కోటి జెండాలతో పంద్రాగస్టు
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆగస్టు 8-22 వరకు స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం నిర్వహిస్తామని నిర్వాహక కమిటీ
వజ్రోత్సవాల కమిటీ ఛైర్మన్ కేశవరావు
ఈనాడు, హైదరాబాద్: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆగస్టు 8-22 వరకు స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం నిర్వహిస్తామని నిర్వాహక కమిటీ ఛైర్మన్ కేశవరావు తెలిపారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు 15 రోజుల పాటు పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 8న హెచ్ఐసీసీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్సవాలను ప్రారంభిస్తారని, ఆగస్టు 22న ఎల్బీస్టేడియంలో భారీ ఎత్తున ముగింపు వేడుకలు జరుగుతాయన్నారు. ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేస్తామని, దీని కోసం ప్రభుత్వం కోటి జెండాలు తయారు చేయించి ఇంటింటికీ పంపిణీ చేస్తుందన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ప్రభుత్వ విప్ ఎమ్మెస్ ప్రభాకర్రావు, సలహాదారు కేవీ రమణాచారి, సీఎం ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్, సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్, మేయర్ విజయలక్ష్మి తదితరులతో వజ్రోత్సవాల నిర్వహణపై ఆయన బీఆర్కేభవన్లో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘భారత స్వాతంత్య్ర స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకు, అమరవీరుల త్యాగాలను భవిష్యత్తు తరానికి తెలియజేసేందుకు వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.హెచ్ఐసీసీలో జరిగే ప్రారంభోత్సవాల్లో పోలీస్ బ్యాండ్, తదితర కళారూపాల ప్రదర్శన ఉంటుంది. స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలు ప్రదర్శిస్తాం. సినిమాహాళ్లలో దేశ స్వాతంత్య్రానికి సంబంధించిన చిత్రాలను ప్రదర్శింపజేస్తాం. హైదరాబాద్లో అంబేడ్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్ మీదుగా సంజీవయ్య పార్కులోని జాతీయజెండా వరకు ర్యాలీ ఉంటుంది. అన్ని విద్యాసంస్థల్లో వక్తృత్వ, వ్యాసరచన సహా ఇతర పోటీలుంటాయి. రాష్ట్రవ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు నిర్వహిస్తాం. హైదరాబాద్లో ఒక రోజు భారీ ఎత్తున జానపదాల ప్రదర్శన...మరో రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కూడళ్లలో ఒకేమారు జాతీయ గీతాలాపన ఉంటుంది. 22న జరిగే ముగింపు వేడుకలకు ఒక్కో జిల్లా నుంచి రెండువేల మంది హాజరవుతారు. త్వరలో పూర్తి స్థాయి కార్యాచరణను ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, రాజధాని నగరంలో ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం’ అన్నారు
ప్రత్యేకలోగో రూపకల్పన
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ద్విసప్తాహం నిర్వహణకు ప్రత్యేక చిహ్నాన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. జాతీయ చిహ్నంలోని అశోకచక్రం, రాష్ట్ర అధికారచిహ్నంలోని కాకతీయతోరణం, త్రివర్ణపతాకం మిళితమయ్యేలా దీనిని తయారు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిని త్వరలో విడుదల చేయనున్నారు. ప్రజా ప్రతినిధులతో పాటు, ప్రభుత్వ కార్యదర్శులు సహా ఉన్నతాధికారులు వారి వారి లెటర్ ప్యాడ్లమీద జాతీయపతాకంతో కూడిన స్వతంత్ర భారత వజ్రోత్సవాల లోగోను ముద్రించుకోవాలని, ప్రచారమాధ్యమాలు సైతం పక్షం రోజుల పాటు ఈ చిత్రం ప్రదర్శించాలని ప్రభుత్వం కోరనుంది.
ఉపరాష్ట్రపతి ఎన్నికలపై త్వరలో తెరాస వైఖరి వెల్లడిస్తాం
ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి తెరాస ఎలాంటి వైఖరిని అవలంబించాలనే దానిపై ఒకటి రెండురోజుల్లో సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని కేశవరావు తెలిపారు. ఓటింగ్లో పాల్గొనడం లేదా తటస్థంగా ఉండడం అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. తెరాస ఇప్పటికీ భాజపా వ్యతిరేక వైఖరితోనే ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!