డెంగీ విజృంభణ
రాష్ట్రంలో ఒకవైపు కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండగా..మరోవైపు డెంగీ పంజా విసురుతోంది. వరసగా వర్షాలు కురుస్తుండటం ..పలుచోట్ల ఇళ్లలో, పరిసరాల్లో నీళ్లు నిలుస్తుండటంతో దోమలు వృద్ధి
5 వారాల్లోనే 2,443 మంది బాధితులు
12 జిల్లాలపై ప్రభావం
మరోవైపు మలేరియా భయం
అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు
ఈనాడు - హైదరాబాద్
రాష్ట్రంలో ఒకవైపు కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండగా..మరోవైపు డెంగీ పంజా విసురుతోంది. వరసగా వర్షాలు కురుస్తుండటం ..పలుచోట్ల ఇళ్లలో, పరిసరాల్లో నీళ్లు నిలుస్తుండటంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. అదే స్థాయిలో డెంగీ జ్వరాల బారిన పడేవారి సంఖ్యా పెరుగుతోంది. గత అయిదు వారాల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 2443 కొత్త కేసులు నమోదవడం తీవ్రతను తెలియజేస్తోంది. అత్యధికంగా హైదరాబాద్లో నమోదు కాగా..రాష్ట్రంలో మరో 11 జిల్లాల్లోనూ ప్రభావం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ దోమలు కుట్టకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఆగస్టు నుంచి పెరిగిన ఉద్ధృతి
ఈ ఏడాదిలో జనవరి నుంచి జులై వరకూ డెంగీ కేసులు పరిమిత సంఖ్యలోనే నమోదయ్యాయి. ఆగస్టు నుంచి ఉద్ధృతి పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో 601 కేసులు నిర్ధారణ కాగా.. ఒక్క ఆగస్టులోనే దాదాపు రెండింతలు అధికంగా(1,720) నమోదయ్యాయి. సెప్టెంబరు 1 నుంచి ఈ నెల 4వ తేదీ వరకూ 2,443 నమోదవడం తీవ్రతను తెలియజేస్తోంది. ఇదే సమయంలో మలేరియా కేసులు కూడా తగ్గడం లేదు. గత 5 వారాల్లో కొత్తగా 107 మంది మలేరియా బారినపడినట్లుగా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ‘‘ఏటా ఆగస్టు-అక్టోబరు మధ్య కాలంలో డెంగీ కేసులు పెరుగుతుంటాయి. ఈ జ్వరాలకు కారణమయ్యే దోమలు నిల్వ ఉన్న నీరు, చెత్తలో వృద్ధిచెందుతాయి. ఇళ్లతోపాటు బడులు, కళాశాలలు, కార్యాలయాల్లో కుట్టడానికి అవకాశాలుంటాయి. సాధ్యమైనంత వరకూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంపై దృష్టిపెట్టాలి. ముఖ్యంగా పాత టైర్లు, ఎయిర్కూలర్లు, వాడేసిన వస్తువుల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తపడాలి. దోమతెరలు వాడాలి’ అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఈ ఏడాదిలో అక్టోబరు 4 నాటికి అత్యధికంగా డెంగీ కేసులు నమోదైన జిల్లాలు
ఆదిలాబాద్ 158, హైదరాబాద్ 1,189, కరీంనగర్ 115, ఖమ్మం 579, భద్రాద్రి కొత్తగూడెం 209, మహబూబ్నగర్ 346, మేడ్చల్ మల్కాజిగిరి 279, నిర్మల్ 141, నిజామాబాద్ 210, రంగారెడ్డి353, సంగారెడ్డి 109, సూర్యాపేట 164.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక
మేడిగడ్డ బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మధ్యంతర నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖకు సోమవారం పంపింది. -
ఐదు ఎకరాలు దాటిన వారికి రైతుబంధు
రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద యాసంగి సీజన్కు గాను ఐదు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు సైతం ప్రభుత్వం నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించింది. -
కొనసాగిన తీవ్ర ఎండలు
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం ఎండలు మంటలు రేపాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉడికిపోయింది. జగిత్యాల జిల్లా అల్లీపూర్, గుళ్లకోటలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
2024.. అత్యంత వేడి సంవత్సరం
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్లు ‘క్లైమేట్ ట్రెండ్స్’ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
కవితకు బెయిల్ నిరాకరణ
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కె.కవితకు బెయిల్ ఇవ్వడానికి ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. -
కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని, 33.67 శాతం కరవుభత్యంతో కలిపి 2023 జులై మొదటి తేదీ వర్తించేలా కొత్త వేతన సవరణ అమలు చేయాలని టీఎన్జీవోల సంఘం పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
మరో రూ.20 చెల్లిస్తే డీలక్స్లో ప్రయాణం: ఆర్టీసీ
ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణానికి మంత్లీ సీజన్ టికెట్ పాస్లు ఉన్న వారు డీలక్స్ బస్సులూ ఎక్కొచ్చని అయితే ప్రతిసారి అదనంగా రూ.20 చెల్లించాలని ఆర్టీసీ పేర్కొంది. -
ఆ భూముల్లోంచి పిటిషనర్లను ఖాళీ చేయించొద్దు
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిమిత్తం చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో 9.03 ఎకరాలు, సిద్దిపేట జిల్లా గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పాములపర్తిలో 14 ఎకరాల నుంచి యజమానులను ఖాళీ చేయించరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
వసతి గృహాల్లో సౌకర్యాల మెరుగుకు నివేదికివ్వండి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో సౌకర్యాలను మెరుగుపరిచి.. అమలు నివేదికను సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. ద్విచక్ర వాహనదారుల బాధలు వర్ణనాతీతం. -
కళాశాల గురువును కలిసిన కేసీఆర్
జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి సోమవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లాకు బయలుదేరేముందు తన గురువైన చరిత్రకారుడు డాక్టర్ జైశెట్టి రమణయ్య ఇంటికి కేసీఆర్ వెళ్లారు. -
దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మార్ఫింగ్ వీడియో కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని.. దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదని హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. -
న్యుమోనియా నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్
చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, న్యుమోనియాను నిర్ధారించేందుకు ట్రిపుల్ఐటీ హైదరాబాద్లోని ఐసీ-వైబ్స్ పరిశోధనా ప్రయోగశాల వైర్లెస్ డిటెక్టర్ను ఆవిష్కరించింది. -
మారిన ‘నీట్’ ప్రశ్నపత్రం.. ఆందోళనలో విద్యార్థులు
ఆసిఫాబాద్లోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన నీట్ పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాలు తారుమారయ్యాయని విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం కలెక్టర్ వెంకటేశ్కు ఫిర్యాదు చేశారు. -
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతన బకాయిలు చెల్లించాలి
రెండు నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. -
పంట నష్టపరిహారం నిధుల విడుదల
రాష్ట్రంలో గత మార్చి 16 నుంచి 21 వరకు వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు రూ.15.81 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
మా ఇంట్లో ఓట్లు.. అమ్మకానికి లేవు
-
8 ఏళ్ల ప్రేమ.. వివాహమైన వెంటనే పారిపోయిన భర్త
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)