Telangana: ఆగిన బిల్లులు.. సాగని పనులు
రుణాలపై కేంద్ర ఆర్థికశాఖ పెట్టిన మెలికతో సాగునీటి ప్రాజెక్టుల పనులపై ప్రభావం పడింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులు, వివిధ కార్పొరేషన్ల నుంచి భారీగా రుణాలు తీసుకొని ఆయా పనులకు చెల్లింపులు జరిపేది. కేంద్ర నిర్ణయం కారణంగా
కేంద్ర ఆర్థికశాఖ మెలికతో మందగతి
ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో చెల్లింపులు రూ.670 కోట్లే
గత సంవత్సరం అదే నెలలో సగటున రూ.2000 కోట్లు
సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై నీలినీడలు
ఈనాడు హైదరాబాద్: రుణాలపై కేంద్ర ఆర్థికశాఖ పెట్టిన మెలికతో సాగునీటి ప్రాజెక్టుల పనులపై ప్రభావం పడింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులు, వివిధ కార్పొరేషన్ల నుంచి భారీగా రుణాలు తీసుకొని ఆయా పనులకు చెల్లింపులు జరిపేది. కేంద్ర నిర్ణయం కారణంగా ఇపుడా ప్రక్రియలో జాప్యం అనివార్యమవుతోంది. ప్రతి ఆర్థిక సంవత్సరం బ్యాంకు రుణాలు, రాష్ట్ర ఖజానా నుంచి గుత్తేదారులు చేసిన పనుల బిల్లులు, భూసేకరణ, పునరావాసం తదితరాలకు సగటున నెలకు రూ.2000 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేసేది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు చెల్లింపులు రూ.670 కోట్లు మించలేదు. ఇందులో రాష్ట్ర ఖజానా నుంచి రూ.183 కోట్లు, బ్యాంకుల నుంచి రూ.487 కోట్ల చెల్లింపులు జరిగాయి. కాళేశ్వరం సహా మరికొన్ని ప్రాజెక్టులకు ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల నుంచి నిధులు విడుదల కాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అనేక ప్రాజెక్టుల్లో రెండు నెలల్లో చెల్లింపులు ఏమాత్రం జరగనేలేదు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణం కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటుచేసి బ్యాంకుల కన్సార్షియం నుంచి ప్రభుత్వం భారీగా రుణాలు తీసుకొంది. సీతారామ ఎత్తిపోతల, కంతనపల్లి, దేవాదుల, శ్రీరామసాగర్ వరదకాలువ తదితర ప్రాజెక్టులకు రుణం కోసం మరో కార్పొరేషన్ను ఏర్పాటుచేసింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను కాళేశ్వరం కార్పొరేషన్లో భాగం చేసింది. బ్యాంకులతోపాటు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, నాబార్డుల నుంచీ రుణాలు తీసుకొంది. గత ఏడాది కేంద్రం బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్లో కాళేశ్వరం అదనపు టీఎంసీ పనిని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను అనుమతి లేని ప్రాజెక్టులుగా పేర్కొంది. దీంతో బ్యాంకులు, కార్పొరేషన్లు కొంతకాలం రుణాలను నిలిపినా మళ్లీ చెల్లించాయి. ఈ ఏడాది మార్చి వరకు చెల్లించినా, బడ్జెటేతర రుణాలను కూడా బడ్జెట్లో భాగంగానే చూపాలని, రెండూ కలిపి ఎఫ్.ఆర్.బి.ఎం. నిర్ణయించిన పరిధి దాటకూడదని కేంద్రం పేర్కొనడంతో కొత్త సమస్య తలెత్తింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సర్కారుతో సంప్రదింపులు జరుపుతోంది.
ముందుకు సాగేదెలా..?
