చిత్తశుద్ధి చూపించారిలా..
మురుగు శుద్ధిపై చిత్తశుద్ధి లోపిస్తోంది. వ్యర్థ జలాల నిర్వహణకు సరైన వ్యవస్థలులేక ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. ఫలితంగా అటు పర్యావరణానికి.. ఇటు పౌరుల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోంది. ప్రస్తుతమున్న కేంద్రీకృత విధానాల
మురుగు జలాల శుద్ధి.. పునర్వినియోగానికి కొత్త దారులు
ఎక్కడికక్కడ కట్టడి చేసి.. శుభ్రపరిస్తే ఫలితం
వికేంద్రీకరణలో ‘నీరి’ శాస్త్రవేత్తల ప్రయోగం విజయవంతం
నాగ్పుర్లో సీవరేజ్ ప్లాంటు
ఈనాడు, సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి, ఈనాడు డిజిటల్, హైదరాబాద్: మురుగు శుద్ధిపై చిత్తశుద్ధి లోపిస్తోంది. వ్యర్థ జలాల నిర్వహణకు సరైన వ్యవస్థలులేక ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. ఫలితంగా అటు పర్యావరణానికి.. ఇటు పౌరుల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోంది. ప్రస్తుతమున్న కేంద్రీకృత విధానాల నుంచి వికేంద్రీకరణ వైపు మళ్లితేనే ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ తక్షణం ఈ విధానాన్ని అమలుచేయాలని గట్టిగా చెబుతున్నారు.
ఏమిటీ వికేంద్రీకరణ..
దేశంలోని అన్ని నగరాల్లో ప్రస్తుతం కేంద్రీకృత వ్యర్థ జలాల నిర్వహణ వ్యవస్థలే అందుబాటులో ఉన్నాయి. ఓ నగరంలో ఉన్న మొత్తం నిర్మాణాల నుంచి వెలువడే వ్యర్థ జలాలు నాలాలు, డ్రెయిన్ల ద్వారా సుదూరంలో ఉన్న ఒకే మురుగు శుద్ధి కేంద్రాని(ఎస్టీపీ)కి తరలుతున్నాయి. దీనికి పరిష్కారంగా చవగ్గా.. కాలుష్యం తగ్గించేలా, వ్యర్థ జలాల పునర్వినియోగంతో భవిష్యత్తులో నీటి కొరత తీర్చేందుకు నిపుణులు చెబుతున్న మార్గమే వికేంద్రీకృత వ్యర్థజల నిర్వహణ వ్యవస్థ(డీడబ్ల్యూడబ్ల్యూఎంఎస్). ఈ విధానంలో భాగంగా మురుగును స్థానికంగా ఎక్కడికక్కడ శుద్ధి చేసి పునర్వినియోగానికి సరఫరా చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో నగరాల్లో వరద సమస్యకూ పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు.
‘అర్వి’ సమీపంలో వికేంద్రీకృత వ్యర్థ జల నిర్వహణ వ్యవస్థలో భాగంగా ఏర్పాటు చేసిన ఓ ఎస్టీపీ
‘అర్వి’లో ‘నీరి’ ఏమి చేసిందంటే..
నాగ్పుర్ పరిధిలో ‘అర్వి’ ఓ చిన్న పురపాలిక. సుమారు 9,600 ఇళ్లు ఉన్న ఈ పట్టణంలో గతంలో మురుగు వ్యవస్థ మొత్తం రెండు ప్రధాన నాలాలపైనే ఆధారపడింది. మురుగు శుద్ధిపై పరిశోధనలు చేస్తున్న జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ పరిశోధన సంస్థ(సీఎస్ఐఆర్-నీరి) నాగ్పుర్ శాస్త్రవేత్తలు ఈ పట్టణాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ‘వికేంద్రీకృత మురుగు శుద్ధి వ్యవస్థ’ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మురుగంతా ప్రధాన నాలాల్లో కలవకుండా మూడు, నాలుగు వార్డులకు ఓ శుద్ధి కేంద్రాన్ని నిర్మించారు. తర్వాత శుద్ధి చేసిన నీటిని ప్రధాన డ్రెయిన్లోకి వదిలారు. ఇదే విధంగా నాగ్పుర్ పురపాలికలోనూ పీపీపీ పద్ధతిలో రూ.130 కోట్లతో అనేక మురుగుశుద్ధి ప్లాంట్లు నిర్మించి రోజుకు 48 కోట్ల లీటర్ల నీటిని శుద్ధి చేసి పారిశ్రామిక వినియోగానికి తరలిస్తున్నారు. వ్యర్థాల నుంచి సీఎన్జీని ఉత్పత్తి చేస్తున్నారు.
