రైతులను శిక్షించొద్దు
ధాన్యం కొనుగోళ్లపై తెరాస సభ్యులు వరుసగా మూడోరోజు బుధవారం కూడా ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగించారు. ‘రైతులను శిక్షించొద్దు. కనీస మద్దతు ధర చట్టం తేవాలంటూ’ నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు.
ఉభయ సభల్లో తెరాస సభ్యుల ఆందోళన లోక్సభలో రోజంతా నిరసన
ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంటు సాక్షిగా హామీ ఇవ్వాలని డిమాండ్
ఇది మంచి సంప్రదాయం కాదు: తెరాస ఎంపీలపై స్పీకర్ మండిపాటు
తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడుతున్న కె.కేశవరావు, చిత్రంలో ఎంపీలు దయాకర్, జోగినపల్లి సంతోష్కుమార్, కె.ఆర్.సురేష్రెడ్డి, రంజిత్రెడ్డి, పి.రాములు, మన్నె శ్రీనివాస్రెడ్డి, బి.బి.పాటిల్, నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత, లింగయ్య యాదవ్, వెంకటేష్ నేత, ప్రభాకర్రెడ్డి
ఈనాడు, దిల్లీ: ధాన్యం కొనుగోళ్లపై తెరాస సభ్యులు వరుసగా మూడోరోజు బుధవారం కూడా ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగించారు. ‘రైతులను శిక్షించొద్దు. కనీస మద్దతు ధర చట్టం తేవాలంటూ’ నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఉదయం లోక్సభ ప్రశ్నోత్తరాల సమయం మొదలైనప్పట్నుంచి తెరాస సభ్యులు రైతులను ఆదుకోవాలనే డిమాండ్లతో కూడిన ప్లకార్డులు పట్టుకుని వెల్లో బైఠాయించి నినాదాలు చేయడం మొదలుపెట్టారు. సాయంత్రం సభ వాయిదా పడేవరకు ఆందోళన చేస్తూనే ఉన్నారు. వారి ఆందోళనల మధ్యే కొద్దిసేపు ప్రశ్నోత్తరాల సమయం కొనసాగింది. రాజ్యసభలోనూ తెరాస సభ్యులు ఆందోళన చేశారు. సభల ప్రారంభానికి ముందు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద కూడా సభ్యులు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో తెరాస సభ్యులపై లోక్సభ స్పీకర్ ఓంబిర్లా ఆగ్రహం వ్యక్తంచేశారు. సమస్యను ప్రస్తావించడానికి తగిన సమయం ఇవ్వడానికి సిద్ధమని చెప్పినా ఆందోళన చేయడం మంచిదికాదని హితవు పలికారు. ‘‘సభలో సీనియర్ సభ్యులు మాట్లాడుతుండగా వారి ముందు ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. సమస్యపై మాట్లాడటానికి మంగళవారమే మీ పార్టీ నేతకు పూర్తిస్థాయి సమయం ఇచ్చాను. అయినప్పటికీ మీరు నినాదాలు చేయడానికి, ప్లకార్డులు ప్రదర్శించడానికి ఈ రోజు ఇక్కడికొచ్చారు. సభలో మీతీరు బాగాలేదు. కొందరు సభ్యులు పూర్తిసభను అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. సభ గౌరవ మర్యాదలు, సహకారంతో నడుస్తుంది. ఇలాంటి నిబంధనలకు విరుద్ధమైన విధానాలు, సంప్రదాయాలను అడ్డుకోవడానికి సభ్యులంతా సామూహికంగా ప్రయత్నించాలని కోరుతున్నానని’ స్పీకర్ అన్నారు. సభానాయకుడు తమ సభ్యులకు నచ్చజెప్పుకోవాలని సూచించారు.
రాజ్యసభ ఛైర్మన్ మండిపాటు
రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి పునరావృతమైంది. 12 మంది సభ్యుల సస్పెన్షన్ను నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు, రైతు సమస్యలపై తెరాస సభ్యులు ప్లకార్డులతో వెల్లో నిరసన తెలపడంతో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు మండిపడ్డారు. ‘‘ఎంత చెప్పినా సభ్యుల్లో పశ్చాత్తాపం లేకపోవడం పార్లమెంటరీ వ్యవస్థను అవమానించడమే. వెల్లోకి రావడం, బల్లలపైకి ఎక్కడం, కాగితాలు విసిరేయడం, మంత్రుల చేతుల్లోని కాగితాలు లాక్కోవడం, సభాధ్యక్షుడిని సవాల్ చేయడం వంటి చర్యలు పార్లమెంటు, ప్రజాస్వామ్య సూత్రాలకు వ్యతిరేకం. ప్లకార్డులు సభలోకి తీసుకురాకూడదు. అయినా తెస్తున్నారు. సభలో నిబంధనలకు వ్యతిరేకమైన ప్రవర్తనను చూడదలచుకోలేదు’’ అన్నారు. ఉభయ సభలు వాయిదాపడిన తర్వాత తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేకే, లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావులు.. ఇతర ఎంపీలతో కలిసి తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కిషన్రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారు
- కె.కేశవరావు
ప్రతిగింజా కొంటామనే కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రకటనను స్వాగతిస్తున్నాం. అదే సమయంలో వానాకాలం పంట అంటూ కిషన్రెడ్డి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. వానాకాలంతోపాటు యాసంగి పంట కూడా కొనాలి. వచ్చే ఏడాది కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలి. యాసంగి ధాన్యం సేకరణ అంశాన్ని కేరళ, తమిళనాడు, ఒడిశా ఎంపీలతో కలిసి గురువారం ఉభయ సభల్లో లేవనెత్తుతాం.
ఒక్కో మంత్రిది ఒక్కో మాటా?: నామా నాగేశ్వరరావు
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రతిగింజా కొంటామని చెబుతున్నారు. అదే అంశంపై పార్లమెంట్ సాక్షిగా కేంద్రం హామీ ఇవ్వాలి. ధాన్యం సేకరణపై కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి.. తలోమాట చెబుతున్నారు. పీయూష్ గోయల్ యాసంగి పంట కొనమని చెప్పిన తర్వాత సీఎం కేసీఆర్ అదే అంశాన్ని రైతులకు చెప్పారు. ఇప్పుడు ప్రతి గింజా కొంటామని కిషన్రెడ్డి హామీ ఇస్తుండడం, భాజపా నాయకులు కల్లాల వద్దకు వెళ్లి పంట కొనుగోలు చేస్తామని చెబుతుండడంతో గందరగోళం నెలకొంటోంది. ఈ అంశంపై భాజపా నాయకులు బయటచెప్పే మాటలనే పార్లమెంట్లో చెప్పిస్తే బాగుంటుంది. గతేడాది తెలంగాణ నుంచి 94.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామని కేంద్రం పార్లమెంట్లో చెప్పింది. ఈ ఏడాది 1.50 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కనీసం కోటి మెట్రిక్ టన్నులు కొనాలని విజ్ఞప్తిచేస్తే ‘మీ దగ్గర ఇంత ఎలా పండుతుందని’ పీయూష్ గోయల్ అవమానిస్తున్నారు. పంట ఎక్కువగా పండిస్తే ఆనందించాల్సిందిపోయి ఎదురు ప్రశ్నించడం సరికాదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
నాలుగో రోజూ 46 డిగ్రీలపైనే..
రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. శుక్రవారం 10 జిల్లాల్లోని 20 మండలాల్లో 46.3 నుంచి 46.7 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. -
రిజిస్ట్రార్ కోర్టు ముందు లిస్ట్ కావాల్సిన కేసు ఇక్కడికెలా వచ్చింది?
ప్రస్తుతం తెలంగాణలో విచారణ జరుగుతున్న ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ భారాస నేత, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సతీష్చంద్ర శర్మ, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం జులైకి వాయిదా వేసింది. -
దోస్త్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ఆన్లైన్లో 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. -
‘టానిక్’కు మినహాయింపుల్లోనే మతలబు!
