Nirmala Sitharaman: కిందపడినా పైచేయి మనదే
మహమ్మారి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ మిగతా ప్రపంచ దేశాల కంటే కిందికి పడిపోయినప్పటికీ అంతే వేగంగా పైకి వస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న అమెరికా, ఐరోపా దేశాల కంటే మన
అగ్రదేశాల కంటే వేగంగా ఎదుగుతున్నాం
కేంద్ర బడ్జెట్పై చర్చలో నిర్మలా సీతారామన్
ఈనాడు, దిల్లీ: మహమ్మారి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ మిగతా ప్రపంచ దేశాల కంటే కిందికి పడిపోయినప్పటికీ అంతే వేగంగా పైకి వస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న అమెరికా, ఐరోపా దేశాల కంటే మన ఆర్థిక వృద్ధి వేగంగా సాగుతున్నట్లు వెల్లడించారు. 2022-23 బడ్జెట్పై లోక్సభలో జరిగిన చర్చకు ఆమె గురువారం రాత్రి సుమారు రెండు గంటల పాటు సమాధానం ఇచ్చారు. ‘‘స్వాతంత్య్రానంతరం దేశంలో నాలుగుసార్లు జీడీపీ వృద్ధిరేటు మందగించింది. 1973-74లో ప్రపంచ చమురు సంక్షోభంతో, 1979-80లో ఇరాన్-ఇరాక్ యుద్ధం వల్ల, 2008-09లో ప్రపంచ ఆర్థిక మందగమనం వల్ల జీడీపీ వృద్ధిరేటు తగ్గింది. అంతేగానీ ఎన్నడూ నెగెటివ్లోకి వెళ్లలేదు. కొవిడ్ సంక్షోభం కారణంగా 2020-21లో జీడీపీ వృద్ధిరేటు మైనస్ 6.6% మేర పడిపోయింది. ప్రపంచమంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. 2008-09లో ఆర్థిక మందగమనం వల్ల జీడీపీ తగ్గుదలతో రూ.2.12 లక్షల కోట్లు కోల్పోతే.. 2020-21లో రూ.9.7 లక్షల కోట్ల విలువైన జీడీపీని కోల్పోవాల్సి వచ్చింది. వినియోగదారుల ధరల సూచీ మాత్రం 6.2%కే పరిమితమయ్యేలా చూశాం. అత్యధిక ఆర్థిక పతనంలోనూ ధరల భారం సామాన్యుడిపై పడకుండా కాపాడాం. మా ఆర్థిక నిర్వహణను అందరూ సానుకూల కోణంలో చూడాలి. 2008-09లో విదేశీ మారకద్రవ్య నిల్వలు 252 బిలియన్ డాలర్లు ఉంటే ఇప్పుడు 579 బిలియన్ డాలర్లకు చేరాయి. ఎఫ్డీఐలు పదింతలు పెరిగాయి.
అత్యంత వేగవంతమైన వృద్ధి రేటు
2021, 2022, 2023ల్లో అమెరికా వరుసగా 5.6%, 4%, 2.6%; భారత్ వరుసగా 9%, 9%, 7.1% వృద్ధి రేటు నమోదు చేస్తాయని అంచనావేస్తున్నాం. మన వృద్ధిరేటు ప్రపంచంలో అత్యంత వేగవంతమైనది అవుతుంది. పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో పతనం మన దగ్గర ఎక్కువ నమోదైనప్పటికీ అందరికంటే వేగంగా పుంజుకుంటున్నాం. ప్రజలు కట్టిన పన్నులను మూలధన వ్యయంగా ఖర్చు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. 2020-21 అంచనాల ప్రకారం 7.3% ఉన్న రెవిన్యూ లోటును 2021-22 సవరించిన అంచనాల నాటికి 4.7%కి తగ్గించాం. ఆహార రాయితీ కింద 2021-22 సవరించిన అంచనాల ప్రకారం రూ.2.86 లక్షల కోట్లు కేటాయించాం. 21-22లో ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు పెరగడంతో రాయితీల భారం పెరిగింది. రాయితీకి కేటాయించిన రూ.79,530 కోట్లకు బదులు రూ.1.40 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ భారాన్ని ప్రభుత్వమే భరించింది. ఈసారి అంత ఖర్చు అవసరం ఉండదు. విద్య, వైద్యం, సంక్షేమ కార్యక్రమాలకు కేటాయింపులు పెంచాం. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి డిమాండ్కు తగ్గట్టు కేటాయింపులు పెంచడానికి సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో తగ్గించబోం’’ అని నిర్మల స్పష్టంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదే
‘మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో పునరుద్ధరణ పనులను నిర్మాణ సంస్థే చేయాల్సి ఉండగా ఎందుకు చేయడం లేదు? పని పూర్తి కాకుండానే సర్టిఫికెట్ ఇచ్చిన ఇంజినీర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. -
ప్రభుత్వ రంగంలో తొలి మెగాఫుడ్ పార్క్
దాదాపు 200 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు.. అత్యుత్తమ ఆహారశుద్ధి వనరులు.. రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారుల కార్యకలాపాలకు వేదిక... 25 వేల మందికి ఉపాధి అవకాశాలు.. రాయితీలు, ప్రోత్సాహకాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో రాష్ట్రంలోనే అతి పెద్దదైన మెగా ఫుడ్పార్క్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ప్రారంభానికి సిద్ధమైంది. -
మంత్రి మండలి సమావేశం వాయిదా
తెలంగాణ సచివాలయంలో శనివారం జరగాల్సిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు సమావేశంలో పాల్గొనేందుకు సచివాలయానికి వచ్చి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎదురు చూసినా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నుంచి అనుమతి రాలేదు. -
ముందస్తు వానాకాలం
రాష్ట్రంలో జూన్ 5వ తేదీ తరువాత తెరిపినిచ్చే వేసవి ఎండలు ఈ ఏడాది ముందస్తు వానలతో మే నెలలోనే చల్లబడ్డాయి. శనివారం సాయంత్రం కూడా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఆకస్మిక వర్షాలు కురిశాయి. -
ఎప్సెట్ ఇంజినీరింగ్లో 74.98% ఉత్తీర్ణత
టీఎస్ ఎప్సెట్-2024 ఇంజినీరింగ్ విభాగంలో 74.98 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 89.66 శాతం మంది అర్హత సాధించారు. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
బొగ్గు తరలింపుపై ప్రతిష్టంభన
సింగరేణి గనుల నుంచి బొగ్గు రవాణా విషయంలో కొంత ప్రతిష్టంభన నెలకొంది. వర్షాకాలం వస్తున్నందున బొగ్గు ఉత్పత్తి తగ్గుతుంది. -
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
విద్యుత్ అంతరాయాల నివారణకు ప్రత్యేక చర్యలు
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) పరిధిలో కరెంటు సరఫరాలో అంతరాయాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డిస్కం పరిధిలో ఉన్న 16 సర్కిళ్లకు 16 మంది నోడల్ అధికారులను నియమించారు. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
రేపు ఈసెట్ ఫలితాలు
పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ , బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ ఫలితాలను ఈ నెల 20న విడుదల చేయనున్నారు. -
4 నెలల్లో 1,300 ఫోన్ల ట్యాపింగ్!
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్తున్నకొద్దీ విస్మయకర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దందా సుదీర్ఘకాలంగా సాగినా ఇటీవలి శాసనసభ ఎన్నికల సమయంలో తార స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. -
ఆర్ఆర్ఆర్ అటవీ భూసేకరణ మళ్లీ మొదటికి..!
హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డు ఆవల నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు కోసం అటవీ భూసేకరణ కథ మళ్లీ మొదటికి వచ్చింది. సకాలంలో వివరాలు ఇవ్వకపోవటంతో మునుపటి ప్రతిపాదనల దరఖాస్తు రద్దు అయినట్లు సమాచారం. -
మాదంటే మాదే!
భూవివాదంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తతకు దారితీసింది. -
సింహాచలంలో విద్యుత్ బస్సు
తెలుగు రాష్ట్రాల దేవాలయాల్లో తొలిసారిగా సింహాచలం దేవస్థానం.. విద్యుత్ బస్సును ప్రవేశపెట్టింది. రూ. 1.65 కోట్లతో సమకూర్చిన ఈ బస్సును ఆ దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ప్రారంభించారు. -
జూన్ 1 నుంచి యాదాద్రిలో సంప్రదాయ దుస్తులతో ఆర్జిత పూజలు
యాదాద్రిలో పంచనారసింహుల దైవారాధనల్లో (ఆర్జిత పూజలు) పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని, ఈ ఆచారాన్ని జూన్ 1 నుంచి ఆచరణలోకి తెస్తున్నట్లు ఆలయ ఈవో ఎ.భాస్కర్రావు వెల్లడించారు. -
వైభవంగా శ్రీపద్మావతి పరిణయోత్సవాలు
తిరుమలలో శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు రెండో రోజు శనివారం కనులపండువగా నిర్వహించారు. సాయంత్రం శ్రీమలయప్పస్వామి అశ్వవాహనాన్ని అధిరోహించి సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరారు. -
ఆరోగ్య సంరక్షణకు రూ.1,411 కోట్లు
ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ.1,411 కోట్లను వ్యయం చేయనున్నారు. -
పార్వతి బ్యారేజీ ఖాళీ
కాళేశ్వరం పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి(సుందిళ్ల) బ్యారేజీ నుంచి నీటిని దిగువన గోదావరిలోకి వదలడంతో జలాశయం వెలవెలబోతోంది. -
ఎవరెస్ట్ బేస్క్యాంప్పై తెలంగాణ యువకుడు
దేశంలో అన్ని కులాలు, మతాలు సమానమనే సందేశాన్ని చాటుతూ..ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించారు హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటి రాజిపేటలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన ఏకు చిరంజీవి.