PM Modi: అవమానకరంగా ఆంధ్రా విభజన
కేంద్రంలో అధికారంలో కూర్చోవడానికి ప్రధాన కారణమైన ఆంధ్రప్రదేశ్ను కాంగ్రెస్ పార్టీ అవమానకర రీతిలో విభజించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ధ్వజమెత్తారు. అహంకారంతో కూడిన అధికార మత్తులో చేసిన రాష్ట్రవిభజన ఇప్పటికీ రెండు రాష్ట్రాలకు నష్టం చేకూరుస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు బదులిస్తూ మంగళవారం ఉదయం రాజ్యసభలో ఆయన గంటన్నరపాటు ప్రసంగించారు. ఇందులో ప్రధాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పలుసార్లు గుర్తు చేసుకున్నారు. అంజయ్యకు జరిగిన అవమానం, ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి జరిగిన ప్రయత్నం,....
పెప్పర్ స్ప్రేకొట్టి, మైకులు ఆపి చర్చలు లేకుండా చేశారు
అప్పటి స్పర్థలు ఇప్పటికీ ఏపీ, తెలంగాణలకు నష్టం చేస్తున్నాయి
అంజయ్యను అవమానించారు.. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోశారు
రాజ్యసభలో కాంగ్రెస్పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ
ఈనాడు, దిల్లీ: కేంద్రంలో అధికారంలో కూర్చోవడానికి ప్రధాన కారణమైన ఆంధ్రప్రదేశ్ను కాంగ్రెస్ పార్టీ అవమానకర రీతిలో విభజించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ధ్వజమెత్తారు. అహంకారంతో కూడిన అధికార మత్తులో చేసిన రాష్ట్రవిభజన ఇప్పటికీ రెండు రాష్ట్రాలకు నష్టం చేకూరుస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు బదులిస్తూ మంగళవారం ఉదయం రాజ్యసభలో ఆయన గంటన్నరపాటు ప్రసంగించారు. ఇందులో ప్రధాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పలుసార్లు గుర్తు చేసుకున్నారు. అంజయ్యకు జరిగిన అవమానం, ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి జరిగిన ప్రయత్నం, రాష్ట్ర విభజన సమయంలో జరిగిన పరిణామాలను గుర్తు చేస్తూ వీటన్నింటికీ కాంగ్రెసే కారణమని నిప్పులు చెరిగారు. ‘‘కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించింది. ఇక్కడ అధికారంలో కూర్చోబెట్టిన ఆంధ్రప్రదేశ్ను అవమానకరంగా విభజించారు. మైకులు బంద్ చేసి, పెప్పర్ స్ప్రే చేసి ఎలాంటి చర్చ లేకుండా రాష్ట్ర విభజన చేశారు. ఇది మంచి పద్ధతా? ఇదేనా ప్రజాస్వామ్యం. వాజపేయీ హయాంలోనూ మూడు రాష్ట్రాలను విభజించి ఛత్తీస్గడ్, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. వాజపేయీ రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు ఎలాంటి తుపానూ రాలేదు. అందరూ కూర్చొని శాంతియుతంగా నిర్ణయం తీసుకున్నారు. ఏపీ, తెలంగాణ విషయంలోనూ అలా జరిగి ఉండొచ్చు. మేం తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు. కలిసి కూర్చొని నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు. కానీ మీ అహంకారం, అధికార మత్తు దేశంలో స్పర్థలను సృష్టించింది. ఆ స్పర్థ ఇప్పటికీ ఏపీ, తెలంగాణలకు నష్టం చేస్తోంది. మీక్కూడా ఎలాంటి రాజకీయ ప్రయోజనం దక్కడం లేదు...’’ అని ప్రధాని మోదీ దుయ్యబట్టారు.
అంజయ్యకు చేసిన అవమానాన్ని మరిచిపోయారా?
ఇదివరకు రాజీవ్గాంధీ చేతుల్లో ముఖ్యమంత్రి అంజయ్యకు అవమానం జరిగినట్లు ప్రచారంలో ఉన్న సంఘటననూ ప్రధాని మోదీ గుర్తు చేశారు. ‘‘సమాఖ్య వ్యవస్థ గురించి పెద్దపెద్ద ప్రసంగాలు చేసేవారు ఎయిర్పోర్టులో చిన్న విషయం కోసం ముఖ్యమంత్రిని తొలగించడాన్ని మరిచిపోయినట్టున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టి.అంజయ్య విషయంలో ఏ జరిగిందో ఈ సభలోని వారందరికీ బాగా తెలుసు. ప్రధానమంత్రి కుమారుడికి ఎయిర్పోర్టులో చెప్పిన స్వాగతం నచ్చకపోవడంతో ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించారు. తద్వారా కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను దెబ్బతీశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరేంద్రపాటిల్ను అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు అవమానకరరీతిలో పదవీచ్యుతుడ్ని చేశారు...’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
్య ప్రస్తుతం ఏపీ, తెలంగాణల నుంచి పసుపు ఎగుమతులు పెరగడం తమ ప్రభుత్వ కృషి ఫలితమేనన్నారు. కరోనా సమయంలో ఆయుష్ మంత్రిత్వశాఖ ద్వారా భారతీయ వైద్య పద్ధతులకు ప్రచారం కల్పించడంతో ప్రజల్లో దానిపట్ల ఆసక్తి పెరిగి పసుపు వాడకం పెరిగిందని, దాని వల్ల పసుపు ఎగుమతులు వృద్ధి చెందాయని చెప్పారు.
ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచింది ఎవరు?
