నేడు కొండగట్టు అంజన్న జయంతి

భక్తుల పాలిట కొంగుబంగారం కొండగట్టు ఆంజనేయస్వామి జయంతి వేడుకలకు సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం పెద్ద జయంతి ఉత్సవాలు ప్రారంభం కాగా బుధవారం స్వామివారి తిరునక్షత్ర జయంతి

Published : 25 May 2022 05:15 IST

మల్యాల, న్యూస్‌టుడే: భక్తుల పాలిట కొంగుబంగారం కొండగట్టు ఆంజనేయస్వామి జయంతి వేడుకలకు సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం పెద్ద జయంతి ఉత్సవాలు ప్రారంభం కాగా బుధవారం స్వామివారి తిరునక్షత్ర జయంతి నిర్వహణ కోసం ఆలయం ముస్తాబైంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ఉన్న కొండగట్టు క్షేత్రానికి వివిధ ప్రాంతాల నుంచి దీక్ష ధరించినవారు భారీగా తరలివస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలకు నుంచి కూడా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఎంతోమంది వందల కిలోమీటర్ల దూరం నుంచి కాలినడకన కొండపైకి చేరుకొని మొక్కులు చెల్లించుకుంటారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని