Telangana News: మున్నాభాయ్ ఎండీబీఎస్
చదివింది ఎంబీబీఎస్ అయినా పేరు పక్కన ఎండీ అని పెట్టుకొని స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ వైద్యులుగా చలామణీ అవుతున్నారు కొందరు వైద్యులు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఒక వైద్యుడు ఎంబీబీఎస్ చదివినా.. తన పేరు పక్కన ఎండీ జనరల్ మెడిసిన్, కార్డియాలజీ అని పెట్టుకున్నాడు.
విదేశాల్లో ఎంబీబీఎస్ చదువు.. పేరు పక్కన ఎండీ హోదా
తప్పుడు అర్హతలతో చికిత్స అందిస్తున్న కొందరు వైద్యులు
డిప్లొమా కోర్సులు చేసి స్పెషలిస్టుల అవతారమెత్తుతున్న మరికొందరు
ఈ తరహా మోసాలపై అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు
ఈనాడు - హైదరాబాద్
చదివింది ఎంబీబీఎస్ అయినా పేరు పక్కన ఎండీ అని పెట్టుకొని స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ వైద్యులుగా చలామణీ అవుతున్నారు కొందరు వైద్యులు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఒక వైద్యుడు ఎంబీబీఎస్ చదివినా.. తన పేరు పక్కన ఎండీ జనరల్ మెడిసిన్, కార్డియాలజీ అని పెట్టుకున్నాడు. ఈ విషయంపై తాజాగా తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి(టీఎస్ఎంసీ)కి ఫిర్యాదు అందింది. వెంటనే స్పందించిన టీఎస్ఎంసీ- ఆ వైద్యుడి నుంచి వివరణ కోరడమే కాకుండా సంబంధిత జిల్లా వైద్యాధికారికి ఆదేశాలిచ్చి ఆ క్లినిక్ను మూసివేయించింది. తప్పుడు అర్హతలతో ప్రాక్టీసు చేస్తున్నారనే ఆరోపణలతో స్థానిక పోలీసులకు ఫిర్యాదూ చేసింది.
‘ఎండీ’ పట్టాతో మోసాలు
కొందరు వైద్యులు తమకు లేని స్పెషాలిటీ విద్యార్హతను వాడుకునేందుకు విదేశీ వైద్యవిద్య పట్టాలను వినియోగించుకుంటున్నారు. చైనా సహా కొన్ని దేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసినవారికి ‘ఎండీ’ పట్టా ఇస్తున్నారు. అక్కడి ఎండీ పట్టా.. మన దగ్గరి ఎంబీబీఎస్ పట్టాతో సమానం. విదేశాల్లో వైద్యవిద్య పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత.. భారత్లో అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైనవారు రాష్ట్ర వైద్య మండలిలో తమ సమాచారాన్ని తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఈ సందర్భంగా ‘ఎండీ ఇన్ చైనా ఈక్వలెంట్ టు ఎంబీబీఎస్’ అని ధ్రువపత్రంలో స్పష్టంగా పేర్కొంటున్నారు. అయినా కొందరు వైద్యులు పేరు పక్కన ఎండీ అని మాత్రమే రాసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. మరికొందరు ‘ఎండీ’ అని పెద్ద అక్షరాల్లో రాసి.. దాని కింద ‘ఈక్వలెంట్ టు ఎంబీబీఎస్’ అని కంటికి కనిపించనంత చిన్న అక్షరాల్లో రాస్తున్నారు. ఇంకొందరు ఎండీ పక్కన జనరల్ మెడిసిన్ అని, పీడియాట్రిక్స్ అని కూడా రాసుకుంటున్నారు. ‘కార్డియాలజీ’, ‘న్యూరాలజీ’ తదితర కోర్సుల్లో ఆర్నెల్ల డిప్లొమా కోర్సులు చేసిన కొందరు.. ఏకంగా కార్డియాలజిస్టులు, న్యూరాలజిస్టులుగా అవతారమెత్తుతున్నారు.
నిజానికి కార్డియాలజీ, న్యూరాలజీలలో మూడేళ్ల సూపర్ స్పెషాలిటీ కోర్సు చదివితే తప్ప సూపర్ స్పెషలిస్ట్గా ప్రాక్టీసు చేయడానికి అర్హత లభించదు. అయినా ఆర్నెల్ల డిప్లొమా కోర్సులతోనే సూపర్ స్పెషలిస్టులుగా బోర్డులు పెట్టుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా పెడధోరణులు పెరిగిపోయాయని, పేరున్న నగరాల్లో కాకుండా.. అంతగా ప్రాచుర్యం లేని పురపాలక పట్టణాల్లో ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని వైద్య మండలి వర్గాలు తెలిపాయి.
రోగులపై ఆర్థిక భారం
బోర్డులపై విద్యార్హతలను చూసి నిజంగానే స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యులనుకొని అనేకమంది రోగులు మోసపోతున్నారు. ఇదే అదనుగా రూ.వేలకు వేలు రుసుంలు, నిర్ధారణ పరీక్షల రూపంలో గుంజుతున్నారు. ఈసీజీ సహా అనేక పరీక్షలు చేయిస్తున్నారు. తమ వల్ల నయం కాకపోతే మరిన్ని పరీక్షలు చేయించాలని లేదా పెద్దాసుపత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. దీంతో రోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. మరోవైపు జబ్బును సకాలంలో, సక్రమంగా గుర్తించకపోతే.. అది ముదిరి ప్రాణాల మీదకూ వచ్చే ప్రమాదమూ లేకపోలేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. నిజానికి జిల్లాస్థాయిలో డీఎంహెచ్వోలు తరచూ ఇటువంటి క్లినిక్లను తనిఖీ చేయాలి. క్షేత్రస్థాయిలో అది జరగడం లేదు. కొన్నిచోట్ల గుర్తించినా.. అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఇది అనైతికం.. నేరం
-డాక్టర్ ఇ.రవీందర్రెడ్డి, టీఎస్ఎంసీ మాజీ ఛైర్మన్
విదేశాల్లో చదివే వైద్యవిద్య పేరుకు ‘ఎండీ’ అయినా అది మన ఎంబీబీఎస్కు సమాన అర్హతే. మన దేశంలో ప్రాక్టీసు చేసేటప్పుడు పేరు పక్కన ‘ఎంబీబీఎస్’ అనే రాసుకోవాలి. ‘ఎండీ’గా రాసుకోవడం అనైతికం.. నేరం కూడా. కొందరు వైద్యులు గ్రామాల్లో ప్రాక్టీసు చేసేటప్పుడు ఎంబీబీఎస్ తీసేసి.. కేవలం ఎండీ అని రాసుకుంటున్నారు. మన దగ్గర ఎండీ అంటే స్పెషలిస్టు వైద్యుడని అర్థం. ఇలా చేయడం రోగులను మోసగించడమే. కొందరు కొన్ని డిప్లొమా కోర్సులు చేసి.. సంబంధిత స్పెషలిస్ట్ విభాగాన్ని పేరు పక్కన తగిలించుకుంటున్నారు. ఇదీ మోసమే. ఇదే అంశంపై గతంలో భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) నిర్వహించిన సమావేశాల్లోనూ చర్చించాం. అర్హత లేని వైద్యులపై జిల్లా వైద్యాధికారులు నిఘా పెంచాలి.
అనుమానమొస్తే ఫిర్యాదు చేయాలి
-హనుమంతరావు, టీఎస్ఎంసీ రిజిస్ట్రార్
జమ్మికుంటలో ఓ ఎంబీబీఎస్ వైద్యుడు తన పేరు పక్కన జనరల్ మెడిసిన్, కార్డియాలజీ విద్యార్హతలు పెట్టుకున్న అంశంపై విచారణ కొనసాగుతోంది. ఇలాంటి ఫిర్యాదులు మరికొన్ని వచ్చాయి. వాటిపైనా దృష్టి పెట్టాం. తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చాం. ప్రతి వైద్యుడు తాను నిర్వహిస్తున్న క్లినిక్లో రాష్ట్ర వైద్య మండలి జారీ చేసిన విద్యార్హత ధ్రువపత్రాన్ని తప్పనిసరిగా ప్రదర్శించాలి. వైద్య సేవలు పొందే రోగులు దాన్ని పరిశీలించాలి. అనుమానం వస్తే కోఠిలోని టీఎస్ఎంసీ కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చు.
ఇక్కడ ఫిర్యాదు చేయవచ్చు
రాష్ట్ర వైద్య మండలి(టీఎస్ఎంసీ):
పి.బి.523, తపాలా కార్యాలయం సమీపంలో, ఉమెన్స్ కళాశాల ఎదురుగా, సుల్తాన్ బజార్, హైదరాబాద్- 500095
ఈ-మెయిల్: telanganamedicalcouncil@gmail.com
ఫోన్ నంబర్: +91 40 65577343
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు తరలింపుపై ప్రతిష్టంభన
సింగరేణి గనుల నుంచి బొగ్గు రవాణా విషయంలో కొంత ప్రతిష్టంభన నెలకొంది. వర్షాకాలం వస్తున్నందున బొగ్గు ఉత్పత్తి తగ్గుతుంది. -
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
విద్యుత్ అంతరాయాల నివారణకు ప్రత్యేక చర్యలు
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) పరిధిలో కరెంటు సరఫరాలో అంతరాయాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డిస్కం పరిధిలో ఉన్న 16 సర్కిళ్లకు 16 మంది నోడల్ అధికారులను నియమించారు. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
రేపు ఈసెట్ ఫలితాలు
పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ , బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ ఫలితాలను ఈ నెల 20న విడుదల చేయనున్నారు. -
4 నెలల్లో 1,300 ఫోన్ల ట్యాపింగ్!
