TSRTC: 9 నెలలు.. రూ.1,787 కోట్ల నష్టం!
ఆర్టీసీ నష్టాల బాటలోనే సాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు వరకు లాభనష్టాల లెక్కలను అధికారులు సిద్ధం చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబరు....
నష్టాల నడవాలో ఆర్టీసీ!
ఈనాడు, హైదరాబాద్: ఆర్టీసీ నష్టాల బాటలోనే సాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు వరకు లాభనష్టాల లెక్కలను అధికారులు సిద్ధం చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు రూ.1,787.12 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. గతఏడాది ఇదేకాలంలో రూ.1,959.69 కోట్లు రాగా.. ఈ దఫా రూ.172.57 కోట్ల నష్టం తగ్గింది. కరోనా తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం నెలవారీగా నిధులు విడుదల చేస్తే కానీ జీతాలు చెల్లించలేని పరిస్థితి. అధికారులు బ్యాంకుతో ఒప్పందం చేసుకోవడంతో ఆర్టీసీ ఖాతాలోని నిధుల నిల్వలతో సంబంధం లేకుండా ప్రతి నెలా ఒకటో తేదీన ఉద్యోగుల ఖాతాల్లో సాఫీగా జీతాలను జమ చేయడం జరుగుతోంది. జనవరిలో సంక్రాంతి సర్వీసులు నడిచినప్పటికీ ఒమిక్రాన్ తీవ్రతతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో ఆదాయం పెరగలేదు.
ప్రభుత్వ చేయూతతోనే ఊరట
ఒకపక్క అప్పులు, మరోవైపు నష్టాలతో ఆర్టీసీ కుంగుతోంది. నష్టాలు, అప్పులు రూ.వేల కోట్లలో ఉన్నాయి. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు వందల కోట్లలో ఉన్నాయి. ఈ పరిస్థితుల నుంచి ఆర్టీసీ గట్టెక్కాలంటే ఏకమొత్తం సర్దుబాటు ప్రాతిపదికన అప్పులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని, వెయ్యి బస్సుల కొనుగోలు కోసం ఆర్థిక సహాయం చేస్తేనే ఉపశమనం కలుగుతుంది. ఛార్జీలు పెంచినా సంస్థకు ఏడాదికి రూ.700 కోట్ల నుంచి రూ.800 కోట్లకు మించి అదనపు ఆదాయం వచ్చే అవకాశం లేదని అధికారులు అంగీకరిస్తున్నారు. ఆ మొత్తంతో నష్టాల నుంచి గట్టెక్కే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆర్టీసీపై దృష్టి సారించి ఆర్థిక ఉపశమనం కలిగించాల్సిన అవసరం ఉంది.
కార్గోలోనూ అదేబాట..
పార్సిళ్లు, లగేజీలను చేరవేసే ఆర్టీసీ కార్గో నష్టాల భారాన్ని మోస్తోంది. గత అక్టోబరు వరకు రూ.13 కోట్ల మేర నష్టాలు వచ్చినట్లు సంస్థ తెలిపింది. పలు దిద్దుబాటు చర్యలతో నవంబరు, డిసెంబరు నెలల్లో లాభం వచ్చినట్లు పేర్కొంది. ప్రత్యామ్నాయ ఆదాయాలకు కార్గో సేవలను నిర్వహించాలన్నా సీఎం కేసీఆర్ సూచనతో 2020 జూన్లో కార్గో ప్రారంభించారు. ప్రభుత్వ విభాగాలన్నీ ఈ సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే 20 సంస్థలే వినియోగించుకుంటున్నాయి. అత్యధికంగా తెలంగాణ ఫుడ్స్, ఆ తరువాత మహిళా, శిశు సంక్షేమ శాఖ మాత్రమే ఉపయోగించుకుంటున్నాయి. తెలంగాణ ఫుడ్స్, మెడికల్ సర్వీసెస్, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థలు ఆర్టీసీతో ఒప్పందం చేసుకున్నాయి. ప్రభుత్వ సంస్థలు కార్గో సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకున్న పక్షంలో ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అంచనా.
