పరిహారంపైనే ఆశలు.. అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతులు
రాష్ట్రంలో కొన్నేళ్లుగా అకాల వర్షాలు, వరదలు, చెరువులకు గండ్లు, ప్రాజెక్టుల బ్యాక్వాటర్ తదితర కారణాలతో పంటలను నష్టపోతున్న వారికి తగిన ఆసరా అందడం లేదు.
సరిగా లేదని కేంద్ర బీమా పథకం నుంచి వైదొలిగిన రాష్ట్రం
ఇంకా కార్యరూపం దాల్చని రాష్ట్ర పథకం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో కొన్నేళ్లుగా అకాల వర్షాలు, వరదలు, చెరువులకు గండ్లు, ప్రాజెక్టుల బ్యాక్వాటర్ తదితర కారణాలతో పంటలను నష్టపోతున్న వారికి తగిన ఆసరా అందడం లేదు. రైతుబంధు, బీమా, ఉచిత కరెంటు తదితర పథకాల ద్వారా ప్రయోజనం కలుగుతున్నా.. పంటలు నష్టపోయిన సందర్భాల్లో మాత్రం సాయం అందడం లేదని రైతులు వాపోతున్నారు. బీమా పథకాలు అమలు కాకపోవడం, పరిహారం చెల్లింపులు సరిగా జరగకపోవడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం రైతులకు శాపంగా మారుతోందనే విమర్శలున్నాయి. ఈ సారైనా ప్రభుత్వం పరిహారంతో ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
బీమాకు దూరం
రాష్ట్రంలో పంటల బీమా పథకాలు అమలు కావడం లేదు. 2016లో కేంద్రం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను ప్రవేశపెట్టింది. మూడేళ్ల పాటు ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. ఆ సమయలో పంట నష్టాలకు తగిన బీమా సాయం అందలేదు. దీనికి తోడు కొన్ని నిబంధనలు సాయానికి ప్రతిబంధకమయ్యాయి. వడగళ్ల వానలు, గాలుల వల్ల పంట నష్టం జరిగితే ఆశించిన పరిహారంలో 25% తక్షణమే చెల్లించాలన్న నిబంధనను కంపెనీలు పాటించలేదు. దీంతోపాటు ఇతర కారణాల వల్ల రైతుల్లో ఈ పథకంపై నిరాసక్తతత వ్యక్తమైంది. తమ కంటే బీమా కంపెనీలకే ఇది ప్రయోజనకరంగా ఉందనే భావనతో వారు ప్రీమియం చెల్లించేందుకు ముందుకు రాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం కేంద్ర పథకానికి బదులు ప్రత్యామ్నాయంగా మరో బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించి.. ఫసల్ బీమా నుంచి 2020లో వైదొలగింది. ఆ తర్వాత వరుసగా పంట నష్టాలు సంభవిస్తున్నా.. బీమా పథకం అమలులో లేకపోవడం వల్ల రైతులకు ఆ సాయం అందడం లేదు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు, వడగళ్లతోపాటు ఈదురుగాలులతో పంటలకు తీవ్ర నష్టం కలిగింది. ఈ సారైనా తమకు ప్రభుత్వం నుంచి పరిహారం వస్తుందనే ఆశతో రైతులు ఉన్నారు.
నివేదికలు రూపొందిస్తున్నా..
పంట నష్టాలు జరిగినప్పుడు వ్యవసాయాధికారులు సర్వేలు చేసి నివేదిక రూపొందిస్తున్నారు. నిబంధనల మేరకు రైతు భూవిస్తీర్ణంలో 33 శాతానికిపైగా నష్టం జరిగితేనే అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా పరిహారం వస్తుందని రైతులు భావిస్తున్నా.. అదీ సత్వరమే మంజూరు కావడం లేదు. గత ఏడాది వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్లో 30 వేల ఎకరాల పంటనష్టంపై అంచనా వేసి పరిహారం కోసం వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. అది ఇప్పటి వరకు రాలేదు. మరోవైపు పంట నష్టాలకు కేంద్రం నుంచి సాయం అందడం లేదు.
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో కొండాయిల్పల్లికి చెందిన రైతు రాదారపు రాజయ్య లక్షలు అప్పు తెచ్చి మిర్చి పండించారు. గత ఏడాది జనవరి 9, 10 తేదీల్లో కురిసిన వడగళ్ల వానతో మొత్తం పంట దెబ్బ తింది. అధికారులు వచ్చి పంట నష్టాన్ని అంచనా వేశారు. ఇప్పటి వరకు పరిహారం రాలేదు. ఆ రైతు పెట్టుబడి కోల్పోవడంతోపాటు రూ.మూడు లక్షల వడ్డీభారంతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్