స్థిరాస్తి వివాదాల్లో ‘పేలుతున్న తూటాలు’
సిద్దిపేట వద్ద దుబ్బాక-గజ్వేల్ రహదారిపై గత బుధవారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వంశీకృష్ణపై దగ్గరి బంధువే అయిన తిరుపతి రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు.
రాష్ట్రంలో పెరుగుతున్న ఆయుధ సంస్కృతి
ఉత్తరాది నుంచి అక్రమంగా దిగుమతి
కట్టడికి ప్రణాళిక రూపొందిస్తున్న పోలీసులు
* సిద్దిపేట వద్ద దుబ్బాక-గజ్వేల్ రహదారిపై గత బుధవారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వంశీకృష్ణపై దగ్గరి బంధువే అయిన తిరుపతి రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు.
* ఈ నెల 1న ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు స్థిరాస్తి వ్యాపారులు మృతి చెందారు.
* జనవరి 31న సిద్దిపేట సబ్రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కారుపై కాల్పులు జరిపి రూ.43.5 లక్షలు దోచుకెళ్లారు.
* గత నవంబరులో హైదరాబాద్లోని తిరుమలగిరి పోలీస్స్టేషన్ పరిధిలో స్థిరాస్తి కమీషన్కు సంబంధించి మొదలైన వివాదంలో భాగంగా తోట నరేందర్రెడ్డి అనే వ్యక్తి వరుసకు సోదరుడయ్యే తోట విజయభాస్కర్రెడ్డిని పిస్తోలుతో కాల్చిచంపాడు.
రాష్ట్రంలో అక్రమ ఆయుధాలు అలజడి సృష్టిస్తున్నాయి. గత నాలుగైదు నెలల వ్యవధిలో జరిగిన ఘటనలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఇవి అధికారులనూ ఆందోళనకు గురిచేస్తున్నాయి. సిద్దిపేట తదితర ప్రాంతాల్లో నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు తుపాకులు పేలడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఉత్తరాది నుంచి ఆయుధాలు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయని.. వాటిని సరఫరా చేసే ముఠాలు రంగంలోకి దిగాయని వారు భావిస్తున్నారు. గత ఏడాది రాష్ట్రంలో 88 ఆయుధాలు, 171 రౌండ్ల మందుగుండు పట్టుబడిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నానాటికీ పెరుగుతున్న ఈ ఆయుధాల సంస్కృతి ఎటువైపు దారితీస్తుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
రూ.10 వేలకో రివాల్వర్
ఇబ్రహీంపట్నం జంట హత్యలకు వాడిన ఆయుధాలను ప్రధాన నిందితుడు మట్టారెడ్డి బిహార్ నుంచి తెప్పించాడు. ఒక పిస్తోలు, ఒక రివాల్వర్, 21 రౌండ్లు కలిపి రూ.1.1 లక్షలకు కొనుగోలు చేశాడు. బిహార్లోని శివాన్ జిల్లాకు చెందిన సమీర్ అలీ ద్వారా తుపాకులు తెప్పించుకున్నాడు. ఇందుకోసం మట్టారెడ్డికి సంబంధించినవారు కారులో వెళ్లారు. ఉపాధి అవకాశాల కోసం ఉత్తరాది నుంచి వేల సంఖ్యలో జనం రాష్ట్రానికి ముఖ్యంగా రాజధానికి చేరుకుంటున్నారు. దళారులు వారి ద్వారా సంప్రదింపులు జరుపుతూ.. కొనుగోలుదారులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారు. రూ.10 వేలు పెడితే రివాల్వర్, రూ.30 వేలకు ఆటోమేటిక్ పిస్తోలు అమ్ముతున్నారు. మధ్యప్రదేశ్లోని ఝాన్సీ, రాజస్థాన్లోని భరత్పుర్, పశ్చిమబెంగాల్లోని మాల్దాలతోపాటు బిహార్, ఉత్తర్ప్రదేశ్లలోని అనేక ప్రాతాల్లో ఆయుధాలు తయారు చేస్తున్నారు. గత ఏడాది బిహార్ రాజధాని పట్నా సమీపంలోని సబల్పుర్ గ్రామంలో ఓ ఆయుధ తయారీ పరిశ్రమపై స్థానిక పోలీసులు దాడి చేశారు. భద్రతా సంస్థలు వాడే ఆటోమేటిక్ పిస్తోళ్లు రోజుకు 15 వరకూ తయారు చేసి ఒక్కోటి రూ.6500లకు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఇలాంటి ఉదంతాలు ఉత్తరాదిలో కోకొల్లలు.
కొందరికి ఆయుధాల రవాణాయే వృత్తి..