రాష్ట్రంలో ఎలైట్ వైన్షాప్ ‘టానిక్’ ఏర్పాటు సమయంలో ఇచ్చిన వెసులుబాట్లలోనే మతలబు ఉన్నట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిర్ధారణకు వచ్చింది. -
మీ భూమి మీది కాదు
ఆ ఆస్తి మాదే... రికార్డుల్లో మా పేరే ఉంది, మాకేం భయం... అనుకుంటే పొరపాటే. రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. -
జగన్ వంచనకు ఏడు ప్రాణాలు బలి
పింఛన్ల రాజకీయ క్రీడ ఏడుగురిని బలి తీసుకుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారుల వైఫల్యం పేద కుటుంబాలకు పెద్దదిక్కును దూరం చేస్తున్నాయి. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
ఇటీవల కన్నుమూసిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
ఆరు రోజులుగా నక్కి.. ఎరకు చిక్కి
శంషాబాద్ విమానాశ్రయ రన్వే మైదానంలోకి గత నెల 27న చొరబడి అందరినీ కంగారుకు గురి చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. -
వామనరావు దంపతుల హత్య కేసు.. సీబీఐకి అప్పగించేందుకు సిద్ధం
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని హైవేలో 2021 ఫిబ్రవరి 17న జరిగిన న్యాయవాదులు గట్టు వామనరావు దంపతుల హత్యకేసు దర్యాప్తును సీబీఐ లేదా సీఐడీకి అప్పగించడానికి తమకు అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. -
కోర్టులో నేరుగా హాజరుపరచాలని కవిత దరఖాస్తు
ప్రస్తుతం దిల్లీ మద్యం కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు ముందు విచారణ జరిగే సమయంలో తనను నేరుగా హాజరుపరచాలంటూ భారాస ఎమ్మెల్సీ కవిత దరఖాస్తు దాఖలుచేశారు. -
సులభతర వాణిజ్య విధానంలో మరిన్ని సంస్కరణలు
సులభతర వాణిజ్య విధానం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-ఈఓడీబీ)లో అత్యుత్తమ సేవలు కొనసాగించాలని, ఇందుకోసం మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి ఆదేశించారు. -
నిబంధనలు ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్ కళాశాలలపై చర్యలు
తెలంగాణలో నిబంధనలను ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్ కళాశాలలపై విద్యాశాఖ కొరడా ఝుళిపించింది. ఇంటర్ విద్యామండలి ఆదేశాలను విస్మరించి వేసవి సెలవుల్లో కళాశాలలను నిర్వహించడం, ప్రవేశాలు కల్పించినందుకుగాను ఒక్కో కళాశాలపై రూ.లక్ష చొప్పున జరిమానా విధించినట్లు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వం కోరితే.. పదోన్నతులకు టెట్ మినహాయింపునిస్తాం
తెలంగాణలో 2010 కన్నా ముందు నియమితులై 1 నుంచి 5 తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే వెంటనే ఉత్తర్వులిస్తామని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఛైర్మన్ యోగేశ్ సింగ్ తెలిపారు. -
టెట్ పరీక్షల షెడ్యూలు విడుదల
ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024 షెడ్యూలును విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. -
6న ఈసెట్
టీఎస్ ఈసెట్-2024 ప్రవేశ పరీక్ష మే 6వ తేదీన ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. -
ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు
ఎండల తీవ్రత దృష్ట్యా జాతీయ ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ అనితా రామచంద్రన్ ఆదేశించారు. -
ఆర్టీసీ రిజర్వేషన్ ఛార్జీలపై మినహాయింపు
దూరప్రాంత బస్ సర్వీసుల్లో రిజర్వేషన్ ఛార్జీలపై టీఎస్ఆర్టీసీ కొత్త నిర్ణయం తీసుకుంది. -
40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం రూ.32 వేలు, గరిష్ఠంగా రూ.2,95,460 ఉండాలని వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఛైర్మన్ శివశంకర్ను రాష్ట్ర గెజిటెడ్ అధికారుల (టీజీవోల) సంఘం కోరింది. -
రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక పరిణామం
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో ముఖ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై దర్యాప్తు ముగిసిన దశలో కీలక మలుపు తిరిగింది. -
హెచ్సీయూ వీసీ, నేతలపై నమోదైన కేసులో ఆధారాల్లేవు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు నివేదికను పోలీసులు హైకోర్టుకు సమర్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
-
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!