TSPSC: అక్టోబరు నుంచి ప్రశ్నపత్రాల చౌర్యం
ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి సిట్ జరుపుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో అంతా తామై వ్యవహరించిన సిస్టమ్ ఎనలిస్ట్ రాజశేఖర్, కార్యదర్శి పీఏ ప్రవీణ్ల ద్వయం అక్టోబరు నుంచే ఈ దందా మొదలుపెట్టినట్లు వెల్లడైంది.
రాజశేఖర్, ప్రవీణ్ల గుప్పెట్లో టీఎస్పీఎస్సీ కంప్యూటర్ వ్యవస్థ
సిట్ నివేదికలో సంచలన విషయాలు
ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి సిట్ జరుపుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో అంతా తామై వ్యవహరించిన సిస్టమ్ ఎనలిస్ట్ రాజశేఖర్, కార్యదర్శి పీఏ ప్రవీణ్ల ద్వయం అక్టోబరు నుంచే ఈ దందా మొదలుపెట్టినట్లు వెల్లడైంది. ఇందుకోసం మొత్తం కంప్యూటర్ వ్యవస్థను తమ అధీనంలోకి తెచ్చుకొని అప్పటి నుంచే కాన్ఫిడెన్షియల్ సిస్టమ్లో యాక్సెస్ అయినట్లు తెలుస్తోంది. ఆరు నెలలుగా ఈ వ్యవహారం నడుస్తున్నా.. ఎవరూ పసిగట్టలేకపోవడం గమనార్హం. ఎప్పుడు కావాలంటే అప్పుడు రాజశేఖర్ ఎలాంటి సమాచారమైనా తస్కరించి ప్రవీణ్కు అందజేసేవాడు. అయితే, టౌన్ప్లానింగ్(టీపీబీవో) ప్రశ్నపత్రం లీక్ అయినట్లు ఫిర్యాదు రావడంతో రేణుక కోసమే తాను ప్రశ్నపత్రం తస్కరించానని ప్రవీణ్ చెప్పాడు. కానీ, అది అబద్ధమని తేలింది. లీకేజీ కేవలం ఆ పరీక్షకు మాత్రమే పరిమితమని నమ్మించేందుకే రేణుక ప్రస్తావన తెచ్చాడని.. వాస్తవానికి మిగతా ప్రశ్నపత్రాలనూ ప్రవీణ్, రాజశేఖర్ ముఠా చోరీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా సిట్ సిద్ధం చేసిన నివేదికలో ఇలాంటి సంచలనాత్మక విషయాలెన్నో బయటపడుతున్నాయి. రాజశేఖర్, ప్రవీణ్లు కమిషన్ కార్యాలయంలో సాగించిన హవా చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న కమిషన్ కార్యాలయంలో లీకేజీలకు తావులేకుండా కనీస భద్రతా ఏర్పాట్లు లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
అన్ని పరీక్షలపైనా కన్ను
ప్రవీణ్, రాజశేఖర్లు కమిషన్ నిర్వహించబోయే అన్ని పరీక్షలపైనా కన్నేసినట్లు తెలుస్తోంది. దాదాపు సంవత్సరం క్రితం టీఎస్పీఎస్సీ కార్యాలయంలోని కంప్యూటర్ వ్యవస్థను అప్గ్రేడ్ చేశారు.. ఈ క్రమంలో వ్యవస్థను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు అప్పటి నుంచే వారిద్దరూ ప్రణాళిక మొదలుపెట్టినట్లు భావిస్తున్నారు. కమిషన్లో ప్రత్యేకంగా కాన్ఫిడెన్షియల్ విభాగం ఉంది. ఇది సూపరింటెండెంట్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో పని చేస్తుంది. కార్యదర్శి, ఛైర్మన్లకు మాత్రం దీనిపై అజమాయిషీ ఉంటుంది. పరీక్షల కోసం సిద్ధం చేసే ప్రశ్నపత్రాలను కాన్ఫిడెన్షియల్ విభాగంలోని కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తారు. ఈ విషయం రాజశేఖర్కు తెలుసు. దాంతో కంప్యూటర్ నెట్వర్క్ అప్గ్రేడేషన్ పేరుతో డైనమిక్ ఐపీని స్టాటిక్ ఐపీగా మార్చాడు. అంటే ఇంచుమించు కాన్ఫిడెన్షియల్ విభాగంలోని కంప్యూటర్ను తన కంప్యూటర్ ద్వారా నియంత్రించగలిగేలా చేశాడన్నమాట. ఈ క్రమంలోనే అక్టోబరులోనే గ్రూప్-1 పరీక్ష ప్రశ్నపత్రం తస్కరించాడు.
పెన్డ్రైవ్ అబద్ధం..
టౌన్ప్లానింగ్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందని వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు జరిపిన దర్యాప్తులో ప్రవీణ్ వ్యవహారం బయటపడింది. తన స్నేహితురాలు రేణుక అభ్యర్థన మేరకు మిత్రుడు రాజశేఖర్తో కలిసి ఏఈ ప్రశ్నపత్రం తస్కరించి ఇచ్చానని చెప్పాడు. కార్యాలయానికి చెందిన ఓ ఉద్యోగి యూజర్ ఐడీ, పాస్వర్డ్ తస్కరించి, దాని ద్వారా ఫిబ్రవరిలో ప్రశ్నపత్రాలకు సంబంధించిన ఫోల్డర్ను నాలుగు పెన్డ్రైవ్లలో కాపీ చేసుకున్నట్లు రాజశేఖర్ చెప్పాడు. కానీ, అక్టోబరులోనే ప్రశ్నపత్రాలు తస్కరించినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. అక్టోబరు 16వ తేదీన గ్రూప్-1 పరీక్ష జరిగింది. స్వయంగా ఈ పరీక్ష రాసిన ప్రవీణ్కు మంచి మార్కులు వచ్చినట్లు తేలగానే అనుమానాలు ముసురుకున్నాయి. ఆ అనుమానంతోనే లోతుగా దర్యాప్తు చేశారు. ఇందులో అక్టోబరు నుంచే కమిషన్ కంప్యూటర్ వ్యవస్థను రాజశేఖర్, ప్రవీణ్లు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు నిర్ధారణ అయింది. దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు పెన్డ్రైవ్ నాటకం ఆడారని తేలిపోయింది.
పెరగనున్న నిందితులు
అక్టోబరు నుంచి ఇప్పటి వరకూ కమిషన్ గ్రూప్-1, ఫుడ్సేఫ్టీ ఆఫీసర్, సీడీపీఓ, సూర్వైజర్ గ్రేడ్-2, ఏఈఈ, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, ఏఈ.. ఇలా మొత్తం ఏడు ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించారు. అయితే, అక్టోబరు నుంచే ప్రవీణ్, రాజశేఖర్ల దందా నడుస్తోందన్న ఆధారాల నేపథ్యంలో మిగతా పరీక్షల ప్రశ్నపత్రాలూ బయటకు తెచ్చి ఉంటారనే అనుమానం కలుగుతోంది. దీన్ని నిర్ధారించుకునేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో గ్రూప్-1 పరీక్షలో 100 కంటే ఎక్కువ మార్కుల వచ్చిన వారందర్నీ పిలిచి విచారిస్తున్నట్లు విశ్వపనీయ సమాచారం. దాంతోపాటు ప్రవీణ్, రాజశేఖర్ల ఫోన్ డేటా ఆధారంగానూ దర్యాప్తు జరుపుతున్నారు. పూర్తయిన మిగతా అన్ని పరీక్షల్లో పాల్గొని, మంచి మార్కులు తెచ్చుకున్న అభ్యర్థులందరినీ విచారించే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రవీణ్, రాజశేఖర్ల నుంచి వారిలో ఎవరికైనా ఫోన్లు వెళ్లినట్లు నిర్ధారణ అయితే అలాంటి వారిని మరింత క్షుణ్ణంగా విచారించనున్నారు. ఇప్పటికే నాలుగు పరీక్షలు రద్దు చేశారు. అంటే అవన్నీ ముందుగానే లీక్ అయినట్లు కమిషన్ నిర్ధారించినట్లే. ఈ నాలుగు పరీక్షల ప్రశ్నపత్రాలు ఇంకా ఎవరైనా పొంది ఉన్నట్లు సిట్ దర్యాప్తులో తేలితే వారందర్నీ కేసులో నిందితులుగా చేర్చనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టిన జ్యుడిషియల్ విచారణలో భాగంగా నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెలలో మొదటి దఫా పర్యటన సందర్భంగా జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నీటిపారుదల శాఖ అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
పగలు నిప్పులు.. సాయంత్రం పిడుగులు
భరించలేని ఎండలు ఒకవైపు.. ఈదురుగాలులతో కూడిన వర్షాలు మరోవైపు. రాష్ట్రంలో ఆదివారం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఆరు జిల్లాల్లోని 15 మండలాలు ఎండల తీవ్రతతో ఉడికిపోయాయి. -
పనికెళ్లలేక.. పడుకోలేక..
వేసవి ఎండలు పగలే కాదు.. రాత్రుళ్లు కూడా ‘చెమట’ చుక్కలు చూపిస్తున్నాయి. ఏసీలున్న కుటుంబాల్లో పర్వాలేకున్నా.. ఫ్యాన్లు, కూలర్లు ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాల్లో మాత్రం నిద్ర కరవుతోంది. -
ఉపాధ్యాయుల పదోన్నతికి టెట్ అవసరం లేదు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు సంబంధించి జాతీయ ఉపాధ్యాయ మండలి(ఎన్సీటీఈ) పంపిన వివరణ లేఖను వెల్లడించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) డిమాండ్ చేశాయి. -
రేపటిలోగా పంట నష్టపరిహారం
రాష్ట్రంలోని పది జిల్లాల్లో గత మార్చి 16 నుంచి 24 వరకు కురిసిన వడగళ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రకటించిన పరిహారాన్ని మంగళవారంలోపు వారి ఖాతాల్లో జమ చేయాలని వ్యవసాయ శాఖాధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై వైకాపా ఫిర్యాదు నాన్ కాగ్నిజబుల్ నేరం
‘ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆ చట్టాన్ని వినియోగించి వైకాపా, జగన్ ప్రజల భూములను లాక్కుంటున్నట్లు తెదేపా చెబుతోంది. -
జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని మొదటి ఈఎంఈ సెంటర్లో జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ పౌర సంబంధాల అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ప్రజారోగ్యశాఖ ఈఎన్సీగా జియాఉద్దీన్
రాష్ట్ర ప్రజారోగ్యశాఖ ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్)గా జియాఉద్దీన్ బాధ్యతలు తీసుకున్నారు. ఆ స్థానంలోని ఆర్.శ్రీధర్ ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందగా.. ఆ బాధ్యతను నిర్వహించాలని జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియాఉద్దీన్ను ప్రభుత్వం ఆదేశించింది. -
యాదాద్రికి పోటెత్తిన భక్తజనం
అసలే వేసవి సెలవులు.. ఆపై ఆదివారం కావడంతో యాదాద్రి క్షేత్రానికి భక్తుల రాక గణనీయంగా పెరిగింది. దీంతో క్షేత్ర పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. -
వాగులు, వంకలు దాటి.. ఓటు వేయించి
మంచిర్యాల జిల్లా పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వేమనపల్లి మండలంలో ఆరు గ్రామాల్లోని ఏడుగురు వయోవృద్ధులతో ఆదివారం మండుటెండలో ఇంటి నుంచి ఓటు వేసే ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. -
నందిపాడు పరిసరాల్లో చిరుతపులి మృతి
నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నందిపాడు-చింతల్కుంట గ్రామాల మధ్య ఉన్న ఓ వ్యవసాయ పొలంలో చిరుతపులి కళేబరం కనిపించింది. -
ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాల జాప్యంపై స్పష్టత ఇవ్వండి
ఆర్టీసీ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలు ఇప్పటికీ ఎందుకు చెల్లించలేదో యాజమాన్యం వివరణ ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ డిమాండ్ చేశారు. -
వడదెబ్బ నివారణకు ఎన్సీడీసీ మార్గదర్శకాలు పాటించండి
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నందున.. కార్మికులకు అవసరమైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఈఎస్ఐ ఆసుపత్రులను ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ఆదేశించింది. -
ముగిసిన నీట్-యూజీ పరీక్ష
నీట్-యూజీ ఎంబీబీఎస్ ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రం కొంత కఠినంగా ఉన్నట్లు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నీట్-యూజీ ప్రవేశపరీక్ష ఆదివారం ముగిసింది. -
బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటైనట్లు ఆ సంఘం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
వేసవిలో ఉద్యానపంటలపై రైతులకు అవగాహన
వేసవిలో ఉద్యానపంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఉద్యానవన సంచాలకుడు కె.అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆయన జిల్లా అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
-
ఐపీఎల్ 2024: ‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్