దిద్దుబాటుతో ఆశలు
నష్టాల నుంచి బయటపడేందుకు ఆర్టీసీ చేపట్టిన దిద్దుబాటు చర్యలతో ఇప్పుడిప్పుడే ఫలితాలొస్తున్నాయి. పార్సిల్ ధరల్లో మార్పులు చేయటంతో పాటు బుకింగ్ కేంద్రాలను అవుట్ సోర్స్ చేయటం ద్వారా భారం తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 177 కార్గో కేంద్రాలను ఆర్టీసీ నిర్వహించేది. ఇటీవల కాలంలో 140 కేంద్రాలను అవుట్సోర్స్ చేశారు. దీంతో ఖర్చులు కొంత మేరకు తగ్గాయి. గడిచిన నవంబరు, డిసెంబరు నెలల్లో సగటున రూ.30 లక్షల చొప్పున లాభం వచ్చింది. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత మెరుగుపడుతుందని అధికారులంటున్నారు. సమాచార హక్కు చట్టం కింద ఆర్టీసీ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు కోరగా గత ఏడాది నష్టాల వివరాలను సంస్థ తెలిపింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నమోదైన నష్టాల వివరాలు (రూ.కోట్లలో..)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 10 వారాలకు వాయిదా వేసింది. -
‘వివేకం’ సినిమాకి 2.1 కోట్లకు పైగా వ్యూస్.. పక్క రాష్ట్రాల్లోనూ ఆసక్తి
సీఎం జగన్మోహన్రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం ఆధారంగా తెరకెక్కిన ‘వివేకం’ చిత్రానికి మంగళవారం నాటికి అన్ని యూట్యూబ్ ఛానళ్లలో కలిపి సుమారు 2.1 కోట్లలకు పైగా వీక్షణలు వచ్చాయి. -
నడి వేసవిలో వణికించిన వాన
భగభగమనే ఎండలతో దాదాపు 10 రోజులుగా అల్లాడిన రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది. మంగళవారం ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది. -
మేడిగడ్డ రెండు గేట్లను పూర్తిగా తొలగించండి
‘కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్ కుంగిన ఏడో బ్లాకులో తెరుచుకోని ఎనిమిది రేడియల్ గేట్లలో రెండింటిని పూర్తిగా తొలగించాలి. -
‘రైతు భరోసా’ బంద్
‘రైతు భరోసా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయదారులకు అందజేసే పంట సాయం పంపిణీని తక్షణం నిలుపుదల చేయాలి. ఈ నెల 13న పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రమే రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయాలి’ అని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) స్పష్టం చేసింది. -
అమెరికా విద్యార్థి వీసా ఇంటర్వ్యూ తేదీలు వచ్చేశాయ్
యూఎస్లో ఉన్నత విద్య చదువుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. ఈ నెల 31 వరకూ విద్యార్థి వీసా ఇంటర్వ్యూ సమయాల (స్లాట్స్)ను అమెరికా ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. -
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం
రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని బీసీ, సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
రైతుభరోసాపై త్వరలో విధివిధానాలు
రాష్ట్రంలోని అర్హులైన రైతులకే రైతుభరోసా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. -
ప్రధాని మోదీతో పీవీ కుటుంబ సభ్యుల భేటీ
ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు మంగళవారం హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు కలిశారు. -
20 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహాడ్ జైల్లో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈడీ కేసులో మే 14 వరకు, సీబీఐ కేసులో 20 వరకు పొడిగించింది. -
ఓట్ల ప్రయాణంలో.. నోట్ల దోపిడీ
ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అన్న తేడా లేదు. ఏపీ వైపు వెళ్లే అన్ని బస్సుల్లో రిజర్వేషన్లు అయిపోయాయి. రైళ్లలో నెల క్రితమే అయిపోయి.. వెయిటింగ్ లిస్టులు వందలు దాటేశాయి. -
50 శాతం ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణ జరగాలి
తెలంగాణలో 50 శాతం ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణ జరగాలని పీఆర్టీయూటీఎస్ సంఘం పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
కనీస వేతనం రూ.30 వేలు ఉండాలి
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కనీస వేతనం రూ.30 వేలు, గరిష్ఠ వేతనం రూ.2,48,150, ఫిట్మెంట్ 30 శాతంతో కొత్త పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (టీఎస్యూటీఎఫ్) శివశంకర్ను కోరింది. -
ముఖ గుర్తింపు విధానం నుంచి మినహాయించండి!
తెలంగాణలోని పాఠశాలల్లో హాజరు నమోదుకు కొత్త విద్యాసంవత్సరం నుంచి చేపడుతున్న ముఖగుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్) విధానం నుంచి అంధ ఉపాధ్యాయులకు మినహాయింపునివ్వాలని రాష్ట్ర అంధ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.మల్లేశం, రాఘవేందర్రెడ్డి, ఇతర నేతలు అనిల్కుమార్, జి.మల్లేశ్, నాగేంద్రమ్మలు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశాన్ని కోరారు. -
గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఫైన్ ఆర్ట్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ కోర్సులు
గిరిజన గురుకుల సొసైటీ ఆధ్వర్యంలోని మహిళల ఫైన్ ఆర్ట్స్ అకాడమీ (సిరిసిల్ల)లో బీఏ ఆనర్స్ ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, ఫొటోగ్రఫీ-డిజిటల్ ఇమేజింగ్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఆసక్తి కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని గిరిజన గురుకుల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి తెలిపారు. -
టీఎస్ఈఏపీసెట్కు తొలిరోజు 90 శాతానికి పైగా హాజరు
తెలంగాణలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘టీఎస్ఈఏపీసెట్-2024’ పరీక్షకు మంగళవారం 90 శాతానికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. -
కర్ణాటకలో నేడు కృష్ణా జలాల విడుదల
కర్ణాటక నుంచి తెలంగాణకు బుధవారం కృష్ణా జలాలు విడుదల చేయనున్నారు. ఆ రాష్ట్రంలోని నారాయణపూర్ నుంచి 1.9 టీఎంసీల నీటిని దిగువకు వదిలేందుకు అక్కడి జలవనరుల శాఖ అంగీకరించింది. -
భూగర్భ జలాలు వేగంగా ఖాళీ!
రాష్ట్రంలో భూగర్భ జలాలు చాలా వేగంగా ఖాళీ అయిపోతున్నాయి. ప్రాజెక్టులు, ఇతర నీటి వనరులకు ఈ ఏడాది ఆశించిన మేర ప్రవాహాలు రాలేదు. చెరువులు, నీటి కుంటలు ఎండిపోయాయి. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారత మొక్కజొన్న పరిశోధన సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి 10 వరకు 67వ మొక్కజొన్న పరిశోధన కేంద్రాల వార్షిక సమావేశం విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరగనుంది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కొట్టేసిన క్యాట్
-
రోజంతా ఒడుదుడుకుల్లో సూచీలు.. చివరికి ఫ్లాట్గా
-
‘ట్రంప్తో ఏకాంతంగా గడిపా’ - కోర్టులో శృంగార తార సాక్ష్యం
-
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్
-
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
-
భారత్లోకి గూగుల్ వ్యాలెట్ వచ్చేసింది.. ఏమేం యాడ్ చేయొచ్చు?