‘జ్యోతిషం ప్రకారం తెలంగాణలో ఎన్నికలు’: సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్య
తెలంగాణలో ఎన్నికలు జ్యోతిషం ప్రకారం వస్తాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ వ్యాఖ్యానించారు.
ఈనాడు, దిల్లీ: తెలంగాణలో ఎన్నికలు జ్యోతిషం ప్రకారం వస్తాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ వ్యాఖ్యానించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై అనర్హత వేటు వేయాలంటూ తెరాస నేత ప్రేమ్సింగ్ రాథోడ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఈ పిటిషన్ జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఇది 2018 ఎన్నికల నాటి పిటిషన్ అని, మరికొన్ని వివరాల సమర్పణకు 3 వారాల సమయం కావాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఈ దశలో జోక్యం చేసుకున్న జస్టిస్ వి.రామసుబ్రమణియన్.. ‘‘తెలంగాణలో జ్యోతిషం ప్రకారం 2018లో ముందస్తుగా ఎన్నికలు వచ్చాయి. అలాగే ఈ కేసు విచారణకూ గ్రహాలన్నీ ఒకే వరుసలోకి రావాలి కావచ్చు’’ అంటూ వ్యాఖ్యానించారు. విచారణను జనవరికి వాయిదా వేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Gudivada Amarnath: త్వరలో విశాఖ భవిష్యత్తు మారుతుంది: మంత్రి అమర్నాథ్
-
Ap-top-news News
Taraka Ratna: మెదడు సంబంధిత సమస్య మినహా తారకరత్న క్షేమం: విజయసాయిరెడ్డి
-
India News
బడ్జెట్ అంశాలు లీకవడంతో.. పదవిని కోల్పోయిన ఆర్థిక మంత్రి
-
Sports News
Hanuma Vihari: విహారి ఒంటి చేత్తో.. మణికట్టు విరిగినా బ్యాటింగ్
-
Ts-top-news News
Samathamurthy: నేటి నుంచి సమతా కుంభ్ బ్రహ్మోత్సవాలు
-
Crime News
Crime News: పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం.. తెదేపా మండలాధ్యక్షుడికి గాయాలు