Yadadri EO: యాదాద్రి ఆలయ ఈవో గీత రాజీనామా

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో ఎన్‌.గీత గురువారం రాజీనామా చేశారు.

Updated : 22 Dec 2023 08:03 IST

ఇన్‌ఛార్జి ఈవోగా రామకృష్ణారావు

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో ఎన్‌.గీత గురువారం రాజీనామా చేశారు. ఆమె స్థానంలో దేవాదాయశాఖకు చెందిన రీజినల్‌ జాయింట్‌ కమిషనర్‌ రామకృష్ణారావును నియమిస్తూ ఆ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక 2014 డిసెంబరు 4న ఈ ఆలయ ఈవోగా గీత బాధ్యతలు చేపట్టారు. 2020 ఫిబ్రవరి 28న పదవీ విరమణ పొందినా ప్రభుత్వం ఆమెనే ఈవోగా కొనసాగించింది. ఆమె రాజీనామాతో.. కొత్తగా నియమితులైన రామకృష్ణారావు ఇన్‌ఛార్జి ఈవోగా బాధ్యతలు స్వీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని