‘ఉచితమా’.. నీ ఉనికెక్కడ!
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మారింది. వారికి డబ్బులేమీ తీసుకోకుండా వైద్య సేవలందించాలన్న నిబంధన
గురుకుల పేద విద్యార్థులకూ ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు
చిన్నారుల అత్యవసర వైద్యానికి రూ.లక్షలు వెచ్చిస్తున్న సొసైటీలు
అమలు కాని ఫ్రీ చికిత్స నిబంధన
ఈనాడు - హైదరాబాద్
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మారింది. వారికి డబ్బులేమీ తీసుకోకుండా వైద్య సేవలందించాలన్న నిబంధన అమలు కావడం లేదు. దీంతో అత్యవసర వైద్యం కోసం పిల్లలను ఆసుపత్రుల్లో చేర్చినా ఫీజులు కట్టేవరకు వైద్యం లభించడం లేదు. నాలుగేళ్లుగా ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీల ఉన్నతాధికారులు చొరవ తీసుకుని సొసైటీ నిధుల నుంచి దాదాపు 50 మందికి అత్యవసర చికిత్స అందేలా చూశారు. ఉచితంగా అందించాల్సిన చికిత్సకు ఫీజులు కట్టాల్సి రావడంతో సొసైటీలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
గురుకులాలు, వసతిగృహాల విద్యార్థులకు ఉచితంగా వైద్యం అందించాలని గతంలోనే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ప్రైవేటు ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి తోడు ప్రైవేటు ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వ అనుమతులు తీసుకునే సందర్భంగా ప్రతి సంవత్సరం కొంత మంది పేదలకు ఉచిత వైద్య సేవలు అందించాలనే నిబంధన ఉంటుంది. అయితే ప్రైవేటు ఆసుపత్రులు ఈ నిబంధనను పాటించడంలేదు. దీని అమలుపై ప్రభుత్వ పరంగా ఎటువంటి పర్యవేక్షణా ఉండటంలేదు. దీంతో ఆయా ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో గురుకులాల్లోని పేద విద్యార్థులకు ఉచిత వైద్యం అందించాల్సిన ప్రైవేటు ఆసుపత్రులు పట్టించుకోవడం లేదు. భారీ ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నాయి. విద్యార్థులు పేద కుటుంబాలకు చెందిన వారు కావడంతో కొందరికి సొసైటీలే రూ.లక్షలు ఖర్చు చేసి వైద్యం అందేలా చేస్తున్నాయి.
కొన్ని ఉదాహరణలు
* గిరిజన గురుకులానికి చెందిన ఒక విద్యార్థినికి రక్తకణాల సంఖ్య పడిపోయింది. సొసైటీ అధికారులు పరీక్షలు నిర్వహించగా బోన్మ్యారో కేన్సర్గా బయటపడింది. ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా తప్పనిసరిగా డబ్బు కట్టాలని యాజమాన్యం డిమాండ్ చేసింది. దీంతో సొసైటీ అధికారులు రూ.30 లక్షలు వెచ్చించి విద్యార్థినికి చికిత్స చేయించారు.
* ఎస్సీ గురుకులానికి చెందిన మరో విద్యార్థినికి బోన్మ్యారో సమస్య వచ్చింది. చికిత్సకు రూ.18 లక్షల వరకు ఖర్చు అవుతాయని అంచనా. ఇప్పటి వరకూ సొసైటీ రూ.8 లక్షలు ఖర్చు చేసింది.
* పాముకాటుకు గురైన విద్యార్థికి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సకు రూ.4లక్షల వరకు వెచ్చించారు.
* ఓ గురుకుల విద్యార్థిని నరాల వ్యాధితో మరణానికి చేరువైనప్పుడు, ప్రైవేటులో చేర్చి రూ.10 లక్షలు ఖర్చు చేశారు. వెంటిలేటర్పై నెలన్నరరోజుల చికిత్స అందించగా ప్రస్తుతం నెమ్మదిగా కోలుకుంటోంది.