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్తున్నకొద్దీ విస్మయకర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దందా సుదీర్ఘకాలంగా సాగినా ఇటీవలి శాసనసభ ఎన్నికల సమయంలో తార స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. -
ఆర్ఆర్ఆర్ అటవీ భూసేకణ మళ్లీ మొదటికి..!
హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డు ఆవల నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు కోసం అటవీ భూసేకరణ కథ మళ్లీ మొదటికి వచ్చింది. సకాలంలో వివరాలు ఇవ్వకపోవటంతో మునుపటి ప్రతిపాదనల దరఖాస్తు రద్దు అయినట్లు సమాచారం. -
ఎప్సెట్ ఇంజినీరింగ్లో 74.98% ఉత్తీర్ణత
టీఎస్ ఎప్సెట్-2024 ఇంజినీరింగ్ విభాగంలో 74.98 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 89.66 శాతం మంది అర్హత సాధించారు. -
మాదంటే మాదే!
భూవివాదంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తతకు దారితీసింది. -
ముందస్తు వానాకాలం
రాష్ట్రంలో జూన్ 5వ తేదీ తరువాత తెరిపినిచ్చే వేసవి ఎండలు ఈ ఏడాది ముందస్తు వానలతో మే నెలలోనే చల్లబడ్డాయి. శనివారం సాయంత్రం కూడా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఆకస్మిక వర్షాలు కురిశాయి. -
మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదే
‘మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో పునరుద్ధరణ పనులను నిర్మాణ సంస్థే చేయాల్సి ఉండగా ఎందుకు చేయడం లేదు? పని పూర్తి కాకుండానే సర్టిఫికెట్ ఇచ్చిన ఇంజినీర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. -
మంత్రి మండలి సమావేశం వాయిదా
తెలంగాణ సచివాలయంలో శనివారం జరగాల్సిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు సమావేశంలో పాల్గొనేందుకు సచివాలయానికి వచ్చి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎదురు చూసినా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నుంచి అనుమతి రాలేదు. -
ప్రభుత్వ రంగంలో తొలి మెగాఫుడ్ పార్క్
దాదాపు 200 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు.. అత్యుత్తమ ఆహారశుద్ధి వనరులు.. రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారుల కార్యకలాపాలకు వేదిక... 25 వేల మందికి ఉపాధి అవకాశాలు.. రాయితీలు, ప్రోత్సాహకాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో రాష్ట్రంలోనే అతి పెద్దదైన మెగా ఫుడ్పార్క్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ప్రారంభానికి సిద్ధమైంది. -
జూన్ 1 నుంచి యాదాద్రిలో సంప్రదాయ దుస్తులతో ఆర్జిత పూజలు
యాదాద్రిలో పంచనారసింహుల దైవారాధనల్లో (ఆర్జిత పూజలు) పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని, ఈ ఆచారాన్ని జూన్ 1 నుంచి ఆచరణలోకి తెస్తున్నట్లు ఆలయ ఈవో ఎ.భాస్కర్రావు వెల్లడించారు. -
ఆరోగ్య సంరక్షణకు రూ.1,411 కోట్లు
ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ.1,411 కోట్లను వ్యయం చేయనున్నారు. -
పార్వతి బ్యారేజీ ఖాళీ
కాళేశ్వరం పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి(సుందిళ్ల) బ్యారేజీ నుంచి నీటిని దిగువన గోదావరిలోకి వదలడంతో జలాశయం వెలవెలబోతోంది. -
ఎవరెస్ట్ బేస్క్యాంప్పై తెలంగాణ యువకుడు
దేశంలో అన్ని కులాలు, మతాలు సమానమనే సందేశాన్ని చాటుతూ..ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించారు హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటి రాజిపేటలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన ఏకు చిరంజీవి. -
ఉచిత పరీక్షలతో పేద రోగులకు ఊరట
క్యాన్సర్ ఉన్న వారిలో దాని మ్యుటేషన్ (ఉత్పరివర్తనం) ఎలా ఉందని గుర్తించేందుకు నిమ్స్లో ఆధునిక పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో భాగంగా మాలిక్యులర్ జెనెటిక్ పరీక్షలు ఉచితంగా చేస్తుండడంతో ఎంతో మంది పేద రోగులకు ఉపశమనం కలుగుతోంది. -
కేయూ వీసీపై విజిలెన్స్ విచారణకు ఆదేశం
కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేశ్పై విజిలెన్స్ విచారణ జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. -
వరంగల్ విమానాశ్రయంపై ముందడుగు
వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి చిక్కుముడులు ఒక్కటొక్కటిగా వీడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రాంతీయ విమానాశ్రయం విషయంలో కొంతకాలంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ (ఏఏఐ) వేచి చూసే ధోరణితో ఉంది.