Delhi liquor scam: అభిషేక్ అరెస్టు
దిల్లీ మద్యం ముడుపుల కేసులో హైదరాబాద్కు చెందిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్ను సీబీఐ అరెస్టు చేసింది. మద్యం విధాన రూపకల్పనలో కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూరేలా రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ వ్యవహరించిందనే అభియోగాలున్నాయి.
దిల్లీ మద్యం ముడుపుల కేసులో.. మూడు రోజుల కస్టడీకి అప్పగించిన కోర్టు
సీబీఐ తాజా చర్యతో రాష్ట్రంలో ప్రకంపనలు
తెలంగాణలోని ప్రముఖులకూ నోటీసులు ఇచ్చే అవకాశం
ఈనాడు- దిల్లీ, హైదరాబాద్: దిల్లీ మద్యం ముడుపుల కేసులో హైదరాబాద్కు చెందిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్ను సీబీఐ అరెస్టు చేసింది. మద్యం విధాన రూపకల్పనలో కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూరేలా రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ వ్యవహరించిందనే అభియోగాలున్నాయి. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని అభిషేక్ను సీబీఐ అధికారులు ఆదివారం దిల్లీకి పిలిపించారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు. దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట సోమవారం హాజరుపరిచారు. విచారణలో అభిషేక్ తమ ప్రశ్నలకు సమాధానాలివ్వకుండా దాటవేశాడని.. అతడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు అయిదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని సీబీఐ అధికారులు కోరారు. మూడు రోజుల కస్టడీకి న్యాయమూర్తి అనుమతించారు. అభిషేక్ అరెస్ట్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఈ వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో అరుణ్ రామచంద్రన్ పిళ్లై నిందితుడిగా ఉన్నాడు. ఆయన డైరెక్టర్గా ఉన్న రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ(లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్) సంస్థతో పాటు అరుణ్ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. రాబిన్ డిస్ట్రిబ్యూషన్లో అరుణ్తో పాటు బోయినపల్లి అభిషేక్ కూడా డైరెక్టర్గా ఉన్నట్లు బయటపడింది. దీంతో అభిషేక్ వ్యాపారాలు, కార్యకలాపాలపైనా సీబీఐ అధికారులు దృష్టిసారించారు. మనీశ్ సిసోదియా అనుచరుడు అర్జున్పాండేకు విజయ్ నాయర్ తరఫున మహేంద్రు రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల నగదును అందజేశాడన్నది సీబీఐ అభియోగం. ఈ డబ్బులో కొంత పిళ్లైదని అనుమానిస్తున్నారు. ఈ కేసులో రామచంద్రన్ పిళ్లైని కాకుండా.. అనూహ్యంగా అభిషేక్ను అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. అతనికి రాష్ట్రంలో ఉన్న సంబంధాల దృష్ట్యా వ్యూహాత్మకంగానే అరెస్టు చేసినట్లు భావిస్తున్నారు.
అభిషేక్ వ్యాపారాలకు సంబంధించి సీబీఐ, ఈడీలు ఇప్పటికే సమాచారం సేకరించాయి. ఎస్.ఎస్. మైన్స్ అండ్ మినరల్స్ ఎల్ఎల్పీ, మాస్టర్ సాండ్ ఎల్ఎల్పీ, వాల్యూకేర్ ఈస్తటిక్స్ లిమిటెడ్, నీయోవెర్స్ రియాల్టీ, అనూస్ హెల్త్ అండ్ వెల్నెస్, అగస్తి వెంచర్స్ ఎల్ఎల్పీ, రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ, జెయూస్ నెట్వర్కింగ్ ప్రైవేట్ లిమిటెడ్, అనూస్ ఎలక్ట్రాలిసిస్ అండ్ ఒబెసిటీ సంస్థలలో అతనికి భాగస్వామ్యం ఉందని ప్రాథమికంగా గుర్తించాయి. ఈ సంస్థలకు ఆడిటింగ్ నిర్వహిస్తున్న గోరంట్ల అసోసియేట్స్లోనూ సోదాలు జరిగాయి. పిళ్లైకి రాష్ట్రానికి చెందిన అనేక మంది ప్రముఖులతో వ్యాపార భాగస్వామ్యం ఉందని బయటపడింది. అతని తరఫున అభిషేక్ కీలకపాత్ర పోషించాడని, దక్షిణాదికి చెందిన అనేక మద్యం సంస్థలకు మధ్యవర్తిగా వ్యవహరించి ముడుపులు కూడగట్టాడన్నది దర్యాప్తు సంస్థల అనుమానం. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ వారంలోనే రాష్ట్రానికి చెందిన ప్రముఖులకు విచారణకు హాజరు కావాల్సిందిగా సీబీఐ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో రాష్ట్రం కేంద్రంగా మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకోవచ్చని భావిస్తున్నారు. ఈ కేసుతో సంబంధం ఉందన్న అనుమానంతో హైదరాబాద్కు చెందిన రాహుల్ అనే వ్యక్తికి ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఆయన విదేశాల్లో ఉన్నారని, అక్కడి నుంచి తిరిగివచ్చిన తర్వాత విచారణకు హాజరవుతారని కుటుంబసభ్యులు తెలిపారు.
ఇదీ నేపథ్యం..
దిల్లీ ప్రభుత్వ మద్యం విధానం రూపకల్పనలో అవకతవకలు జరిగాయని విచారణ జరపాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ రాయడంతో సీబీఐ రంగంలోకి దిగింది. దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా సహా 16 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అందులో మొదటి నిందితుడిగా సిసోదియా ఉండగా దిల్లీ ఎక్సైజ్ కమిషనర్గా వ్యవహరించిన తెలుగు వ్యక్తి అరవ గోపాలకృష్ణ, హైదరాబాద్కు చెందిన రామచంద్ర పిళ్లైలపైనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో సీబీఐ, ఈడీలు దిల్లీ, హైదరాబాద్ సహా పలు నగరాల్లో సోదాలు నిర్వహించాయి. ఓన్లీ మచ్ లౌడర్ సంస్థ మాజీ సీఈవో విజయ్ నాయర్ను సీబీఐ గత నెలలో అరెస్టు చేయగా.. అభిషేక్ అరెస్టు రెండోది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM