మురిసిన తెలంగాణం
తెలంగాణ రాష్ట్రమంతటా మువ్వన్నెల పతాకాలు రెపరెపలాడాయి. ప్రత్యేక రాష్ట్ర కల నెరవేరి తొమ్మిదేళ్లు పూర్తయి.. పదో ఏట అడుగిడిన వేళ ఊరూరా సంబురాలు అంబరాన్నంటాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఆవిర్భావ దినోత్సవాలు
తెలంగాణ రాష్ట్రమంతటా మువ్వన్నెల పతాకాలు రెపరెపలాడాయి. ప్రత్యేక రాష్ట్ర కల నెరవేరి తొమ్మిదేళ్లు పూర్తయి.. పదో ఏట అడుగిడిన వేళ ఊరూరా సంబురాలు అంబరాన్నంటాయి. దశాబ్ది ఉత్సవాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టగా రాష్ట్రవ్యాప్తంగా పలుకార్యక్రమాలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్తో పాటు అన్నిజిల్లాల్లో సంబురాల్ని నిర్వహించారు. కేంద్ర సాంస్కృతిక శాఖ తొలిసారి హైదరాబాద్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించింది.
జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి .. అసెంబ్లీ ఆవరణలో, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి శాసనమండలిలో.. జాతీయజెండాను ఎగరేశారు. మంత్రులు కేటీఆర్ సిరిసిల్ల కలెక్టరేట్లో, హరీశ్రావు సిద్దిపేట మంత్రి క్యాంపు కార్యాలయంలో, మహమూద్ అలీ సంగారెడ్డిలో, కొప్పుల ఈశ్వర్ జగిత్యాలలో, వేముల ప్రశాంత్రెడ్డి నిజామాబాద్లో, గంగుల కమలాకర్ కరీంనగర్లో, ఎర్రబెల్లి దయాకర్రావు జనగామలో, సత్యవతి రాథోడ్ మహబూబాబాద్లో, ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్లో, నిరంజన్రెడ్డి వనపర్తిలో, జగదీశ్రెడ్డి సూర్యాపేటలో, తలసాని శ్రీనివాస్యాదవ్ మెదక్లో, శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్లో, మల్లారెడ్డి మల్కాజిగిరిలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. డిచ్పల్లిలోని 7వ పోలీస్ బెటాలియన్లో మంత్రి ప్రశాంత్రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ నర్సరీని ప్రారంభించారు. అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈసారి మరింత ఘనంగా నిర్వహించాయి.
రాష్ట్ర ప్రగతిపై దేశమంతటాచర్చ
వేడుకల్లో మంత్రి కేటీఆర్
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల: ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోక వెనకబడిన తెలంగాణ... స్వరాష్ట్రంగా అవతరించాక అన్ని రంగాల్లో ముందుకెళ్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాజన్న-సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించి, వందన సమర్పణ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... ‘‘రాష్ట్ర ఆవిర్భావం నాటికి మన ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంది. సీఎం కేసీఆర్ పటిష్ఠ కార్యాచరణ, ఆర్థిక క్రమశిక్షణతో రాబడి క్రమంగా పెరిగింది. ప్రభుత్వ ఆదాయాన్ని అత్యధికంగా పెట్టుబడి వ్యయానికి వినియోగించడం, అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇవ్వడంతో సమ్మిళిత వృద్ధి సాకారమైంది. 2014-15 నుంచి 2019-20 వరకు రాష్ట్ర వార్షిక జీఎస్డీపీ వృద్ధిరేటు 13.2 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 10.2 శాతానికి తగ్గింది. అందుకే ఈ అభివృద్ధి నమూనాపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. దేశ ప్రజలంతా దీన్నే కోరుకుంటున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. దాన్నుంచి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తక్కువ సమయంలోనే బయటపడి సుస్థిరంగా ముందుకు సాగుతోంది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రం దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికమాంద్యం ఏర్పడినా దాని ప్రభావం మన రాష్ట్రంపై అంతగా లేదు. రాష్ట్రంలోని అన్ని రంగాల్లోనూ పెట్టుబడులు పెరగడంతోనే ఇది సాధ్యమవుతోంది. ఇక తలసరి ఆదాయం మన రాష్ట్రం సాధించిన ఆర్థికవృద్ధికి మరో కొలమానం. 2013-14లో రూ.1.12 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం 2022-23లో రూ.3.17 లక్షలకు చేరిందని అంచనా. ఇది జాతీయ తలసరి ఆదాయం రూ.1.70 లక్షల కంటే 86% ఎక్కువ. ఈ గణాంకాలే తెలంగాణ సాధించిన అపూర్వ ప్రగతికి నిదర్శనాలు’’ అని వివరించారు.
తొమ్మిదేళ్లలో వందేళ్ల అభివృద్ధి
మంత్రి హరీశ్రావు
న్యూస్టుడే, సిద్దిపేట: తొమ్మిదేళ్ల ప్రగతి యాత్రను పూర్తి చేసుకొని పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణాన రాష్ట్రంలో వందేళ్ల అభివృద్ధి ఆవిష్కృతమైందని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు. ప్రజల ఆశీస్సులతో ఎన్ని అవరోధాలనైనా అధిగమిస్తామని, దశాబ్దిలో శతాబ్దపు కీర్తి ప్రతిష్ఠలను సాధించామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం వేదికగా శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించి దశాబ్ది ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సత్కరించారు. సిద్దిపేట శివారులో రూ.52 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్ను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. జిల్లాలో రెండు జాతీయ రహదారులు నిర్మాణమవుతున్నాయని, రైలు కల కూడా త్వరలోనే సాకారం కానుందని అన్నారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా రుతుప్రేమ కార్యక్రమానికి సిద్దిపేటలో శ్రీకారం చుట్టామన్నారు. అంతకుముందు మంత్రి రంగధాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద, డిగ్రీ కళాశాల సమీపంలోని ఆచార్య జయశంకర్ విగ్రహానికి నివాళి అర్పించారు.
తెలుగులో ట్వీట్లు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగులో ట్వీట్లు చేశారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.
ఈనాడు, హైదరాబాద్
సుందర రాష్ట్రం.. ఆవిష్కరణల కేంద్రం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. పచ్చని పంటలు, అడవులు, వన్యప్రాణులతో సుభిక్షంగా ఉన్న తెలంగాణ సమున్నత సాంస్కృతిక వారసత్వం, ప్రతిభావంతులతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ సుందరమైన రాష్ట్రం ఆవిష్కరణలకు కేంద్రంగా ఉద్భవిస్తోంది. అభివృద్ధి, సమృద్ధి నిరంతరం సాగాలని కాంక్షిస్తున్నా.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
సంస్కృతీ వైభవం తెలంగాణ సొంతం
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అద్భుతమైన ఈ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. ఇక్కడి ప్రజల నైపుణ్యాలు, సంస్కృతీ వైభవం ఎంతో గుర్తింపు పొందాయి. తెలంగాణ శ్రేయస్సు, సౌభాగ్యం కోసం ప్రార్థిస్తున్నా.
ప్రధాని నరేంద్ర మోదీ
రాష్ట్రం సుభిక్షంగా సాగాలి
చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు. ఇక్కడి ప్రజలు గొప్ప చరిత్ర, సంస్కృతికి ప్రసిద్ధి చెందారు. ఈ పవిత్రమైన రోజు రాష్ట్రం మరింత సుభిక్షంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా.
హోంమంత్రి అమిత్షా
అపురూప హస్తకళలకు పేరు
అద్భుతమైన సాంస్కృతిక వారసత్వం, అపురూపమైన హస్తకళా సంప్రదాయాలను తెలంగాణ ప్రజలు తరతరాలుగా కొనసాగిస్తూ వస్తున్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నా.
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా
కలలు నెరవేర్చినందుకు గర్విస్తున్నాం
ఇక్కడి ప్రజల ఆకాంక్షలు, కలల నుంచే దేశంలో అతిపిన్న వయసు రాష్ట్రంగా తెలంగాణ పుట్టుకొచ్చింది. వాటిని నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ పనిచేసినందుకు మేమెంతో గర్విస్తున్నాం.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
అద్భుత తెలంగాణ నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం
భారత్లో అతి పిన్న వయసు రాష్ట్రమైన తెలంగాణ అక్కడి ప్రజల దృఢ స్ఫూర్తికి నిదర్శనం. రైతులు, యువత, మహిళలకు సమృద్ధిని సాధించిపెట్టే ఆదర్శవంతమైన, అద్భుత రాష్ట్ర నిర్మాణానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని అభిలషిస్తున్నా. రాష్ట్రం ప్రగతిపథంలో పయనించాలని ఆశిస్తున్నా.
తెదేపా అధినేత చంద్రబాబు
ఎందరో యోధుల త్యాగఫలం..
ఎందరో పోరాటయోధుల ప్రాణత్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు. పేదరికం లేని రాష్ట్రం ఆవిష్కృతం కావాలని ఆకాంక్షిస్తున్నా.
జనసేన అధినేత పవన్కల్యాణ్
సామాజిక తెలంగాణే లక్ష్యం: ఆర్ఎస్ ప్రవీణ్
సామాజిక తెలంగాణ సాధించేందుకు ప్రజలు మరో పోరాటానికి సిద్ధమవ్వాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ పిలుపునిచ్చారు. బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన జాతీయజెండా ఎగురవేశారు. గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళి అర్పించి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.
సబ్బండ వర్గాల పోరాటంతోనే: కోదండరాం
సబ్బండ వర్గాల పోరాటంతోనే ప్రత్యేక రాష్ట్రం సాకారమైందని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ ఉత్సవాలను నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. కేసీఆర్ ఉద్యమ విలువలు, ఆకాంక్షలను మరిచిపోయారని కోదండరాం విరుచుకుపడ్డారు.
రాష్ట్ర ఏర్పాటులో తెదేపా లేఖ కీలకం: కాసాని
ప్రత్యేక తెలంగాణ సిద్ధించినా యువత, విద్యార్థులు ఆశించిన విధంగా అభివృద్ధి జరగడం లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ఎన్టీఆర్ భవన్లో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణకు అనుకూలంగా తెదేపా నిర్ణయం తీసుకుని లేఖ ఇవ్వడం.. రాష్ట్ర ఆవిర్భావంలో కీలకమని కాసాని అన్నారు.
ఆకాంక్షలు నెరవేరాలంటే మళ్లీ ఉద్యమం : షర్మిల
తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలంటే మళ్లీ మరో ఉద్యమం జరగాలని, సర్కారు మారితేనే బతుకులు మారతాయని వైతెపా అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల అన్నారు. లోటస్పాండ్లోని వైతెపా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీధి ఒక్కటే.. తండ్రిది ఏపీ.. కుమారుడిది తెలంగాణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. -
50 శాతంపైగా పెరిగిన కరెంటు వినియోగం
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో హైదరాబాద్తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్, వినియోగం అనూహ్యంగా పెరుగుతున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. -
పోల్ 2023.. కేఎంఆర్..!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు క్రమంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. భారాస ప్రత్యర్థుల్ని నియంత్రించాలనే ప్రధాన ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ నిందితులు ప్రత్యేక వాట్సప్ గ్రూప్లను ఏర్పాటు చేసినట్లు తాజా దర్యాప్తులో తేలింది. -
రోహిత్ కేసు పునర్విచారణ ప్రారంభం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఎనిమిదేళ్లకు కేసు పునర్విచారణ జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. -
వడదెబ్బకు 19 మంది మృత్యువాత
రాష్ట్రంలో వారం రోజులుగా హడలెత్తిస్తున్న ఎండలకు తాళలేక రైతులు, దినసరి కూలీలు, వృద్ధులు అసువులు బాస్తున్నారు. శనివారం పలు జిల్లాల్లో ఏకంగా 19 మంది మృతిచెందారు. -
మధుమేహంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి
భారత్లో మధుమేహం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. -
బతికుండగానే పూడ్చిపెట్టారు..
ముక్కుపచ్చలారని పసిగుడ్డు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు.. ప్రాణాలతో గుంతలో వేసి మట్టితో పూడ్చేశారు. -
నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు ఎఫ్ఆర్సీఎస్ గౌరవం
కష్టతరమైన శస్త్రచికిత్సల విజయవంతం, పేద రోగులకు సేవలు అందించినందుకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ నగరి బీరప్పకు అరుదైన గౌరవం దక్కింది. -
మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్కు మాతృవియోగం
మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాం నాయక్ మాతృ వియోగం పొందారు. -
‘ఆపరేషన్ కగార్’తో అమాయకుల ప్రాణాలు బలి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ను చేపట్టి.. అమాయక ఆదివాసీ ప్రజల ప్రాణాలు తీస్తోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. -
అంధులకు వీఐపీ దర్శనం
యాదాద్రి ప్రధాన ఆలయంలో శనివారం ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముగ్గురు అంధులు స్వామివారిని దర్శించుకునేందుకు రాగా.. అక్కడే విధుల్లో ఉన్న ఆలయ ఈవో భాస్కర్రావు కంటపడ్డారు. -
శిక్షలో పక్షపాతం తగదు
విద్యారుణాలకు సంబంధించి నకిలీ రుణ మంజూరు పత్రాల జారీ వ్యవహారంలో బాధ్యులైన అధికారులకు శిక్ష విధించడంలో పక్షపాతం చూపడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. -
ఎకరాకు 12 క్వింటాళ్ల జొన్నలు ప్రభుత్వమే కొంటుంది
రాష్ట్ర ప్రభుత్వం జొన్నల కొనుగోలులో నిబంధనలను సడలించి రైతులకు మరింత వెసులుబాటు కల్పించింది. ఎకరాకు 8.85 క్వింటాళ్లను మాత్రమే మద్దతు ధరకు కొనాలన్న గరిష్ఠ పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. -
టీఎస్సెట్ నోటిఫికేషన్ విడుదల
అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ నియామకాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష ‘తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2024’ నోటిఫికేషన్ విడుదలైంది. -
7న మేడిగడ్డకు జ్యుడిషియల్ విచారణ కమిటీ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 7న విశ్రాంత జడ్జి పినాకి చంద్రఘోష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. -
అవినీతి చెక్పోస్టులకు అడ్డుకట్ట!
రాష్ట్రంలో రవాణాశాఖ చెక్పోస్టులను శాశ్వతంగా రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటిపై ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. -
నేడు నీట్-యూజీ ప్రవేశపరీక్ష
నీట్-యూజీ (ఎంబీబీఎస్) ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్
-
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు