AP Cabinet: 11 మంది పాతవారు.. 14 కొత్త ముఖాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త మంత్రివర్గం 25 మందితో సోమవారం ఉదయం కొలువుదీరనుంది. ఇప్పటివరకూ మంత్రులుగా కొనసాగిన వారిలో 11 మందికి కొత్త కేబినెట్లోనూ స్థానం లభించింది. సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ,...
నేడు కొలువుదీరనున్న ఏపీ కేబినెట్
ఎనిమిది జిల్లాలకు దక్కని ప్రాతినిధ్యం
ప్రతిపక్ష నేత జిల్లా నుంచి ఎక్కువ మందికి చోటు
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త మంత్రివర్గం 25 మందితో సోమవారం ఉదయం కొలువుదీరనుంది. ఇప్పటివరకూ మంత్రులుగా కొనసాగిన వారిలో 11 మందికి కొత్త కేబినెట్లోనూ స్థానం లభించింది. సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, అంజాద్ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, గుమ్మనూరు జయరామ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కె.నారాయణస్వామిలకు మరోసారి అవకాశం వచ్చింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు జిల్లా అయిన చిత్తూరు నుంచి అత్యధికంగా ముగ్గురికి కొత్త మంత్రివర్గంలో చోటు లభించింది.
8 మంది ఓసీలు.. అయిదుగురు ఎస్సీలు.. 10 మంది బీసీలు
మంత్రివర్గంలో చోటు దక్కినవారిలో 8 మంది ఓసీలు, అయిదుగురు ఎస్సీలు, 10 మంది బీసీలు ఉన్నారు. ఎస్టీ, మైనార్టీ వర్గాల నుంచి చెరొకరికి అవకాశం లభించింది. గత మంత్రివర్గంలో ముగ్గురు మహిళలు ఉండగా.. ఈసారి నలుగురు చోటు దక్కించుకున్నారు.
8 జిల్లాలకు దక్కని ప్రాతినిధ్యం
ఏపీలోని 26 జిల్లాల్లో ఎనిమిది జిల్లాల నుంచి ఒక్కరికీ నూతన మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభించలేదు. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేల్లో ఎవరూ మంత్రులు కాలేకపోయారు.నూతన మంత్రివర్గంలో చిత్తూరు జిల్లాకు అత్యధిక ప్రాధాన్యం లభించింది. ఈ జిల్లా నుంచి ముగ్గురికి కొత్త మంత్రివర్గంలో చోటు లభించింది.
* శ్రీకాకుళం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, పల్నాడు జిల్లాల నుంచి చెరో ఇద్దరికి కొత్త మంత్రివర్గంలో అవకాశం దక్కింది.
* విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పుగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి ఒక్కొక్కరే మంత్రులయ్యారు.
పాత ఎస్సీ మంత్రుల్లో సుచరిత మినహా..
ఎస్సీ సామాజికవర్గం నుంచి గత మంత్రివర్గంలో పినిపే విశ్వరూప్, తానేటి వనిత, మేకతోటి సుచరిత, కె.నారాయణస్వామి, ఆదిమూలపు సురేష్ కొనసాగారు. వీరిలో ఒక్క సుచరిత మినహా మిగతా నలుగురికీ కొత్త మంత్రివర్గంలోచోటు లభించింది.
* నూతన మంత్రివర్గంలోనూ ఎస్సీ వర్గానికి చెందిన మంత్రులు అయిదుగురే ఉండనున్నారు. సుచరిత బదులు మేరుగ నాగార్జునకు చోటు దక్కింది.
ఆ సామాజికవర్గం నుంచి మళ్లీ నలుగురికి..
ప్రభుత్వంలో కీలక ప్రాధాన్యం లభిస్తున్న ఓ సామాజికవర్గం నుంచి గత మంత్రివర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి గౌతమ్రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఉన్నారు. వీరిలో గౌతమ్రెడ్డి ఇటీవలే మరణించారు. ఈ వర్గం నుంచి ఈసారీ నలుగురికి అవకాశం లభించింది. పెద్దిరెడ్డి, బుగ్గనలకు కొత్త మంత్రివర్గంలోనూ చోటుదక్కింది. కొత్తగా కాకాణి గోవర్ధన్రెడ్డి, ఆర్కే రోజా స్థానం దక్కించుకున్నారు.
ఆ నలుగుర్నీ తప్పించి.. కొత్తవారికి
మరో ముఖ్యమైన సామాజికవర్గానికి చెందిన కురసాల కన్నబాబు, పేర్ని నాని, అవంతి శ్రీనివాసరావు, ఆళ్ల నానిలకు కొత్త కేబినెట్లో అవకాశం రాలేదు. వారికి బదులు అదే వర్గం నుంచి గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబులకు చోటు దక్కింది. ఈ నలుగురూ కొత్త ముఖాలే.
ఆ నాలుగు వర్గాలకు చోటే లేదు
కొత్త మంత్రివర్గంలో రాష్ట్రంలోని ప్రధానమైన ఓ నాలుగు సామాజిక వర్గాల నుంచి ఏ ఒక్కరికీ చోటు లభించలేదు. గత మంత్రివర్గంలో కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆయా వర్గాల నుంచి కొనసాగగా.. కొత్త కేబినెట్లో ఆ ముగ్గురి సామాజికవర్గాలకూ పదవులు ఇవ్వలేదు. ఇంకో సామాజికవర్గానికి పాత, కొత్త కేబినెట్లు రెండింటిలోనూ ప్రాతినిధ్యం లభించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్