అణు చరిత్రలో మరో ముందడుగు
దేశ అణు చరిత్రలో మరో ముందడుగు పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వాపురం సమీపంలోని మణుగూరు భారజల కర్మాగారంలో ఆక్సిజన్-18 ప్లాంటు ప్రారంభమైంది. దేశంలో ఇది మొదటిది కాగా ప్రపంచంలో ఏడోది
మణుగూరు భారజల కర్మాగారంలో ఆక్సిజన్-18 ప్లాంటు ప్రారంభం
ప్రపంచంలో ఏడోది.. దేశంలో మొదటిది
మణుగూరు భారజల కర్మాగారంలో ప్రారంభించిన ఆక్సిజన్-18 ప్లాంటు
అశ్వాపురం, న్యూస్టుడే: దేశ అణు చరిత్రలో మరో ముందడుగు పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వాపురం సమీపంలోని మణుగూరు భారజల కర్మాగారంలో ఆక్సిజన్-18 ప్లాంటు ప్రారంభమైంది. దేశంలో ఇది మొదటిది కాగా ప్రపంచంలో ఏడోది. ఆర్థికంగా, వాణిజ్యపరంగా ఎంతో లాభదాయకం కావడంతో భారత భారజల బోర్డు 2016లో రూ.53 కోట్లతో ప్లాంటు నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు ఆక్సిజన్-18 ఉత్పత్తి అమెరికా, రష్యా, చైనా వంటి ఆరు అగ్రరాజ్యాలకే పరిమితమైంది. ఇప్పుడు వాటి సరసన మన దేశం చేరింది. గణతంత్ర వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విజయంపై ప్రకటన చేయనున్నారని సమాచారం.
వర్చువల్ పద్ధతిలో..
భారత అణుశక్తి విభాగం ఛైర్మన్ కేఎన్ వ్యాస్ ‘ఆక్సిజన్-18’ ప్లాంటును సోమవారం వర్చువల్ పద్ధతిలో ఆవిష్కరించారు. భారజల బోర్డు ఛైర్మన్ జితేంద్ర శ్రీవాత్సవ, బార్క్ డైరెక్టర్ మహంతి తదితరులు పాల్గొన్నారు. భారత భారజల బోర్డు అసోసియేట్ డైరెక్టర్ వీవీఎస్ఏ ప్రసాద్ మణుగూరు కర్మాగారానికి వచ్చారు. ప్లాంటు జనరల్ మేనేజర్ జి.సతీశ్, డిప్యూటీ జనరల్ మేనేజర్లు పీజేవీ సుధాకర్, వెంకటేశ్, ఉపాధ్యాయ తదితరులు పాల్గొన్నారు.
ఉపయోగాలేంటి?
ఆక్సిజన్-18ను పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (పీఈటీ) స్కానింగులో వినియోగిస్తారు. పీఈటీ అనేది న్యూక్లియర్ ఇమేజింగ్లో ఓ టెక్నిక్. ఇది శరీరంలోని జీవ రసాయనిక ప్రక్రియలను, కణతులను, క్యాన్సర్ వివిధ దశలను, చిత్త వైకల్యం తదితర వ్యాధులను వంద శాతం కచ్చితత్వంతో నిర్ధారిస్తుంది. శరీరధర్మ, జీవక్రియల అధ్యయనానికీ ఉపయోగపడుతుంది. వీటితోపాటు ఇతర అనేక వైజ్ఞానిక అవసరాలకు ఆక్సిజన్-18 ఉపకరిస్తుంది.
ఆక్సిజన్-18 అంటే?