హైదరాబాద్లో అస్తవ్యస్తం
హైదరాబాద్ రోజూ 2000 మిలియన్ లీటర్ల(ఎంఎల్డీ) మురుగు ఉత్పత్తి అవుతోంది. 20 ఎస్టీపీలను ఏర్పాటు చేసి 740 ఎంఎల్డీ మురుగును శుద్ధి చేస్తున్నట్లు జలమండలి అధికారులు చెబుతున్నా.. ఆ స్థాయిలో జరగడంలేదు. రాజధానిలో దాదాపు 10 వేల కి.మీ. పొడవున డ్రెయినేజీలు ఉంటే 500 కి.మీ. మేర మురుగు ప్రవహిస్తూ అక్కడున్న శుద్ధి కేంద్రాలకు వెళుతోంది. ఈ మధ్యలో మురుగు నీరు పక్కనే ఉన్న చెరువులు ఇతర నీటి వనరుల్లో కలుస్తోంది. అర్వి పట్టణంలో ఉన్నట్లే ప్రతి కాలనీ/ పెద్దపెద్ద అపార్టుమెంట్ల దగ్గర ఒక మినీ మురుగుశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తేనే ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
విశాఖ, విజయవాడలలో ఇలా..
ఏపీలోని విశాఖ, విజయవాడ, కాకినాడల్లో తప్ప మిగతా పట్టణాల్లో శుద్ధి కేంద్రాలు పూర్తిస్థాయిలో లేవు. విజయవాడలో 1,357 కి.మీ. పొడవున డ్రెయినేజీ వ్యవస్థ ఉండగా రోజూ 148.9 ఎంఎల్డీ మురుగు ఉత్పత్తి అవుతోంది. ఏడు ఎస్టీపీల ద్వారా 130 ఎంఎల్డీల నీరు శుభ్రం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. విశాఖపట్నంలో రోజూ 172 ఎంఎల్డీ మురుగు ఉత్పత్తి అవుతోంది. ఇక్కడ 5 ఎస్టీపీ కేంద్రాల ద్వారా 107 ఎంఎల్డీ మురుగు నీటిని శుద్ధి చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి అంతస్థాయిలో శుద్ధికావడం లేదని ఆయా నగరాల స్థానికులు చెబుతున్నారు.
తక్షణం అమలు చేయాల్సిన విధానం ఇది..
- డాక్టర్ రితేష్ విజయ్, ‘నీరి’ ముఖ్య శాస్త్రవేత్త, నాగ్పుర్ కేంద్రం
హైదరాబాద్ లాంటి నగరాల్లో వికేంద్రీకృత మురుగు నిర్వహణ వ్యవస్థ తక్షణ అవసరం. కాలనీల్లో అందుబాటులో ఉన్న స్థలాల్లో ఎక్కడికక్కడ శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలి. అలా చేయడం ద్వారా మూసీ, ఇతర జలవనరులకు పూర్వ వైభవం తీసుకురావచ్చు. ఇదే విధానాన్ని వరంగల్, కరీంనగర్, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి లాంటి నగరాల్లో చేపడితే మురుగు సమస్య తీరుతుంది.
* డయేరియా వంటి నీటి కాలుష్య వ్యాధులతో దేశంలో ఏటా 3,50,000 మంది చిన్నారులు మరణిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
* దేశంలోని నగరాలు, పట్టణాల్లో రోజుకు 72 వేలకుపైగా మిలియన్ లీటర్ల మురుగునీరు ఉత్పత్తి అవుతున్నా.. అందులో 30 శాతం మాత్రమే శుద్ధి జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
* రెండు తెలుగు రాష్ట్రాల్లో 124 పట్టణాల్లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదు. కాలువల నిర్వహణ అధ్వానంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టిన జ్యుడిషియల్ విచారణలో భాగంగా నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెలలో మొదటి దఫా పర్యటన సందర్భంగా జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నీటిపారుదల శాఖ అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
పగలు నిప్పులు.. సాయంత్రం పిడుగులు
భరించలేని ఎండలు ఒకవైపు.. ఈదురుగాలులతో కూడిన వర్షాలు మరోవైపు. రాష్ట్రంలో ఆదివారం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఆరు జిల్లాల్లోని 15 మండలాలు ఎండల తీవ్రతతో ఉడికిపోయాయి. -
పనికెళ్లలేక.. పడుకోలేక..
