Sundara Naidu: పౌల్ట్రీ అంటే గుర్తొచ్చేది సుందర నాయుడే
రాయలసీమలోని రైతుల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు డాక్టర్ సుందర నాయుడు చేసిన కృషి మరువలేనిదని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆయన రాత్రింబవళ్లు పల్లెల్లో తిరిగి, రైతులను పౌల్ట్రీ
ఆయన స్ఫూర్తితో నేనూ కొన్నాళ్లు ఆ రంగంలో ఉన్నా
బాలాజీ హేచరీస్ అధినేత శుభ స్వీకరణ కార్యక్రమంలో చంద్రబాబు
ఈనాడు డిజిటల్, చిత్తూరు: రాయలసీమలోని రైతుల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు డాక్టర్ సుందర నాయుడు చేసిన కృషి మరువలేనిదని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆయన రాత్రింబవళ్లు పల్లెల్లో తిరిగి, రైతులను పౌల్ట్రీ రంగం వైపు మళ్లించారని తెలిపారు. అందుకే పౌల్ట్రీ అంటే సుందర నాయుడే గుర్తుకొస్తారని కొనియాడారు. అప్పట్లో విద్యార్థిగా ఉన్న తాను ఆయన స్ఫూర్తితో పౌల్ట్రీ పరిశ్రమను స్థాపించానని.. తర్వాత రాజకీయాల్లోకి రావడంతో ఈ రంగంలో కొనసాగలేకపోయానని చంద్రబాబు చెప్పారు. పౌల్ట్రీ రంగ దిగ్గజం, బాలాజీ హేచరీస్ అధినేత డాక్టర్ ఉప్పలపాటి సుందర నాయుడి శుభ స్వీకరణ కార్యక్రమం చిత్తూరులోని రెడ్డిగుంటలో ఆదివారం జరిగింది. సోదరుడి కుమారుడు వి.రమేష్ బాబు ఉత్తర క్రియలు నిర్వహించారు. చంద్రబాబు హాజరై సుందర నాయుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సతీమణి సుజీవన, కుమార్తెలు మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, నీరజ, అల్లుళ్లు ‘ఈనాడు’ ఎండీ కిరణ్, నవీన్, కుటుంబ సభ్యులను పరామర్శించారు. సుందర నాయుడితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ‘పది మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో డాక్టర్ సుందర నాయుడు ప్రభుత్వోద్యోగం వదులుకుని ఈ రంగంలోకి వచ్చారు. అప్పట్లో రాయలసీమలో కరవు విలయ తాండవం చేసేది. ఉపాధి అవకాశాలు కొరవడి.. వలసలు ఎక్కువగా ఉండేవి. దీంతో పౌల్ట్రీ ద్వారా రైతులకు అదనపు ఆదాయం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుని.. బీవీ రావుతో కలిసి దేశం మొత్తం పర్యటించి, పౌల్ట్రీ రంగాన్ని అభివృద్ధి చేశారు. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో కోలుకుంటారని భావించా. ఆయన మృతి బాధ కలిగించింది. ఆయనిచ్చిన స్ఫూర్తి రైతుల్లో ఎప్పటికీ ఉంటుంది. అన్నదాతలకు ఎనలేని సేవలు అందించారు. సాధారణ రైతు కంటే పౌల్ట్రీ రైతుకు మెరుగైన ఆదాయం వస్తుంది.. తద్వారా పిల్లలను ఉన్నత చదువులు చదివించుకుంటారని సుందర నాయుడు ఆశించారు. ఆయన చూపిన మార్గాన్ని రైతులు అనుసరించాలి. పౌల్ట్రీ రైతులకు మేమంతా అండగా ఉంటాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రముఖుల నివాళి
డాక్టర్ సుందర నాయుడి శుభ స్వీకరణ కార్యక్రమానికి కిమ్స్ ఛైర్మన్ బొల్లినేని కృష్ణయ్య, భారత్ బయోటెక్ డైరెక్టర్లు సాయిప్రసాద్, జలచరి, నూజివీడు సీడ్స్ ఛైర్మన్ మండవ ప్రభాకరరావు, అమరరాజా గ్రూప్ వ్యవస్థాపకులు గల్లా రామచంద్ర నాయుడు, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీలు ఎ.రామ్మోహన్రావు, విజయేశ్వరి, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, మాజీ మంత్రులు కామినేని శ్రీనివాస్, అమరనాథరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, స్వర్ణభారత్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్, అమర ఆసుపత్రి ఎండీ రమాదేవి, పీఈఎస్ వ్యవస్థాపకుడు దొరస్వామి నాయుడు, తిరుపతి, చంద్రగిరి ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవీ నాయుడు, సుగుణమ్మ, తెదేపా ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ కృష్ణయ్య, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పౌల్ట్రీ వ్యాపారులు, రైతులు హాజరై నివాళులర్పించారు. పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి సుందర నాయుడు చేసిన కృషిని స్మరించుకున్నారు. ఆయనతో తనకు 30 ఏళ్ల పరిచయం ఉందని.. ఆయన పలకరించే విధానం, చూపించే ఆప్యాయత అందరి మనస్సుల్లో చిర స్థాయిగా నిలిచిపోతుందని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ గుర్తు చేసుకున్నారు. పౌల్ట్రీ రంగ అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్