరాలు అమర్చలేదన్నారు. గతేడాది డిసెంబర్లో రూ.లక్ష అకౌంట్లో తక్కువగా వస్తే ఇంట్లో నుంచి ఆ డబ్బును సర్దినట్లు తెలిపాడు. ఆ సమయంలో ఇదే విషయాన్ని బ్యాంకు అధికారులకు చెప్పానని, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెబితే బ్యాంకు ప్రతిష్ఠ దెబ్బతింటుందని ఆపారన్నాడు. ఈ నెల 10న రూ.4లక్షల నగదు ఖాతాలో తక్కువ రావటంతో అక్కడి నుంచి వెళ్లి పోయానన్నారు. ఇప్పటికి ఆ డబ్బులు ఎవరూ తీసారో తెలియదన్నారు. బ్యాంకులో అంతర్జాతీయస్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్ఆర్ఐ ఖాతాల్లో జరుగుతున్న గోల్మాల్ తాను బయటకు వచ్చాక బయటపెడతానన్నాడు. కోర్టులో లొంగిపోయిన ఇతనికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితుడిని కస్టడీకి కోరుతూ వనస్థలిపురం పోలీసులు న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు.
వనస్థలిపురం నుంచి బెంగళూరుకు
వనస్థలిపురంలో అదృశ్యమైన ప్రవీణ్ ద్విచక్రవాహనంపై చిట్యాల చేరాడు. ఆర్టీసీ బస్సులో బెంగళూరుకు వెళ్లినట్లు ప్రవీణ్ తెలిపాడు. అక్కడి నుంచి ఒక సెల్ఫోన్ సహాయంతో ఇన్స్టాలో సెల్ఫీ వీడియో పెట్టానని తెలిపాడు. తాను మరణిస్తే నిజాలు బయటకురావనే ఉద్దేశంతో లొంగిపోయినట్లు వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..