Mekapati Goutham Reddy: ఏపీ మంత్రి గౌతమ్రెడ్డి హఠాన్మరణం
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి (50) హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో హైదరాబాద్
హైదరాబాద్లోని నివాసంలో గుండెపోటు, అపోలోకు తరలింపు
వైద్యులు గంటన్నర ప్రయత్నించినా ఫలితం శూన్యం
రేపు ఉదయగిరిలో అంత్యక్రియలు
ఈనాడు, హైదరాబాద్, అమరావతి -న్యూస్టుడే, ఫిలింనగర్: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి (50) హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన స్వగృహంలో తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు కారులో ఆయన్ను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అత్యవసర విభాగంలో చేర్చిన వైద్యులు కార్డియో పల్మనరీ రిససటేషన్ (సీపీఆర్) చేశారు. ఎంత ప్రయత్నించినా గౌతమ్రెడ్డిలో చలనం లేకపోవడంతో ఉదయం 9.16 గంటల ప్రాంతంలో ఆయన మృతి చెందినట్లు ప్రకటించారు. ‘మంత్రి గౌతమ్రెడ్డి ఉదయం ఇంట్లోనే గుండెపోటుకు గురయ్యారు. కుటుంబసభ్యులు ఉదయం 7.45 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆయనలో ఎలాంటి స్పందన లేదు. శ్వాస కూడా తీసుకోవడం లేదు. గుండె వైద్యనిపుణులు, అత్యవసర వైద్య సిబ్బంది మంత్రిని రక్షించేందుకు ప్రయత్నించారు. దాదాపు 90 నిమిషాలపాటు సీపీఆర్ చేశారు. తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది’ అని అపోలో వైద్య వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో అపోలో ఆసుపత్రి నుంచి గౌతమ్రెడ్డి భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్లోని నివాసానికి తరలించారు. ఆయన మృతి పట్ల ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, తెదేపా అధినేత చంద్రబాబు ఇతర ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులను పరామర్శించారు.
రెండుసార్లు కొవిడ్ నుంచి బయటపడి...
గౌతమ్రెడ్డికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తండ్రి ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి. తండ్రిబాటలోనే రాజకీయ అరంగేట్రం చేసి 2014, 2019ల్లో వరుసగా రెండుసార్లు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 2019లో వైకాపా అధికారంలోకి రావడంతో మంత్రి పదవి వరించింది. వివాదరహితుడిగా.. పరిశ్రమల, ఐటీ శాఖల్లో తనదైన ముద్ర వేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా దుబాయ్లో పర్యటించి, ఆదివారమే నగరానికి తిరిగొచ్చారు. గౌతమ్రెడ్డి రెండుసార్లు కొవిడ్ బారిన పడ్డారు. మొదటి వేవ్లోనే ఆయనకు కరోనా సోకగా హైదరాబాద్లోని ఒక ఆసుపత్రిలో రెండు, మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండి, కోలుకున్నారు. గత నెల 22న మరోసారి (కరోనా మూడో వేవ్లో) కొవిడ్ బారినపడి ఇంట్లోనే ఐసొలేషన్లో ఉండి కోలుకున్నారు. గుండె ఆరోగ్యంపై ఇది ప్రభావం చూపించిందా అనే అంశాన్ని కూడా వైద్య వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల గౌతమ్రెడ్డి బాగా శ్రద్ధ చూపుతుంటారు. నిత్యం రెండు గంటలపాటు వ్యాయామం చేస్తుంటారని సన్నిహితులు తెలిపారు. ఆరోగ్యపరంగానూ ఎలాంటి సమస్యలు లేవని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన హఠాన్మరణాన్ని కుటుంబసభ్యులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గౌతమ్రెడ్డి వ్యాయమం చేస్తూ ఉండగా గుండెపోటుకు లోనయ్యారనే ప్రచారం అవాస్తవమని కుటుంబ సభ్యులు తెలిపారు.
అపోలోకు తెలంగాణ మంత్రులు
గౌతమ్రెడ్డి మృతి వార్త తెలియగానే తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, పువ్వాడ అజయ్కుమార్, ఇంద్రకరణ్రెడ్డి, రాజ్యసభ సభ్యులు సురేష్రెడ్డి, వైతెపా అధ్యక్షురాలు షర్మిల, సీఎం జగన్ తల్లి విజయమ్మ, తదితరులు అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన మృతికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సంతాపం తెలిపారు.
రెండు రోజులు సంతాప దినాలు
ఏపీ ప్రభుత్వం సోమ, మంగళవారాల్ని సంతాప దినాలుగా ప్రకటించింది. గౌతమ్అంత్యక్రియలు బుధవారం ఉ. 11 గంటలకు నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్నారు.
నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది
- నాగేశ్వరరావు, డ్రైవర్, ప్రత్యక్షసాక్షి
సోమవారం ఉదయం 7.20 సమయంలో నిద్ర లేచి బయటకు వచ్చిన ఆయన సోఫాలో కూర్చున్నారు. ఒక్కసారిగా గుండెను చేతితో పట్టుకొని విలవిలలాడిపోయారు. గట్టిగా పిలవడంతో కింద ఉన్న నేను పరుగెత్తుకుంటూ పైకి వచ్చాను. అప్పటికే ఆయన కింద పడిపోయి ఉన్నారు. కూర్చోబెట్టి గుండెలపై బాగా వత్తాను. మంచినీళ్లు అడిగారు. తెచ్చి ఇచ్చినా తాగలేదు. వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు లిఫ్ట్ వద్దకు తీసుకొచ్చేసరికి నాలుక మడతపడింది. నెమ్మదిగా అపస్మారక స్థితికి వెళ్లిపోతున్నారు. కారులో పడుకోబెట్టి 13 నిమిషాల్లోనే ఆసుపత్రికి తీసుకొచ్చాం. కారులో వచ్చేటప్పుడు శ్వాస ఉంది కానీ మాట్లాడలేదు. ఆసుపత్రిలో చేర్పించాం. ఆయన ఉదయం 8 గంటలకు జిమ్కు వెళ్లాల్సి ఉంది. అంతలోనే ఈ ఘటన జరిగింది. ఆదివారం రాత్రి ఒక ఫంక్షన్కు వెళ్లి రాత్రి 9.30 గంటలకు తిరిగి వచ్చాం. మాకు దేవుడులాంటి మా సార్.. దూరమవడం జీర్ణించుకోలేకపోతున్నాం.
గౌతమ్రెడ్డి వ్యక్తిగతం
స్వస్థలం: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లి
జననం : 2-11-1971
కుటుంబం: భార్య శ్రీకీర్తి, కుమార్తె సాయి అనన్యరెడ్డి, కుమారుడు అర్జున్ రెడ్డి
విద్యాభ్యాసం: ఊటీలోని గుడ్షెపర్డ్లో పాఠశాల విద్య, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్లస్ టూ, భద్రుకా కళాశాలలో డిగ్రీ, మాంచెస్టర్లోని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్లో ఎమ్మెస్సీ (టెక్స్టైల్స్) పూర్తి చేశారు.
గౌతమ్రెడ్డితో పదేళ్లకు పైగా స్నేహం
- మంత్రి కేటీఆర్
గౌతమ్రెడ్డి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయనతో నాకు దాదాపు 10- 12 ఏళ్ల అనుబంధం ఉంది. అద్భుతమైన భవిష్యత్తున్న నాయకుడు ఇలా మృతి చెందడం ఎంతో బాధించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..