‘5జీ’ సేవల్లో ఐఐటీ హైదరాబాద్ ముద్ర!
భవిష్యత్తు సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో ఐఐటీ హైదరాబాద్ కీలకపాత్ర పోషిస్తోంది. 5జీ సేవలను అందుబాటులోకి తేవడంలోనూ ఈ సంస్థదే ప్రధాన భూమిక. ప్రధాని మోదీ అక్టోబరు 1న 5జీ సేవలను ప్రారంభించనున్నారు.
దేశీయంగా సాంకేతికతను అభివృద్ధి చేసిన పరిశోధకులు
నెల్లూరుకు చెందిన ఆచార్య కిరణ్కూచి పాత్ర కీలకం
ఈనాడు, సంగారెడ్డి: భవిష్యత్తు సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో ఐఐటీ హైదరాబాద్ కీలకపాత్ర పోషిస్తోంది. 5జీ సేవలను అందుబాటులోకి తేవడంలోనూ ఈ సంస్థదే ప్రధాన భూమిక. ప్రధాని మోదీ అక్టోబరు 1న 5జీ సేవలను ప్రారంభించనున్నారు. దేశీయంగానే ఈ సాంకేతికతను అభివృద్ధి చేసిన ఐఐటీ హైదరాబాద్ ఈ రంగంలో తనమైన ముద్ర వేసింది. గతంలో 3జీ, 4జీ సేవలను వాడుకునేందుకు భారత్ పూర్తిగా విదేశాలపైనే ఆధారపడింది. ఐఐటీ హైదరాబాద్లో సాగించిన పరిశోధనల కారణంగా దేశీయంగానే 5జీ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి వీలుకలిగింది.
* ఐఐటీ హైదరాబాద్లో 2016 నుంచి ‘5జీ’పై పరిశోధనలు మొదలయ్యాయి. ఇందుకు అవసరమైన మాసివ్ మిమో సాంకేతికతతో పాటు ఇతర వ్యవస్థలనూ ఇక్కడ అభివృద్ధి చేశారు. 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు వివిధ పరికరాలనూ రూపొందించారు. వీటిని దేశంలోనే ఉత్పత్తి చేసేలా ఒప్పందాలు చేసుకున్నారు. పారిశ్రామికంగా 5జీ సేవలను విస్తృతంగా వాడుకునేందుకు వీలుగా నారోబ్యాండ్-ఐవోటీ చిప్ను సిద్ధం చేశారు. దీంతో వైద్య ఆరోగ్యం, రవాణా, విద్యుత్తు.. ఇలా అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులు తేవచ్చంటున్నారు. ఏడాదిలోగా చిప్ ఉత్పత్తి కానుంది.
‘6జీ’ దిశగానూ..
6జీ సాంకేతికత అభివృద్ధిలోనూ ఐఐటీ పరిశోధకులు కీలక ముందడుగు వేశారు. 5జీ నెట్వర్క్తో పోలిస్తే ఇందులో స్పెక్ట్రమ్ సామర్థ్యాన్ని మూడింతలు పెంచగలిగారు. ఇందుకోసం మాసివ్ మిమో బేస్స్టేషన్ను ఐఐటీ ప్రాంగణంలో ఈ ఏడాది మే నెలలో విజయవంతంగా ఏర్పాటుచేశారు. దీనిద్వారా అధిక నాణ్యత గల వీడియోలు, ఆడియోలను పొందవచ్చు. రద్దీ రైల్వేస్టేషన్లు, సభలు, ఇతర ప్రాంతాల్లోనూ అంతరాయం లేకుండా నాణ్యమైన అంతర్జాల సేవలను వాడుకోవచ్చు.
పరిశోధనల్లో ‘కిరణం’..
ఐఐటీ హైదరాబాద్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఆచార్య కిరణ్కూచి ఈ పరిశోధనల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆయన నాయకత్వంలోనే పరిశోధనలు సాగుతున్నాయి. 2016లో ఐఐటీ ప్రాంగణంలో 5జీ బేస్స్టేషన్ను ఏర్పాటు చేశారు. ఈ సాంకేతికత అభివృద్ధి ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేస్తుందని కిరణ్కూచి ‘ఈనాడు’కు వివరించారు. దిల్లీలో శనివారం నిర్వహించే కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్ 5జీ రంగంలో చేసిన ఆవిష్కరణలను ప్రదర్శిస్తామన్నారు. వీటి గురించి ప్రధాని మోదీకి వివరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తమ సాంకేతికతను వచ్చే మూడేళ్లలో పూర్తిస్థాయిలో వాడుకునే వీలుంటుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?