హైదరాబాద్లో ఆయుధాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. అధికారికంగా లైసెన్సులు ఇవ్వడాన్ని కఠినతరం చేశారు. ఉన్న లైసెన్సులనూ క్రమంగా తగ్గిస్తున్నారు. దాంతో అనేకమంది ముఖ్యంగా స్థిరాస్తి వ్యాపారులు అనధికారికంగా ఆయుధాలు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆయుధాల రవాణాను కొందరు వృత్తిగా మలచుకుంటున్నారని, నగరానికి చెందిన పలువురు యువకులు మహారాష్ట్రలోని నాందేడ్, ఔరంగాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లి తీసుకొస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఓ అధికారి వెల్లడించారు. ఆయుధాల వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి ఉన్న అవకాశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ‘గతంలో వ్యవస్థీకృత ముఠాలు నేరాలకు పాల్పడేవి. ఇందులో ఒకరిపై మరొకరు నిఘా పెట్టుకొని తమకు సమాచారం ఇచ్చేవారు. దాంతోపాటు ఆ ముఠాల వివరాలు మా రికార్డుల్లో ఉంటాయి కాబట్టి మేమూ గమనిస్తూ ఉండేవారం. ఇప్పుడు ఎవరికివారే నేరాలకు పాల్పడుతుండటం, ఆయుధాలు తెప్పించుకుంటుండటంతో సమాచారం అందడం కష్టంగా మారింది’ అని రాచకొండకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఆయుధాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.
- ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. ద్విచక్ర వాహనదారుల బాధలు వర్ణనాతీతం. -
కళాశాల గురువును కలిసిన కేసీఆర్
జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి సోమవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లాకు బయలుదేరేముందు తన గురువైన చరిత్రకారుడు డాక్టర్ జైశెట్టి రమణయ్య ఇంటికి కేసీఆర్ వెళ్లారు. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక
మేడిగడ్డ బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మధ్యంతర నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖకు సోమవారం పంపింది. -
ఐదు ఎకరాలు దాటిన వారికి రైతుబంధు
రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద యాసంగి సీజన్కు గాను ఐదు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు సైతం ప్రభుత్వం నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించింది. -
కొనసాగిన తీవ్ర ఎండలు
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం ఎండలు మంటలు రేపాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉడికిపోయింది. జగిత్యాల జిల్లా అల్లీపూర్, గుళ్లకోటలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
2024.. అత్యంత వేడి సంవత్సరం
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్లు ‘క్లైమేట్ ట్రెండ్స్’ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
కవితకు బెయిల్ నిరాకరణ
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కె.కవితకు బెయిల్ ఇవ్వడానికి ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. -
కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని, 33.67 శాతం కరవుభత్యంతో కలిపి 2023 జులై మొదటి తేదీ వర్తించేలా కొత్త వేతన సవరణ అమలు చేయాలని టీఎన్జీవోల సంఘం పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
మరో రూ.20 చెల్లిస్తే డీలక్స్లో ప్రయాణం: ఆర్టీసీ
ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణానికి మంత్లీ సీజన్ టికెట్ పాస్లు ఉన్న వారు డీలక్స్ బస్సులూ ఎక్కొచ్చని అయితే ప్రతిసారి అదనంగా రూ.20 చెల్లించాలని ఆర్టీసీ పేర్కొంది. -
ఆ భూముల్లోంచి పిటిషనర్లను ఖాళీ చేయించొద్దు
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిమిత్తం చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో 9.03 ఎకరాలు, సిద్దిపేట జిల్లా గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పాములపర్తిలో 14 ఎకరాల నుంచి యజమానులను ఖాళీ చేయించరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
వసతి గృహాల్లో సౌకర్యాల మెరుగుకు నివేదికివ్వండి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో సౌకర్యాలను మెరుగుపరిచి.. అమలు నివేదికను సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మార్ఫింగ్ వీడియో కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని.. దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదని హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. -
న్యుమోనియా నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్
చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, న్యుమోనియాను నిర్ధారించేందుకు ట్రిపుల్ఐటీ హైదరాబాద్లోని ఐసీ-వైబ్స్ పరిశోధనా ప్రయోగశాల వైర్లెస్ డిటెక్టర్ను ఆవిష్కరించింది. -
మారిన ‘నీట్’ ప్రశ్నపత్రం.. ఆందోళనలో విద్యార్థులు
ఆసిఫాబాద్లోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన నీట్ పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాలు తారుమారయ్యాయని విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం కలెక్టర్ వెంకటేశ్కు ఫిర్యాదు చేశారు. -
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతన బకాయిలు చెల్లించాలి
రెండు నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. -
పంట నష్టపరిహారం నిధుల విడుదల
రాష్ట్రంలో గత మార్చి 16 నుంచి 21 వరకు వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు రూ.15.81 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. -
ఇదీ సంగతి!