Midday Meal: బడిలో బువ్వ కరవు
సర్కారు బడుల్లో ఉచితవిద్యతో పాటు మధ్యాహ్న భోజనం పథకం కింద పట్టెడు మెతుకులు తినొచ్చని ఆశపడే పేద పిల్లలకు ఆకలి కష్టాలు చుట్టుముట్టాయి. అప్పులు చేసి అన్నం పెడుతున్న తమను విద్యాశాఖ తిప్పలు
వంట కార్మికుల సమ్మె
బిల్లులు ఇవ్వడం లేదని ఆవేదన
పలు జిల్లాల్లో మధ్యాహ్న భోజనం బంద్
విద్యార్థులకు అవస్థలు
పెమ్మసాని బాపనయ్య, ఈనాడు - హైదరాబాద్
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి ప్రాథమిక పాఠశాలలో ఇళ్ల నుంచి తెచ్చుకున్న అన్నం తింటున్న విద్యార్థులు
సర్కారు బడుల్లో ఉచితవిద్యతో పాటు మధ్యాహ్న భోజనం పథకం కింద పట్టెడు మెతుకులు తినొచ్చని ఆశపడే పేద పిల్లలకు ఆకలి కష్టాలు చుట్టుముట్టాయి. అప్పులు చేసి అన్నం పెడుతున్న తమను విద్యాశాఖ తిప్పలు పెడుతోందంటూ మహిళా కార్మికులు సమ్మె బాట పట్టడంతో మధ్యాహ్న భోజనం ఆగిపోయి లక్షల మంది పేద విద్యార్థులు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. ఇప్పటికే కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లోని వందలాది పాఠశాలల్లో వంట ఆగిపోయింది. తామూ మానుకుంటున్నామని సిద్దిపేట జిల్లా కార్మికులూ నోటీసులు ఇచ్చారు. దీనిపై ‘ఈనాడు’ కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాల్లోని పలు పాఠశాలలను పరిశీలించింది. బడిలో భోజనం ఆగిపోవడంతో పిల్లలు అవస్థలు పడుతున్నారు.
కార్మికులకు నష్టం.. పిల్లలకు కష్టం
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి ఉన్నత పాఠశాలలో గుడ్డుకు బదులు అరటిపండ్లు ఇస్తున్న వంట కార్మికులు
రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు అన్నం బాక్సులను ఇళ్ల నుంచే తెచ్చుకుంటున్నారు. బడికి దగ్గరగా ఉన్న పిల్లలు ఇళ్లకు వెళ్లి తిని వస్తున్నారు.ఏదీ వీలుకాని పరిస్థితుల్లో కొందరు ఆకలితో నకనకలాడుతున్నారు. సర్కారు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండి పెట్టడం తమ వల్ల కాదని వంట ఏజెన్సీ బాధ్యతల నుంచి మహిళలు తప్పుకొంటున్నారు. సర్కారు బడుల్లో దాదాపు 52 వేల మంది వంట కార్మికులు పనిచేస్తున్నారు. వారికి ప్రభుత్వం నెలకు రూ.వెయ్యి గౌరవ వేతనం ఇస్తోంది. పదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెరగలేదు. ఎన్నేళ్లు ఎదురుచూసినా ప్రయోజనం లేకపోవడంతో పదిరోజులుగా సమ్మెకు దిగారు. 1-5 తరగతుల విద్యార్థులకు రోజుకు రూ.4.97లు, 6-10 తరగతుల విద్యార్థులకు రూ.7.45లను ప్రభుత్వం ఇస్తోంది. కూరగాయలు, నూనె ధరలు మండిపోతున్న నేపథ్యంలో ఆ ధరలకు భోజనం వండి పెట్టడం వల్ల నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోందని కార్మికులు వాపోతున్నారు. గత సెప్టెంబరు నుంచి బిల్లులు చెల్లించలేదని, ఒక్కో ఏజెన్సీకి రూ.లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని వారు చెబుతున్నారు. వారానికి మూడు రోజుల చొప్పున కోడిగుడ్లు అందించాలి. ఒక్కో కోడి గుడ్డుకు ప్రభుత్వం రూ.4ల చొప్పున చెల్లిస్తోంది. మార్కెట్లో మాత్రం రూ.5 నుంచి రూ.6ల చొప్పున కొనాల్సి వస్తోంది. దాంతో వారంలో ఒక రోజు గుడ్డు బదులు అరటిపండ్లు ఇస్తున్నారు.
ఇళ్లకు వెళ్లి అన్నం తినివస్తున్న పూసాల ప్రాథమిక పాఠశాలల పిల్లలు. ముగ్గురు మనవరాళ్లను తోడ్కొని వస్తున్న మహాలక్ష్మి (వెనక)
ఇదీ పరిస్థితి..