బ్యాంకులు, కార్పొరేషన్ల నుంచి రుణాలు రాకపోతే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు లక్ష్యానికి అనుగుణంగా ముందుకెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఏప్రిల్ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రూ.700 కోట్ల బిల్లులు బ్యాంకుల వద్ద పెండింగ్లో ఉన్నాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అసలు చెల్లింపే జరగలేదు. దాదాపు మిగిలిన ప్రాజెక్టుల పరిస్థితీ ఇంతే. రాష్ట్ర బడ్జెట్, బ్యాంకుల నుంచి తీసుకొనే రుణం కలిపి ఈ ఏడాది సైతం సుమారు రూ.20వేల కోట్లకు పైగా ఖర్చుచేయాల్సి ఉండగా, మొదటి రెండునెలలు వెచ్చించింది చాలా తక్కువ. మరోవైపు ప్రభుత్వం మార్జిన్ మనీ కింద రూ.2500 కోట్లు చెల్లించాల్సి ఉంది. భూసేకరణకు రూ.1450 కోట్లు, పునరావాసానికి రూ.200 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. రుణాలిచ్చేందుకు బ్యాంకులు చేసుకొన్న ఒప్పందాలు అమలుచేయకపోతే సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రభావం పడే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. ద్విచక్ర వాహనదారుల బాధలు వర్ణనాతీతం. -
కళాశాల గురువును కలిసిన కేసీఆర్
జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి సోమవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లాకు బయలుదేరేముందు తన గురువైన చరిత్రకారుడు డాక్టర్ జైశెట్టి రమణయ్య ఇంటికి కేసీఆర్ వెళ్లారు. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక
మేడిగడ్డ బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మధ్యంతర నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖకు సోమవారం పంపింది. -
ఐదు ఎకరాలు దాటిన వారికి రైతుబంధు
రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద యాసంగి సీజన్కు గాను ఐదు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు సైతం ప్రభుత్వం నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించింది. -
కొనసాగిన తీవ్ర ఎండలు
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం ఎండలు మంటలు రేపాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉడికిపోయింది. జగిత్యాల జిల్లా అల్లీపూర్, గుళ్లకోటలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
2024.. అత్యంత వేడి సంవత్సరం
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్లు ‘క్లైమేట్ ట్రెండ్స్’ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
కవితకు బెయిల్ నిరాకరణ
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కె.కవితకు బెయిల్ ఇవ్వడానికి ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. -
కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని, 33.67 శాతం కరవుభత్యంతో కలిపి 2023 జులై మొదటి తేదీ వర్తించేలా కొత్త వేతన సవరణ అమలు చేయాలని టీఎన్జీవోల సంఘం పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
మరో రూ.20 చెల్లిస్తే డీలక్స్లో ప్రయాణం: ఆర్టీసీ
ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణానికి మంత్లీ సీజన్ టికెట్ పాస్లు ఉన్న వారు డీలక్స్ బస్సులూ ఎక్కొచ్చని అయితే ప్రతిసారి అదనంగా రూ.20 చెల్లించాలని ఆర్టీసీ పేర్కొంది. -
ఆ భూముల్లోంచి పిటిషనర్లను ఖాళీ చేయించొద్దు
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిమిత్తం చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో 9.03 ఎకరాలు, సిద్దిపేట జిల్లా గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పాములపర్తిలో 14 ఎకరాల నుంచి యజమానులను ఖాళీ చేయించరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
వసతి గృహాల్లో సౌకర్యాల మెరుగుకు నివేదికివ్వండి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో సౌకర్యాలను మెరుగుపరిచి.. అమలు నివేదికను సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మార్ఫింగ్ వీడియో కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని.. దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదని హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. -
న్యుమోనియా నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్
చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, న్యుమోనియాను నిర్ధారించేందుకు ట్రిపుల్ఐటీ హైదరాబాద్లోని ఐసీ-వైబ్స్ పరిశోధనా ప్రయోగశాల వైర్లెస్ డిటెక్టర్ను ఆవిష్కరించింది. -
మారిన ‘నీట్’ ప్రశ్నపత్రం.. ఆందోళనలో విద్యార్థులు
ఆసిఫాబాద్లోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన నీట్ పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాలు తారుమారయ్యాయని విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం కలెక్టర్ వెంకటేశ్కు ఫిర్యాదు చేశారు. -
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతన బకాయిలు చెల్లించాలి
రెండు నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. -
పంట నష్టపరిహారం నిధుల విడుదల
రాష్ట్రంలో గత మార్చి 16 నుంచి 21 వరకు వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు రూ.15.81 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
వాటర్ ట్యాంక్లో మహిళ మృతదేహం.. యూనివర్సిటీలో కలకలం
-
ప్రజల నమ్మకాన్ని కోల్పోతే.. ఇంకేం మిగలదు: దీదీ సర్కారుకు సుప్రీం చురక
-
రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా.. తర్వాత ఏమైందంటే?
-
నష్టాల్లో సూచీలు.. 383 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
శామ్సంగ్ కొత్త పవర్బ్యాంకులు.. ఒకేసారి 3 డివైజ్లకు ఛార్జింగ్
-
‘నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు’: ప్రధాని మోదీ