* ఎస్సీ గురుకులానికి చెందిన ఓ విద్యార్థికి ఊపిరితిత్తుల సమస్య బయటపడింది. అతనికి వైద్యం అందించేందుకు రూ.4లక్షలు కట్టాలని ప్రైవేటు ఆసుపత్రి కోరింది. ప్రస్తుతం ఆ విద్యార్థి చికిత్స ఇంకా పెండింగ్లో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ వేడి నడుమ సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రశాంతత
‘ఓ వైపు మండుతున్న ఎండలు.. మరో వైపు రాజకీయ వేడి.. ఇలాంటి పరిస్థితుల్లో మాలాంటి వారికి సాంస్కృతిక కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను, సాంత్వన చేకూరుస్తాయి’ అని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. -
కన్హా శాంతివనంలో బాబూజీ మహరాజ్ 125వ జయంతి వేడుకలు
రామచంద్ర మిషన్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు బాబూజీ మహరాజ్ 125వ జయంతి వేడుకలు సోమవారం హైదరాబాద్ సమీపంలోని ప్రపంచ ఆధ్యాత్మిక శాంతి కేంద్రం కన్హా శాంతివనంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. -
ఇంకా చిక్కని చిరుత
ఎయిర్పోర్ట్ రన్వే మైదానంలో ప్రహరీ దూకిన చిరుతను బంధించడానికి అటవీ శాఖ, విమానాశ్రయంలో భద్రతాధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సోమవారం అదనంగా మరో బోనును ఏర్పాటు చేసి, అనుమానిత ప్రాంతాల్లో 10 ట్రాప్ కెమెరాలను బిగించారు. -
తాండూరు కందులకు రికార్డు ధర
వికారాబాద్ జిల్లా తాండూరు వ్యవసాయ మార్కెట్లో సోమవారం క్వింటాలు నాణ్యమైన కందులకు గరిష్ఠంగా రూ.12,705 ధర వచ్చింది. మార్కెట్ చరిత్రలో రికార్డు ధరగా నమోదైందని వ్యవసాయ మార్కెట్ పర్యవేక్షకులు హబీబ్ తెలిపారు. -
కేయూలో దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి
కాకతీయ విశ్వవిద్యాలయంలో సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం సభ్యులపై దాడికి పాల్పడ్డ ఏబీవీపీ, బజరంగ్దళ్ ప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఫోరం సభ్యులు డిమాండ్ చేశారు. -
మే 24న పాలిసెట్
పాలిటెక్నిక్ ప్రవేశాల్లో భాగంగా ‘పాలిసెట్’ మే 24న నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా సమన్వయాధికారిణి, మాసబ్ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డా.ఎన్.రాజేశ్వరీదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
65 ఏళ్లు నిండిన అంగన్వాడీ సిబ్బందికి విశ్రాంతి
అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, సహాయకులకు పదవీ విరమణ వయసును 65 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత వివరాలు ఏప్రిల్ 30 నాటికి పంపించాలని మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కాంతివెస్లీ సోమవారం ఆదేశాలు జారీచేశారు. -
‘టెయిల్పాండ్’ నీటి తరలింపుపై వివరణ ఇవ్వండి
తమ అనుమతి లేకుండా నాగార్జునసాగర్ దిగువన ఉన్న టెయిల్పాండ్ నుంచి నీటిని తరలించడంపై వివరణ ఇవ్వాలంటూ కృష్ణా బోర్డు ఏపీ నీటి పారుదల శాఖకు తాజాగా లేఖ రాసింది. -
రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్పై విచారణ నేటికి వాయిదా
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్పై విచారణను నాంపల్లి కోర్టు ఏప్రిల్ 30కి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన అనంతరం పోలీసులు కౌంటర్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
ఎక్సైజ్ అధికారుల బదిలీ వ్యవహారంలో జోక్యం చేసుకోలేం హైకోర్టు
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపునిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై ఈ దశలో జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు స్పష్టం చేసింది. -
సీఎం రేవంత్కు నోటీసులు
రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారనే అభియోగంతో తెలంగాణ సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో పాటు మరో నలుగురు కాంగ్రెస్ నేతలకు దిల్లీ పోలీసులు సోమవారం నోటీసులు అందజేశారు. -
955 టీఎంసీలు అవసరం
కృష్ణా జలాల్లో తమ అవసరాలు 2,099 టీఎంసీలుగా రెండు తెలుగు రాష్ట్రాలు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు నివేదించాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ తమ అవసరం 1,144 టీఎంసీలుగా పేర్కొనగా, తెలంగాణ 954.9గా తెలిపింది. -
ఉదయం 11 గంటలకు పది ఫలితాలు
రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం ఉదయం 11 గంటలకు వెల్లడికానున్నాయి. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హైదరాబాద్లోని రాష్ట్ర విద్యా పరిశోధన మండలి ప్రాంగణంలోని ఆడిటోరియంలో ఫలితాలను విడుదల చేస్తారు. -
పకడ్బందీగా టీఎస్ఈఏపీసెట్
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో ఈఏపీసెట్-2024 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. -
40 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించి అమలు చేయాలి
తెలంగాణలో పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 2023 జులై ఒకటి నుంచి రావాల్సిన 2వ పీఆర్సీ 40 శాతం ఫిట్మెంట్తో వెంటనే ప్రకటించి అమలు చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్(టీయూఎంహెచ్ఈయూ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!