యాజమాన్య హక్కుల కోసం ఎదురుచూపులు
భూములున్నాయి... కానీ వాటికి యాజమాన్య హక్కు ఉన్నట్లు నిర్ధరించే అవకాశం లేదు. పాసుపుస్తకాలిస్తే రైతుబంధు, బీమా వస్తాయి. కానీ సాంకేతిక సమస్యలతో అవి జారీ
పాసుపుస్తకాల జారీలోనూ జాప్యం
తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ రైతుల ప్రదక్షిణలు
ఈనాడు, హైదరాబాద్: భూములున్నాయి... కానీ వాటికి యాజమాన్య హక్కు ఉన్నట్లు నిర్ధరించే అవకాశం లేదు. పాసుపుస్తకాలిస్తే రైతుబంధు, బీమా వస్తాయి. కానీ సాంకేతిక సమస్యలతో అవి జారీ కావడంలేదు. తమ గోడు విని పరిష్కరించాలంటూ రైతులు, భూ యజమానులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం (ఎల్ఆర్యూపీ) అనంతరం ఆ సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేశారు. సమాచారం స్పష్టంగా ఉన్న రైతులకు పాసుపుస్తకాలు జారీ చేయగా.. మరికొందరికి రకరకాల సమస్యలతో నిలిచిపోయాయి. వీటిలో కొన్ని సిబ్బంది తప్పిదాలతోనూ ఆగిపోయాయి. ఇలాంటి సమస్యలను తరువాత పరిష్కరించవచ్చనే ఉద్దేశంతో వివాదాలతో కూడిన భూముల జాబితాలో (పార్ట్-బి) చేర్చారు. ఇలా పార్ట్-బిలో 10 లక్షల ఎకరాలు ఉన్నాయి. తీరా ధరణి పోర్టల్లో వీటికి ఐచ్ఛికాలు ఇవ్వకపోవడంతో ఆ సమస్యలన్నీ అపరిష్కృతంగా ఉండిపోయాయి. గత అక్టోబరులో ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం ఆర్వోఆర్-2020తో తహసీల్దార్ల అధికారాల్లో మార్పులు తెచ్చింది. వారికి పాసుపుస్తకాలను జారీ చేసే అధికారం కూడా పోయింది. వారు రిజిస్ట్రేషన్ల సేవలకే పరిమితమయ్యారు. రెవెన్యూ కోర్టుల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కానీ, అధికారుల సేవలతో ముడిపడి ఉన్న సమస్యలను పరిష్కరించే బాధ్యత ఎవరికిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
కొన్ని ఉదాహరణలు..
* ఎల్ఆర్యూపీ అనంతరం తాతల నుంచి వస్తున్న హక్కులు ఆన్లైన్లో లేకుండా పోయాయంటున్నారు భద్రాద్రి, ములుగు జిల్లాలకు చెందిన పలువురు రైతులు. ఓఆర్సీ, ఆర్ఎస్ఆర్ సమస్యలతో అక్టోబరు ముందు వరకు తిప్పించుకున్న రెవెన్యూ సిబ్బంది ఇప్పుడు తమకు సంబంధం లేదంటున్నారని వారు వాపోతున్నారు.
* రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం పెద్ద అంబర్పేటలో 0.33 ఎకరాల భూమి ఉన్న ఎన్.హనుమంతరావు తన భూమికి పట్టా పాసుపుస్తకం కోసం పది నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. డిజిటల్ సంతకం పెండింగ్లో ఉందంటూ మొన్నటివరకు ప్రభుత్వ వెబ్సైట్లో వివరాలు కనిపించాయి. ఇప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాలేదు.
* ఆదిలాబాద్ గ్రామీణ మండలానికి చెందిన అంబటి భూమన్న తన భూమికి యాజమాన్య హక్కులు కల్పించాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 9న మీ సేవ ద్వారా (నెం.022001863072) రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేశారు. పది నెలలైనా సమస్య పరిష్కారం కాలేదు. మరోవైపు ధరణి పోర్టల్ అమల్లోకి రావడంతో గత నెల 13న చలానా (నెం.9813933767816) కింద రూ.1550 చెల్లించి మరోసారి మ్యుటేషన్కు దరఖాస్తు చేశారు. ఆ సమాచారం ధరణిలో కనిపించడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు.
అపరిష్కృతంగా ఉన్న సమస్యల్లో కొన్ని..
* ఎల్ఆర్యూపీ సందర్భంగా ఆన్లైన్లో నమోదు చేసే క్రమంలో కొన్ని సర్వే నంబర్లలో విస్తీర్ణాలు తగ్గిపోయాయి. కొన్ని సర్వే నంబర్లు నమోదు చేయలేదు. ఆన్లైన్లో సర్వే నంబర్లు కనిపించని భూములకు పాసుపుస్తకాల జారీ నిలిచిపోయింది. ఇలా సర్వే నంబర్లు తప్పినవి, విస్తీర్ణాల్లో లోపాలున్నవి 2.15 లక్షల ఎకరాలున్నాయి.
* ఈ ఏడాది అక్టోబరు ముందు వరకు రిజిస్ట్రేషన్ పూర్తయిన భూములకు మ్యుటేషన్లు పూర్తి చేయాల్సి ఉంది. ఇలాంటివి 3.50 లక్షల ఖాతాలున్నాయి.
* కొందరు రైతుల భూదస్త్రాలపై తహసీల్దార్లు డిజిటల్ సంతకం (డీఎస్) చేయాల్సి ఉంది.
* ఆర్ఎస్ఆర్ (రెవెన్యూ సెటిల్మెంట్ రికార్డు) సమస్యతో కొందరు రైతులకు చెందిన భూముల విస్తీర్ణాలను తగ్గించారు.
* ఓఆర్సీ (భూమి అధీనంలో ఉన్నట్లు చూపే ధ్రువీకరణ పత్రం) ఉన్న రైతులకు యాజమాన్య హక్కులు కల్పించాల్సి ఉంది.
* ఏజెన్సీ ప్రాంతంలో భూ బదిలీ నిషేధిత చట్టం (ఎల్టీఆర్) సమస్యలు పరిష్కరించాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీధి ఒక్కటే.. తండ్రిది ఏపీ.. కుమారుడిది తెలంగాణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. -
50 శాతంపైగా పెరిగిన కరెంటు వినియోగం
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో హైదరాబాద్తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్, వినియోగం అనూహ్యంగా పెరుగుతున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. -
పోల్ 2023.. కేఎంఆర్..!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు క్రమంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. భారాస ప్రత్యర్థుల్ని నియంత్రించాలనే ప్రధాన ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ నిందితులు ప్రత్యేక వాట్సప్ గ్రూప్లను ఏర్పాటు చేసినట్లు తాజా దర్యాప్తులో తేలింది. -
రోహిత్ కేసు పునర్విచారణ ప్రారంభం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఎనిమిదేళ్లకు కేసు పునర్విచారణ జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. -
వడదెబ్బకు 19 మంది మృత్యువాత
రాష్ట్రంలో వారం రోజులుగా హడలెత్తిస్తున్న ఎండలకు తాళలేక రైతులు, దినసరి కూలీలు, వృద్ధులు అసువులు బాస్తున్నారు. శనివారం పలు జిల్లాల్లో ఏకంగా 19 మంది మృతిచెందారు. -
మధుమేహంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి
భారత్లో మధుమేహం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. -
బతికుండగానే పూడ్చిపెట్టారు..
ముక్కుపచ్చలారని పసిగుడ్డు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు.. ప్రాణాలతో గుంతలో వేసి మట్టితో పూడ్చేశారు. -
నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు ఎఫ్ఆర్సీఎస్ గౌరవం
కష్టతరమైన శస్త్రచికిత్సల విజయవంతం, పేద రోగులకు సేవలు అందించినందుకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ నగరి బీరప్పకు అరుదైన గౌరవం దక్కింది. -
మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్కు మాతృవియోగం
మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాం నాయక్ మాతృ వియోగం పొందారు. -
‘ఆపరేషన్ కగార్’తో అమాయకుల ప్రాణాలు బలి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ను చేపట్టి.. అమాయక ఆదివాసీ ప్రజల ప్రాణాలు తీస్తోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. -
అంధులకు వీఐపీ దర్శనం
యాదాద్రి ప్రధాన ఆలయంలో శనివారం ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముగ్గురు అంధులు స్వామివారిని దర్శించుకునేందుకు రాగా.. అక్కడే విధుల్లో ఉన్న ఆలయ ఈవో భాస్కర్రావు కంటపడ్డారు. -
శిక్షలో పక్షపాతం తగదు
విద్యారుణాలకు సంబంధించి నకిలీ రుణ మంజూరు పత్రాల జారీ వ్యవహారంలో బాధ్యులైన అధికారులకు శిక్ష విధించడంలో పక్షపాతం చూపడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. -
ఎకరాకు 12 క్వింటాళ్ల జొన్నలు ప్రభుత్వమే కొంటుంది
రాష్ట్ర ప్రభుత్వం జొన్నల కొనుగోలులో నిబంధనలను సడలించి రైతులకు మరింత వెసులుబాటు కల్పించింది. ఎకరాకు 8.85 క్వింటాళ్లను మాత్రమే మద్దతు ధరకు కొనాలన్న గరిష్ఠ పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. -
టీఎస్సెట్ నోటిఫికేషన్ విడుదల
అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ నియామకాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష ‘తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2024’ నోటిఫికేషన్ విడుదలైంది. -
7న మేడిగడ్డకు జ్యుడిషియల్ విచారణ కమిటీ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 7న విశ్రాంత జడ్జి పినాకి చంద్రఘోష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. -
అవినీతి చెక్పోస్టులకు అడ్డుకట్ట!
రాష్ట్రంలో రవాణాశాఖ చెక్పోస్టులను శాశ్వతంగా రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటిపై ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. -
నేడు నీట్-యూజీ ప్రవేశపరీక్ష
నీట్-యూజీ (ఎంబీబీఎస్) ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్