ఆక్సిజన్ సహజసిద్ధంగా 16, 17, 18 అనే స్థిర ఐసోటోపులను కలిగి ఉంటుంది. సాధారణ నీటిలో ఆక్సిజన్-18 ఐసోటోపు 0.204 శాతంగా ఉంటుంది. వివిధ ప్రక్రియల ద్వారా దాన్ని 95.5 శాతం ఆక్సిజన్-18 ఐసోటోపుగా మార్పు చెందిస్తారు. ఆ నీటిని సుసంపన్న ఆక్సిజన్-18 ఐసోటోపు నీటిగా, డబ్లీ లేబుల్డ్ వాటర్గా పిలుస్తారు. ఆ నీటిని ఉత్పత్తి చేసే ప్లాంటును ఆక్సిజన్-18 ప్లాంటుగా వ్యవహరిస్తారు. 95.5 శాతం ఆక్సిజన్-18 ఐసోటోపు సుసంపన్నంగా ఉండే నీటిని మణుగూరు ప్లాంటులో ఏడాదికి పది కిలోలు ఉత్పత్తి చేయనున్నారు. 10 శాతం ‘ఆక్సిజన్-18’ ఉండే నీటిని ఏడాదికి వంద కిలోలు ఉత్పత్తి చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీధి ఒక్కటే.. తండ్రిది ఏపీ.. కుమారుడిది తెలంగాణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. -
50 శాతంపైగా పెరిగిన కరెంటు వినియోగం
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో హైదరాబాద్తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్, వినియోగం అనూహ్యంగా పెరుగుతున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. -
పోల్ 2023.. కేఎంఆర్..!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు క్రమంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. భారాస ప్రత్యర్థుల్ని నియంత్రించాలనే ప్రధాన ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ నిందితులు ప్రత్యేక వాట్సప్ గ్రూప్లను ఏర్పాటు చేసినట్లు తాజా దర్యాప్తులో తేలింది. -
రోహిత్ కేసు పునర్విచారణ ప్రారంభం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఎనిమిదేళ్లకు కేసు పునర్విచారణ జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. -
వడదెబ్బకు 19 మంది మృత్యువాత
రాష్ట్రంలో వారం రోజులుగా హడలెత్తిస్తున్న ఎండలకు తాళలేక రైతులు, దినసరి కూలీలు, వృద్ధులు అసువులు బాస్తున్నారు. శనివారం పలు జిల్లాల్లో ఏకంగా 19 మంది మృతిచెందారు. -
మధుమేహంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి
భారత్లో మధుమేహం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. -
బతికుండగానే పూడ్చిపెట్టారు..
ముక్కుపచ్చలారని పసిగుడ్డు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు.. ప్రాణాలతో గుంతలో వేసి మట్టితో పూడ్చేశారు. -
నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు ఎఫ్ఆర్సీఎస్ గౌరవం
కష్టతరమైన శస్త్రచికిత్సల విజయవంతం, పేద రోగులకు సేవలు అందించినందుకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ నగరి బీరప్పకు అరుదైన గౌరవం దక్కింది. -
మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్కు మాతృవియోగం
మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాం నాయక్ మాతృ వియోగం పొందారు. -
‘ఆపరేషన్ కగార్’తో అమాయకుల ప్రాణాలు బలి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ను చేపట్టి.. అమాయక ఆదివాసీ ప్రజల ప్రాణాలు తీస్తోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. -
అంధులకు వీఐపీ దర్శనం
యాదాద్రి ప్రధాన ఆలయంలో శనివారం ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముగ్గురు అంధులు స్వామివారిని దర్శించుకునేందుకు రాగా.. అక్కడే విధుల్లో ఉన్న ఆలయ ఈవో భాస్కర్రావు కంటపడ్డారు. -
శిక్షలో పక్షపాతం తగదు
విద్యారుణాలకు సంబంధించి నకిలీ రుణ మంజూరు పత్రాల జారీ వ్యవహారంలో బాధ్యులైన అధికారులకు శిక్ష విధించడంలో పక్షపాతం చూపడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. -
ఎకరాకు 12 క్వింటాళ్ల జొన్నలు ప్రభుత్వమే కొంటుంది
రాష్ట్ర ప్రభుత్వం జొన్నల కొనుగోలులో నిబంధనలను సడలించి రైతులకు మరింత వెసులుబాటు కల్పించింది. ఎకరాకు 8.85 క్వింటాళ్లను మాత్రమే మద్దతు ధరకు కొనాలన్న గరిష్ఠ పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. -
టీఎస్సెట్ నోటిఫికేషన్ విడుదల
అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ నియామకాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష ‘తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2024’ నోటిఫికేషన్ విడుదలైంది. -
7న మేడిగడ్డకు జ్యుడిషియల్ విచారణ కమిటీ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 7న విశ్రాంత జడ్జి పినాకి చంద్రఘోష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. -
అవినీతి చెక్పోస్టులకు అడ్డుకట్ట!
రాష్ట్రంలో రవాణాశాఖ చెక్పోస్టులను శాశ్వతంగా రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటిపై ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. -
నేడు నీట్-యూజీ ప్రవేశపరీక్ష
నీట్-యూజీ (ఎంబీబీఎస్) ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు