స్థిరాస్తి వివాదాల్లో ‘పేలుతున్న తూటాలు’
సిద్దిపేట వద్ద దుబ్బాక-గజ్వేల్ రహదారిపై గత బుధవారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వంశీకృష్ణపై దగ్గరి బంధువే అయిన తిరుపతి రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు.
రాష్ట్రంలో పెరుగుతున్న ఆయుధ సంస్కృతి
ఉత్తరాది నుంచి అక్రమంగా దిగుమతి
కట్టడికి ప్రణాళిక రూపొందిస్తున్న పోలీసులు
* సిద్దిపేట వద్ద దుబ్బాక-గజ్వేల్ రహదారిపై గత బుధవారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వంశీకృష్ణపై దగ్గరి బంధువే అయిన తిరుపతి రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు.
* ఈ నెల 1న ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు స్థిరాస్తి వ్యాపారులు మృతి చెందారు.
* జనవరి 31న సిద్దిపేట సబ్రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కారుపై కాల్పులు జరిపి రూ.43.5 లక్షలు దోచుకెళ్లారు.
* గత నవంబరులో హైదరాబాద్లోని తిరుమలగిరి పోలీస్స్టేషన్ పరిధిలో స్థిరాస్తి కమీషన్కు సంబంధించి మొదలైన వివాదంలో భాగంగా తోట నరేందర్రెడ్డి అనే వ్యక్తి వరుసకు సోదరుడయ్యే తోట విజయభాస్కర్రెడ్డిని పిస్తోలుతో కాల్చిచంపాడు.
రాష్ట్రంలో అక్రమ ఆయుధాలు అలజడి సృష్టిస్తున్నాయి. గత నాలుగైదు నెలల వ్యవధిలో జరిగిన ఘటనలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఇవి అధికారులనూ ఆందోళనకు గురిచేస్తున్నాయి. సిద్దిపేట తదితర ప్రాంతాల్లో నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు తుపాకులు పేలడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఉత్తరాది నుంచి ఆయుధాలు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయని.. వాటిని సరఫరా చేసే ముఠాలు రంగంలోకి దిగాయని వారు భావిస్తున్నారు. గత ఏడాది రాష్ట్రంలో 88 ఆయుధాలు, 171 రౌండ్ల మందుగుండు పట్టుబడిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నానాటికీ పెరుగుతున్న ఈ ఆయుధాల సంస్కృతి ఎటువైపు దారితీస్తుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
రూ.10 వేలకో రివాల్వర్
ఇబ్రహీంపట్నం జంట హత్యలకు వాడిన ఆయుధాలను ప్రధాన నిందితుడు మట్టారెడ్డి బిహార్ నుంచి తెప్పించాడు. ఒక పిస్తోలు, ఒక రివాల్వర్, 21 రౌండ్లు కలిపి రూ.1.1 లక్షలకు కొనుగోలు చేశాడు. బిహార్లోని శివాన్ జిల్లాకు చెందిన సమీర్ అలీ ద్వారా తుపాకులు తెప్పించుకున్నాడు. ఇందుకోసం మట్టారెడ్డికి సంబంధించినవారు కారులో వెళ్లారు. ఉపాధి అవకాశాల కోసం ఉత్తరాది నుంచి వేల సంఖ్యలో జనం రాష్ట్రానికి ముఖ్యంగా రాజధానికి చేరుకుంటున్నారు. దళారులు వారి ద్వారా సంప్రదింపులు జరుపుతూ.. కొనుగోలుదారులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారు. రూ.10 వేలు పెడితే రివాల్వర్, రూ.30 వేలకు ఆటోమేటిక్ పిస్తోలు అమ్ముతున్నారు. మధ్యప్రదేశ్లోని ఝాన్సీ, రాజస్థాన్లోని భరత్పుర్, పశ్చిమబెంగాల్లోని మాల్దాలతోపాటు బిహార్, ఉత్తర్ప్రదేశ్లలోని అనేక ప్రాతాల్లో ఆయుధాలు తయారు చేస్తున్నారు. గత ఏడాది బిహార్ రాజధాని పట్నా సమీపంలోని సబల్పుర్ గ్రామంలో ఓ ఆయుధ తయారీ పరిశ్రమపై స్థానిక పోలీసులు దాడి చేశారు. భద్రతా సంస్థలు వాడే ఆటోమేటిక్ పిస్తోళ్లు రోజుకు 15 వరకూ తయారు చేసి ఒక్కోటి రూ.6500లకు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఇలాంటి ఉదంతాలు ఉత్తరాదిలో కోకొల్లలు.
కొందరికి ఆయుధాల రవాణాయే వృత్తి..
హైదరాబాద్లో ఆయుధాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. అధికారికంగా లైసెన్సులు ఇవ్వడాన్ని కఠినతరం చేశారు. ఉన్న లైసెన్సులనూ క్రమంగా తగ్గిస్తున్నారు. దాంతో అనేకమంది ముఖ్యంగా స్థిరాస్తి వ్యాపారులు అనధికారికంగా ఆయుధాలు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆయుధాల రవాణాను కొందరు వృత్తిగా మలచుకుంటున్నారని, నగరానికి చెందిన పలువురు యువకులు మహారాష్ట్రలోని నాందేడ్, ఔరంగాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లి తీసుకొస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఓ అధికారి వెల్లడించారు. ఆయుధాల వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి ఉన్న అవకాశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ‘గతంలో వ్యవస్థీకృత ముఠాలు నేరాలకు పాల్పడేవి. ఇందులో ఒకరిపై మరొకరు నిఘా పెట్టుకొని తమకు సమాచారం ఇచ్చేవారు. దాంతోపాటు ఆ ముఠాల వివరాలు మా రికార్డుల్లో ఉంటాయి కాబట్టి మేమూ గమనిస్తూ ఉండేవారం. ఇప్పుడు ఎవరికివారే నేరాలకు పాల్పడుతుండటం, ఆయుధాలు తెప్పించుకుంటుండటంతో సమాచారం అందడం కష్టంగా మారింది’ అని రాచకొండకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఆయుధాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.
- ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