* మధ్యాహ్న భోజన పథకం ఆగిపోవడంతో పెద్దపల్లి జిల్లా దుబ్బపల్లి, పూసాల ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలు ఇళ్ల నుంచి అన్నం బాక్సులు తెచ్చుకొని తింటున్నారు. పెద్ద పిల్లలు ఇళ్లకు వెళ్లి తినివస్తున్నారు. ఇళ్లకు వెళ్లినప్పుడు ప్రమాదాలబారిన పడే అవకాశం ఉందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తంచేశారు.
* కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలల్లో 30 శాతం మంది పిల్లలు ఇళ్లకు వెళ్లి తిని వస్తున్నారు. మిగిలిన వారు ఇళ్ల నుంచి తెచ్చుకుంటున్నారు. ఇక్కడ అత్యంత పేదలైన కొందరు విద్యార్థులు పక్కనే ఉన్న ప్రభుత్వ హాస్టల్లో తింటుండటం గమనార్హం.
* సిద్దిపేట జిల్లాలో కూడా తమ డిమాండ్లు నెరవేర్చకుంటే వంటను నిలిపివేస్తామని మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం జిల్లా కమిటీ కలెక్టర్కు నోటీసు అందజేసింది. ఈ క్రమంలో బెజ్జంకి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో సోమవారం నుంచి ఇళ్ల నుంచి భోజనం తెచ్చుకోవాలని విద్యార్థులందరికీ సమాచారం ఇచ్చినట్లు ప్రధానోపాధ్యాయుడు తెలిపారు.
* నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి ఉన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం ప్రత్యక్ష తరగతులు మొదలైన సెప్టెంబరు నుంచి ఒక్కసారి కూడా కోడిగుడ్డు పెట్టలేదు. ఈ పాఠశాలలో 1420 మంది పిల్లలున్నారు. వారికి గుడ్లు ఇవ్వాలంటే ఒక రోజు 8,520 రూపాయాలు అవసరం. అంటే వారానికి మూడు సార్లు చొప్పున రూ.25 వేలకుపైగా అవసరం. సర్కారు మాత్రం ఒక్కో గుడ్డుకు నాలుగు రూపాయలే ఇస్తోంది. దీనిబట్టి వారానికి రూ.4,260 నష్టం వస్తోంది. దాంతో ఇక్కడ గుడ్డును అందించడం లేదు.
* మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల ఉన్నత పాఠశాలలో గుడ్డుకు బదులు అరటిపండ్లు అందించారు. వారానికి మూడు రోజులు గుడ్ల బదులు రెండు రోజులు ఇస్తున్నారు. ఒక రోజు అరటిపండు సరఫరా చేస్తున్నారు.
ఇంటి వద్ద గుడ్లు ఉండవు కదా?
-ప్రజ్వల్, 9వ తరగతి విద్యార్థి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కరీంనగర్
మా నాన్న సుతారి పనికి, అమ్మ పత్తి ఏరడానికి వెళ్తుంది. బడికి వచ్చే సమయానికి బాక్సు పెట్టడం మా ఇంట్లో వీలుకాదు. దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలోని ఇంటికి వెళ్లి తినివస్తున్నా. ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. అయినా ఇంట్లో గుడ్లు ఉండవు. బడిలో మూడు సార్లు తినేవాడిని.
కనీస వేతనం రూ.21 వేలు చెల్లించాలి
- రమ, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (ఏఐటీయూసీ) నేత
గత 19 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు పదేళ్లుగా రూ.వెయ్యి మాత్రమే చెల్లిస్తున్నారు. కనీస వేతనాన్ని నెలకు రూ.21 వేలు చెల్లించాలి. ప్రతి విద్యార్థికి రూ.15 చొప్పున బడ్జెట్ కేటాయించాలి. డిమాండ్లను నెరవేర్చాలని ఈనెల 20, 21న మండల కేంద్రాల్లో ధర్నాలు, జనవరి 10, 11 తేదీల్లో హైదరాబాద్లో రెండు రోజులపాటు ధర్నా చేయాలని నిర్ణయించాం.
పేద విద్యార్థులే నష్టపోతున్నారు
- కటకం రమేష్, రాష్ట్ర అధ్యక్షుడు, టీఆర్టీఎఫ్
మా పిల్లలు తినే బియ్యాన్ని ప్రభుత్వ బడుల్లో పేదలకు ఇస్తున్నామని సర్కారు చెప్పుకుంటోంది. ఇప్పుడు పలు జిల్లాల్లో మధ్యాహ్న భోజన పథకం ఆగిపోయింది. వంట కార్మికులవి న్యాయమైన డిమాండ్లే. వాటిని వెంటనే తీర్చాలి. లేకుంటే నష్టపోయేది పేద విద్యార్థులే. అన్నం కోసం సర్కారు బడుల్లో చేరే విద్యార్థులూ వేల మంది ఉన్నారు.
ఇవీ గణాంకాలు..
* మొత్తం ప్రభుత్వ పాఠశాలలు: 26,500
* వాటిల్లో విద్యార్థుల సంఖ్య: 22.60 లక్షలు
* ప్రస్తుతం పథకం ఆగిపోయిన జిల్లాలు: కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల (కొన్ని చోట్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్