పల్లెకు వెలుగేది?.. పయనించే వీలేది?
రాష్ట్రంలో బస్సు సౌకర్యం లేని గ్రామాలు భారీ సంఖ్యలో ఉన్నాయి. కొవిడ్ సమయంలో రద్దు చేసినవాటిలో చాలావరకు పునరుద్ధరించలేదు.
ఆదాయ మార్గంలోనే ఆర్టీసీ ప్రయాణం
గ్రామాలకు దూరమవుతున్న ప్రజారవాణా సంస్థ
రాష్ట్రవ్యాప్తంగా బస్సు సౌకర్యం లేని ఊళ్లు 1497
ప్రైవేటు వాహనాల్ని ఆశ్రయిస్తున్న పల్లె ప్రజలు
అధిక ఛార్జీల భారం.. ప్రమాదాల బెడద
రాష్ట్రంలో బస్సు సౌకర్యం లేని గ్రామాలు భారీ సంఖ్యలో ఉన్నాయి. కొవిడ్ సమయంలో రద్దు చేసినవాటిలో చాలావరకు పునరుద్ధరించలేదు. తిరుగుతున్న వాటిలోనూ పలు బస్సులను ఆదాయ కోణంలో అధికారులు రద్దు చేస్తున్నారు. దీంతో ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఆటోలు, ప్రైవేటు వాహనాల్ని ఆశ్రయించాల్సి వస్తోంది. బస్సుల్లో పాస్లు చూపి రాయితీతో ప్రయాణించిన విద్యార్థులు ప్రైవేటువాహనాల ఛార్జీలు భరించలేక విలవిల్లాడుతున్నారు. ఒక్కో ఆటోలో 15 మంది, జీపులో 25 మందిని తీసుకెళ్తుండటంతో ప్రయాణాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి.
ప్రైవేటు వాహనాలే దిక్కు
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం సోమేశ్వరబండ నుంచి నిత్యం మండల కేంద్రానికి 300 మందికిపైగా రాకపోకలు సాగిస్తుంటారు. కొద్దినెలల క్రితం ఈ ఊరి బస్సు రద్దయ్యింది. దీంతో ప్రైవేటు వాహనాల్లో రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలో అత్యధికం మారుమూల గిరిజన ప్రాంతాలే. ఏ అవసరం వచ్చినా ఇచ్చోడకు వెళ్లాలి. భీంపూర్ నుంచి సిరికొండకు 20 కి.మీ. అక్కడి నుంచి ఇచ్చోడ మరో 15 కి.మీ. ఆర్టీసీ బస్సుల్లేక 60కి పైగా ప్రైవేటువాహనాలు ఇచ్చోడ-సిరికొండ మధ్య తిరుగుతున్నాయి. ఒక్కో జీపులో 25 మందికిపైగా ఎక్కించుకుంటుండటంతో బాలింతలు, గర్భిణులు, వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిరికొండతో పాటు ఆయా గ్రామాలకు చెందిన విద్యార్థులు 100 మందికి పైగా ప్రైవేటు వాహనాల్లోనే ఇచ్చోడలో కాలేజీకి వెళ్లి వస్తారు. రోజూ రూ.50 ఛార్జీల భారం పడుతుండటంతో విద్యార్థుల చదువుపై ప్రభావం చూపుతోంది.
పెద్దపల్లి నుంచి ఓదెల, ముత్తారం, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లోని మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. 30 కి.మీ.దూరం ఆటోల్లోనే వెళ్లాల్సిన పరిస్థితి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఉన్న దేవునిపల్లికి..అదేవిధంగా ముత్తారం, గౌరెడ్డిపేటలకూ బస్సులేదు. రెండు, మూడు నెలలుగా అనేక బస్సులు రద్దవుతున్నాయి. వాటిలో సూర్యాపేట జిల్లాలో సంగెం-జగద్గిరిగుట్ట, తుంగతుర్తి-హన్మకొండ, కోడూరు-సూర్యాపేట, బండరామారం-సూర్యాపేట, తిరుమలగిరి-తాటిపాముల వంటి పలు సర్వీసులున్నాయి.వాటిని పునరుద్ధరించాలని స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి డిపో మేనేజర్లకు పెద్దసంఖ్యలో వినతిపత్రాలు అందుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలంలో 22 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు.
కొత్త బస్సులు లేక..
గ్రామీణ ప్రాంతాలకు సర్వీసుల రద్దుకు బస్సుల సంఖ్య తగ్గుతుండటం కూడా మరో కారణం. కాలం చెల్లుతున్న బస్సుల స్థానంలో అంతేస్థాయిలో కొత్త బస్సులను ఆర్టీసీ ఆర్థిక ఇబ్బందులతో ప్రవేశపెట్టలేకపోతోంది. 2015-16లో 10,446 బస్సులుంటే 2022 డిసెంబరులో ఆ సంఖ్య ఏకంగా 9092కి పరిమితమైంది. గత డిసెంబరులో ఉన్న 9653 బస్సులతో పోలిస్తే ఏడాదిలోనే ఏకంగా 561 బస్సులు తగ్గాయి. ఆర్టీసీ వర్గాలు మాత్రం రాష్ట్రంలో కొత్త రెవిన్యూ గ్రామాలు ఏర్పడిన కారణంగానే బస్సులు వెళ్లనివాటి సంఖ్య పెరిగిందని చెబుతున్నాయి.
ఎందుకు ఇలాంటి పరిస్థితి?
ఆర్టీసీ గతంలో లాభనష్టాలతో నిమిత్తం లేకుండా ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టు బస్సులు నడిపేది. అధ్వానపు రహదారుల్లోనూ బస్సులు తిరిగేవి. ఇప్పుడు మంచి తారు రోడ్లున్నా పల్లెవెలుగు బస్సులు వెళ్లని గ్రామాలు వందల సంఖ్యలో ఉన్నాయి. రాష్ట్రంలో ఏకంగా 1497 గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. ఏటికేడు నష్టాలు పెరుగుతుండటంతో ఆర్టీసీ అధిక ఆదాయం వచ్చే రూట్లకే ప్రాధాన్యం ఇస్తోంది. గ్రామీణ ప్రాంతాల మీదుగా ట్రిప్పులను రద్దు చేస్తోంది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా ఇటీవల ట్రిప్పుల సంఖ్య పెంచారు. జిల్లాల్లో రీజినల్, డిపో అధికారులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
ఛార్జీలు భరించే స్తోమత లేక..
ఈ అమ్మాయి పేరు కళ్యాణి. సిరికొండ గ్రామం. పక్షవాతంతో ఇంటికే పరిమితమైన తండ్రి. తల్లి కూలి పనికి వెళ్తేనే కుటుంబపోషణ. మంచి చదువుతో కుటుంబానికి అండగా ఉండాలని ఇచ్చోడలో డిగ్రీలో చేరింది. బస్సు లేదు. రోజు రూ.50 ప్రైవేటు వాహన ఛార్జీ భరించే స్తోమత లేదు. దీంతో రెండు, మూడు రోజులకోసారి కాలేజీకి వెళ్తోంది.
బస్ రూట్లు తగ్గుతున్నాయిలా..!
2021 డిసెంబరులో 3583 రూట్లలో బస్సులు తిరిగితే 2022 డిసెంబరు నాటికి 3025కి పరిమితమైంది. అంటే 558 రూట్లలో బస్సులను తొలగించారు. 2023 జనవరి నుంచి ఈ సంఖ్య మరింత పెరిగింది.
* ఆదిలాబాద్ జిల్లా సిరికొండ.. పేరుకు మండల కేంద్రం. కానీ బస్సు సౌకర్యమే లేదు. మండలం కాకముందు సిరికొండ నుంచి ఇచ్చోడకు ప్రతి గంటకు ఓ బస్సుండేది. తర్వాత ఉదయం, సాయంత్రానికి పరిమితమైంది. ఇప్పుడు ప్రైవేటు వాహనాలే దిక్కు. ఛార్జీల భారం భరించలేక కొందరు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
* జిల్లా కేంద్రం సూర్యాపేట నుంచి తుంగతుర్తికి 20 ఏళ్లుగా ఉన్న నైట్ హాల్ట్ బస్సును ఆర్టీసీ రద్దు చేసింది. ఈ మండలంలో పెద్ద గ్రామం, 12 వేల జనాభా ఉన్న గొట్టిపర్తికి ఇప్పుడు బస్సు సౌకర్యమే లేదు.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్