‘ప్రత్యేక’ ఆకలి తీర్చేదెవరు?
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించిన విద్యాశాఖ.. వారికి అల్పాహారం, చిరుతిళ్లు అందించడంపై శ్రద్ధ చూపడం లేదు.
చదువుపై దృష్టి నిలపలేకపోతున్న సర్కారు బడుల విద్యార్థులు
ప్రభుత్వమే నిధులు కేటాయించాలంటున్న ఉపాధ్యాయులు
అక్కడక్కడా హెచ్ఎంల చొరవ.. ముందుకొచ్చిన దాతలు
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించిన విద్యాశాఖ.. వారికి అల్పాహారం, చిరుతిళ్లు అందించడంపై శ్రద్ధ చూపడం లేదు. ఉదయం 8.30కి బడులకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకు మధ్యాహ్నం తిన్న భోజనంతో ఎలా సరిపెట్టుకోగలరో ఆలోచించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పిల్లలు మాత్రం ఆకలి కారణంగా పూర్తి స్థాయిలో చదువుపై మనసు కేంద్రీకరించలేకపోతున్నారని ఉపాధ్యాయవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 3 నుంచి మార్చి 10వ తేదీ వరకు రోజుకు 2 గంటల చొప్పున 10 పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పనిచేస్తాయి. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు ఒక సబ్జెక్టు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు మరో సబ్జెక్టును బోధించాలని సూచిస్తూ.. కాలపట్టికను జారీ చేసింది. ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమయ్యే టెన్త్ పరీక్షలకు 5 లక్షల మంది హాజరవుతారు. వారిలో సాధారణ ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో సుమారు 2.50 లక్షల మంది విద్యార్థులున్నారు. ‘ఉదయం కనీసం 50 శాతం మంది అల్పాహారం తీసుకోకుండానే తరగతులకు వస్తున్నారు. ఈరెండు నెలలైనా ఉదయం అల్పాహారం, సాయంత్రం చిరుతిళ్లు అందిస్తే పిల్లలు చదువుపై దృష్టి సారిస్తారు’ అని హెచ్ఎంలు అభిప్రాయపడుతున్నారు. ‘అన్నిచోట్లా దాతలు ముందుకు రాకపోవచ్చు. ప్రభుత్వమే అల్పాహారం కోసం నిధులు మంజూరు చేయాలి. ఉదయం పాలు, బిస్కెట్లు, సాయంత్రం అరటిపండు, పల్లీపట్టీలు, ఉడకబెట్టిన పల్లీలు ఇచ్చినా చాలు’ అని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జాడి రాజన్న కోరారు. గతంలో కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు అల్పాహారం కోసం నిధులిచ్చారు. ఈసారి కూడా వారు చొరవ తీసుకోవాలని విన్నవించారు.
కరీంనగర్ కార్పొరేషన్... భేష్
* కరీంనగర్ నగరపాలక సంస్థ తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10 విద్యార్థుల అల్పాహారం కోసం రూ.9 లక్షలు కేటాయించింది. గతంలో సరస్వతి ప్రసాదం పేరుతో అల్పాహారాన్ని అందించగా... ఈసారి విద్యార్థి చేయూత పేరిట అందించనున్నారు.
* కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఒద్యారం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్రావు చొరవతో అదే గ్రామానికి చెందిన కరీంనగర్లో స్థిరపడిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు రూ.5 వేలు విరాళంగా అందించారు. ఆ పాఠశాల విద్యాకమిటీ ఛైర్మన్ కడపాల లింగయ్య మార్చి వరకు అల్పాహారం ఇచ్చేందుకు హామీ ఇచ్చారు.
* ఖమ్మం జిల్లా మధిర సీపీఎస్ ఉన్నత పాఠశాలలో అక్కడి ప్రధానోపాధ్యాయుడు ప్రభుదయాళ్ చొరవతో పారుపల్లి వెంకటేశ్వర్రావు విద్యార్థుల కోసం 25 కిలోల ఉప్మా రవ్వను అందించారు. దాన్ని వండి సాయంత్రం అందిస్తున్నారు.
* ఇంకా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని 5 పాఠశాలల్లో.., సూర్యాపేట జిల్లాలోని కొన్ని బడుల్లో పలువురు ప్రజాప్రతినిధులు అల్పాహారం అందించేందుకు సహకారం అందిస్తున్నారు.
ఖాళీ కడుపుతోనే తరగతులకు వస్తున్నా
మాది నాగర్కర్నూల్ జిల్లా వెల్డండ మండలం బైరాపురం. వెల్డండ జడ్పీ ఉన్నత పాఠశాలకు, మా ఊరికి మధ్య 15 కిలోమీటర్ల దూరం. అందువల్ల ప్రత్యేక తరగతుల కోసం గ్రామం నుంచి ఉదయం 7 గంటలకు బయలుదేరాలి. ఏమీ తినకుండానే తరగతులకు హాజరువుతున్నా. మధ్యాహ్నం 1గంటకు బడిలో మధ్యాహ్న భోజనం తింటాను. సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు ప్రత్యేక తరగతి ఉంటుంది. మళ్లీ ఆటోలో ఇంటికి వెళ్లేసరికి 6.30- 7 గంటలవుతోంది. అప్పటివరకు ఏమీ తినకుండా ఉండటంతో నీరసంగా ఉంటోంది. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్ అందించాలి.
నవనీత, పదో తరగతి విద్యార్థిని, వెల్డండ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్