Telangana News: మున్నాభాయ్ ఎండీబీఎస్
చదివింది ఎంబీబీఎస్ అయినా పేరు పక్కన ఎండీ అని పెట్టుకొని స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ వైద్యులుగా చలామణీ అవుతున్నారు కొందరు వైద్యులు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఒక వైద్యుడు ఎంబీబీఎస్ చదివినా.. తన పేరు పక్కన ఎండీ జనరల్ మెడిసిన్, కార్డియాలజీ అని పెట్టుకున్నాడు.
విదేశాల్లో ఎంబీబీఎస్ చదువు.. పేరు పక్కన ఎండీ హోదా
తప్పుడు అర్హతలతో చికిత్స అందిస్తున్న కొందరు వైద్యులు
డిప్లొమా కోర్సులు చేసి స్పెషలిస్టుల అవతారమెత్తుతున్న మరికొందరు
ఈ తరహా మోసాలపై అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు
ఈనాడు - హైదరాబాద్
చదివింది ఎంబీబీఎస్ అయినా పేరు పక్కన ఎండీ అని పెట్టుకొని స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ వైద్యులుగా చలామణీ అవుతున్నారు కొందరు వైద్యులు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఒక వైద్యుడు ఎంబీబీఎస్ చదివినా.. తన పేరు పక్కన ఎండీ జనరల్ మెడిసిన్, కార్డియాలజీ అని పెట్టుకున్నాడు. ఈ విషయంపై తాజాగా తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి(టీఎస్ఎంసీ)కి ఫిర్యాదు అందింది. వెంటనే స్పందించిన టీఎస్ఎంసీ- ఆ వైద్యుడి నుంచి వివరణ కోరడమే కాకుండా సంబంధిత జిల్లా వైద్యాధికారికి ఆదేశాలిచ్చి ఆ క్లినిక్ను మూసివేయించింది. తప్పుడు అర్హతలతో ప్రాక్టీసు చేస్తున్నారనే ఆరోపణలతో స్థానిక పోలీసులకు ఫిర్యాదూ చేసింది.
‘ఎండీ’ పట్టాతో మోసాలు
కొందరు వైద్యులు తమకు లేని స్పెషాలిటీ విద్యార్హతను వాడుకునేందుకు విదేశీ వైద్యవిద్య పట్టాలను వినియోగించుకుంటున్నారు. చైనా సహా కొన్ని దేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసినవారికి ‘ఎండీ’ పట్టా ఇస్తున్నారు. అక్కడి ఎండీ పట్టా.. మన దగ్గరి ఎంబీబీఎస్ పట్టాతో సమానం. విదేశాల్లో వైద్యవిద్య పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత.. భారత్లో అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైనవారు రాష్ట్ర వైద్య మండలిలో తమ సమాచారాన్ని తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఈ సందర్భంగా ‘ఎండీ ఇన్ చైనా ఈక్వలెంట్ టు ఎంబీబీఎస్’ అని ధ్రువపత్రంలో స్పష్టంగా పేర్కొంటున్నారు. అయినా కొందరు వైద్యులు పేరు పక్కన ఎండీ అని మాత్రమే రాసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. మరికొందరు ‘ఎండీ’ అని పెద్ద అక్షరాల్లో రాసి.. దాని కింద ‘ఈక్వలెంట్ టు ఎంబీబీఎస్’ అని కంటికి కనిపించనంత చిన్న అక్షరాల్లో రాస్తున్నారు. ఇంకొందరు ఎండీ పక్కన జనరల్ మెడిసిన్ అని, పీడియాట్రిక్స్ అని కూడా రాసుకుంటున్నారు. ‘కార్డియాలజీ’, ‘న్యూరాలజీ’ తదితర కోర్సుల్లో ఆర్నెల్ల డిప్లొమా కోర్సులు చేసిన కొందరు.. ఏకంగా కార్డియాలజిస్టులు, న్యూరాలజిస్టులుగా అవతారమెత్తుతున్నారు.
నిజానికి కార్డియాలజీ, న్యూరాలజీలలో మూడేళ్ల సూపర్ స్పెషాలిటీ కోర్సు చదివితే తప్ప సూపర్ స్పెషలిస్ట్గా ప్రాక్టీసు చేయడానికి అర్హత లభించదు. అయినా ఆర్నెల్ల డిప్లొమా కోర్సులతోనే సూపర్ స్పెషలిస్టులుగా బోర్డులు పెట్టుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా పెడధోరణులు పెరిగిపోయాయని, పేరున్న నగరాల్లో కాకుండా.. అంతగా ప్రాచుర్యం లేని పురపాలక పట్టణాల్లో ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని వైద్య మండలి వర్గాలు తెలిపాయి.
రోగులపై ఆర్థిక భారం
బోర్డులపై విద్యార్హతలను చూసి నిజంగానే స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యులనుకొని అనేకమంది రోగులు మోసపోతున్నారు. ఇదే అదనుగా రూ.వేలకు వేలు రుసుంలు, నిర్ధారణ పరీక్షల రూపంలో గుంజుతున్నారు. ఈసీజీ సహా అనేక పరీక్షలు చేయిస్తున్నారు. తమ వల్ల నయం కాకపోతే మరిన్ని పరీక్షలు చేయించాలని లేదా పెద్దాసుపత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. దీంతో రోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. మరోవైపు జబ్బును సకాలంలో, సక్రమంగా గుర్తించకపోతే.. అది ముదిరి ప్రాణాల మీదకూ వచ్చే ప్రమాదమూ లేకపోలేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. నిజానికి జిల్లాస్థాయిలో డీఎంహెచ్వోలు తరచూ ఇటువంటి క్లినిక్లను తనిఖీ చేయాలి. క్షేత్రస్థాయిలో అది జరగడం లేదు. కొన్నిచోట్ల గుర్తించినా.. అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఇది అనైతికం.. నేరం
-డాక్టర్ ఇ.రవీందర్రెడ్డి, టీఎస్ఎంసీ మాజీ ఛైర్మన్
విదేశాల్లో చదివే వైద్యవిద్య పేరుకు ‘ఎండీ’ అయినా అది మన ఎంబీబీఎస్కు సమాన అర్హతే. మన దేశంలో ప్రాక్టీసు చేసేటప్పుడు పేరు పక్కన ‘ఎంబీబీఎస్’ అనే రాసుకోవాలి. ‘ఎండీ’గా రాసుకోవడం అనైతికం.. నేరం కూడా. కొందరు వైద్యులు గ్రామాల్లో ప్రాక్టీసు చేసేటప్పుడు ఎంబీబీఎస్ తీసేసి.. కేవలం ఎండీ అని రాసుకుంటున్నారు. మన దగ్గర ఎండీ అంటే స్పెషలిస్టు వైద్యుడని అర్థం. ఇలా చేయడం రోగులను మోసగించడమే. కొందరు కొన్ని డిప్లొమా కోర్సులు చేసి.. సంబంధిత స్పెషలిస్ట్ విభాగాన్ని పేరు పక్కన తగిలించుకుంటున్నారు. ఇదీ మోసమే. ఇదే అంశంపై గతంలో భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) నిర్వహించిన సమావేశాల్లోనూ చర్చించాం. అర్హత లేని వైద్యులపై జిల్లా వైద్యాధికారులు నిఘా పెంచాలి.
అనుమానమొస్తే ఫిర్యాదు చేయాలి
-హనుమంతరావు, టీఎస్ఎంసీ రిజిస్ట్రార్
జమ్మికుంటలో ఓ ఎంబీబీఎస్ వైద్యుడు తన పేరు పక్కన జనరల్ మెడిసిన్, కార్డియాలజీ విద్యార్హతలు పెట్టుకున్న అంశంపై విచారణ కొనసాగుతోంది. ఇలాంటి ఫిర్యాదులు మరికొన్ని వచ్చాయి. వాటిపైనా దృష్టి పెట్టాం. తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చాం. ప్రతి వైద్యుడు తాను నిర్వహిస్తున్న క్లినిక్లో రాష్ట్ర వైద్య మండలి జారీ చేసిన విద్యార్హత ధ్రువపత్రాన్ని తప్పనిసరిగా ప్రదర్శించాలి. వైద్య సేవలు పొందే రోగులు దాన్ని పరిశీలించాలి. అనుమానం వస్తే కోఠిలోని టీఎస్ఎంసీ కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చు.
ఇక్కడ ఫిర్యాదు చేయవచ్చు
రాష్ట్ర వైద్య మండలి(టీఎస్ఎంసీ):
పి.బి.523, తపాలా కార్యాలయం సమీపంలో, ఉమెన్స్ కళాశాల ఎదురుగా, సుల్తాన్ బజార్, హైదరాబాద్- 500095
ఈ-మెయిల్: telanganamedicalcouncil@gmail.com
ఫోన్ నంబర్: +91 40 65577343
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్