వేసవి ఎండలు పగలే కాదు.. రాత్రుళ్లు కూడా ‘చెమట’ చుక్కలు చూపిస్తున్నాయి. ఏసీలున్న కుటుంబాల్లో పర్వాలేకున్నా.. ఫ్యాన్లు, కూలర్లు ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాల్లో మాత్రం నిద్ర కరవుతోంది. -
ఉపాధ్యాయుల పదోన్నతికి టెట్ అవసరం లేదు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు సంబంధించి జాతీయ ఉపాధ్యాయ మండలి(ఎన్సీటీఈ) పంపిన వివరణ లేఖను వెల్లడించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) డిమాండ్ చేశాయి. -
రేపటిలోగా పంట నష్టపరిహారం
రాష్ట్రంలోని పది జిల్లాల్లో గత మార్చి 16 నుంచి 24 వరకు కురిసిన వడగళ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రకటించిన పరిహారాన్ని మంగళవారంలోపు వారి ఖాతాల్లో జమ చేయాలని వ్యవసాయ శాఖాధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై వైకాపా ఫిర్యాదు నాన్ కాగ్నిజబుల్ నేరం
‘ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆ చట్టాన్ని వినియోగించి వైకాపా, జగన్ ప్రజల భూములను లాక్కుంటున్నట్లు తెదేపా చెబుతోంది. -
జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని మొదటి ఈఎంఈ సెంటర్లో జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ పౌర సంబంధాల అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ప్రజారోగ్యశాఖ ఈఎన్సీగా జియాఉద్దీన్
రాష్ట్ర ప్రజారోగ్యశాఖ ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్)గా జియాఉద్దీన్ బాధ్యతలు తీసుకున్నారు. ఆ స్థానంలోని ఆర్.శ్రీధర్ ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందగా.. ఆ బాధ్యతను నిర్వహించాలని జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియాఉద్దీన్ను ప్రభుత్వం ఆదేశించింది. -
యాదాద్రికి పోటెత్తిన భక్తజనం
అసలే వేసవి సెలవులు.. ఆపై ఆదివారం కావడంతో యాదాద్రి క్షేత్రానికి భక్తుల రాక గణనీయంగా పెరిగింది. దీంతో క్షేత్ర పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. -
వాగులు, వంకలు దాటి.. ఓటు వేయించి
మంచిర్యాల జిల్లా పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వేమనపల్లి మండలంలో ఆరు గ్రామాల్లోని ఏడుగురు వయోవృద్ధులతో ఆదివారం మండుటెండలో ఇంటి నుంచి ఓటు వేసే ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. -
నందిపాడు పరిసరాల్లో చిరుతపులి మృతి
నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నందిపాడు-చింతల్కుంట గ్రామాల మధ్య ఉన్న ఓ వ్యవసాయ పొలంలో చిరుతపులి కళేబరం కనిపించింది. -
ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాల జాప్యంపై స్పష్టత ఇవ్వండి
ఆర్టీసీ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలు ఇప్పటికీ ఎందుకు చెల్లించలేదో యాజమాన్యం వివరణ ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ డిమాండ్ చేశారు. -
వడదెబ్బ నివారణకు ఎన్సీడీసీ మార్గదర్శకాలు పాటించండి
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నందున.. కార్మికులకు అవసరమైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఈఎస్ఐ ఆసుపత్రులను ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ఆదేశించింది. -
ముగిసిన నీట్-యూజీ పరీక్ష
నీట్-యూజీ ఎంబీబీఎస్ ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రం కొంత కఠినంగా ఉన్నట్లు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నీట్-యూజీ ప్రవేశపరీక్ష ఆదివారం ముగిసింది. -
బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటైనట్లు ఆ సంఘం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
వేసవిలో ఉద్యానపంటలపై రైతులకు అవగాహన
వేసవిలో ఉద్యానపంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఉద్యానవన సంచాలకుడు కె.అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆయన జిల్లా అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
-
ఐపీఎల్ 2024: ‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్