ఎన్టీఆర్ తొలిసారి అధికారంలోకి వచ్చిన కొన్నిరోజులకే ఆయన ప్రభుత్వాన్ని కూలదోసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అంశాన్నీ ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘‘మొదట అవిశ్వాసం కల్పించడం, తర్వాత అస్థిరపరచడం, తర్వాత డిస్మిస్ చేయడం అన్న మూడు సూత్రాల ఆధారంగా కాంగ్రెస్ హైకమాండ్ వ్యవహరించింది. ఫరూక్ అబ్దుల్లా, చౌదరీ దేవీలాల్, చరణ్సింగ్, సర్దార్ బాదల్ ప్రభుత్వాలను ఎవరు అస్థిర పరిచారు? మహారాష్ట్రలో బాల్ఠాక్రేని అవమానించడానికి ఎవరు కుటిల ప్రయత్నాలు చేశారు? కర్ణాటకలో రామకృష్ణహెగ్డే, ఎస్ఆర్ బొమ్మై ప్రభుత్వాలను ఎవరు కూలదోశారు? 50వ దశకంలో కేరళలో ఎన్నికైన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఎవరు పడగొట్టారు? తమిళనాడులో ఎమర్జెన్సీ సమయంలో కరుణానిధి ప్రభుత్వం, 1980లో ఎంజీఆర్ ప్రభుత్వాలను ఎవరు పతనం చేశారు? ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఎవరు ప్రయత్నించారు? కేంద్ర ప్రభుత్వం మాట వినడం లేదని ములాయంసింగ్ను ఇబ్బంది పెట్టింది ఎవరు?’’ అని ప్రధాని మోదీ ప్రశ్నిస్తూ కాంగ్రెస్ వైపు వేలెత్తి చూపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీధి ఒక్కటే.. తండ్రిది ఏపీ.. కుమారుడిది తెలంగాణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. -
50 శాతంపైగా పెరిగిన కరెంటు వినియోగం
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో హైదరాబాద్తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్, వినియోగం అనూహ్యంగా పెరుగుతున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. -
పోల్ 2023.. కేఎంఆర్..!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు క్రమంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. భారాస ప్రత్యర్థుల్ని నియంత్రించాలనే ప్రధాన ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ నిందితులు ప్రత్యేక వాట్సప్ గ్రూప్లను ఏర్పాటు చేసినట్లు తాజా దర్యాప్తులో తేలింది. -
రోహిత్ కేసు పునర్విచారణ ప్రారంభం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఎనిమిదేళ్లకు కేసు పునర్విచారణ జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. -
వడదెబ్బకు 19 మంది మృత్యువాత
రాష్ట్రంలో వారం రోజులుగా హడలెత్తిస్తున్న ఎండలకు తాళలేక రైతులు, దినసరి కూలీలు, వృద్ధులు అసువులు బాస్తున్నారు. శనివారం పలు జిల్లాల్లో ఏకంగా 19 మంది మృతిచెందారు. -
మధుమేహంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి
భారత్లో మధుమేహం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. -
బతికుండగానే పూడ్చిపెట్టారు..
ముక్కుపచ్చలారని పసిగుడ్డు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు.. ప్రాణాలతో గుంతలో వేసి మట్టితో పూడ్చేశారు. -
నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు ఎఫ్ఆర్సీఎస్ గౌరవం
కష్టతరమైన శస్త్రచికిత్సల విజయవంతం, పేద రోగులకు సేవలు అందించినందుకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ నగరి బీరప్పకు అరుదైన గౌరవం దక్కింది. -
మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్కు మాతృవియోగం
మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాం నాయక్ మాతృ వియోగం పొందారు. -
‘ఆపరేషన్ కగార్’తో అమాయకుల ప్రాణాలు బలి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ను చేపట్టి.. అమాయక ఆదివాసీ ప్రజల ప్రాణాలు తీస్తోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. -
అంధులకు వీఐపీ దర్శనం
యాదాద్రి ప్రధాన ఆలయంలో శనివారం ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముగ్గురు అంధులు స్వామివారిని దర్శించుకునేందుకు రాగా.. అక్కడే విధుల్లో ఉన్న ఆలయ ఈవో భాస్కర్రావు కంటపడ్డారు. -
శిక్షలో పక్షపాతం తగదు
విద్యారుణాలకు సంబంధించి నకిలీ రుణ మంజూరు పత్రాల జారీ వ్యవహారంలో బాధ్యులైన అధికారులకు శిక్ష విధించడంలో పక్షపాతం చూపడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. -
ఎకరాకు 12 క్వింటాళ్ల జొన్నలు ప్రభుత్వమే కొంటుంది
రాష్ట్ర ప్రభుత్వం జొన్నల కొనుగోలులో నిబంధనలను సడలించి రైతులకు మరింత వెసులుబాటు కల్పించింది. ఎకరాకు 8.85 క్వింటాళ్లను మాత్రమే మద్దతు ధరకు కొనాలన్న గరిష్ఠ పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. -
టీఎస్సెట్ నోటిఫికేషన్ విడుదల
అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ నియామకాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష ‘తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2024’ నోటిఫికేషన్ విడుదలైంది. -
7న మేడిగడ్డకు జ్యుడిషియల్ విచారణ కమిటీ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 7న విశ్రాంత జడ్జి పినాకి చంద్రఘోష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. -
అవినీతి చెక్పోస్టులకు అడ్డుకట్ట!
రాష్ట్రంలో రవాణాశాఖ చెక్పోస్టులను శాశ్వతంగా రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటిపై ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. -
నేడు నీట్-యూజీ ప్రవేశపరీక్ష
నీట్-యూజీ (ఎంబీబీఎస్) ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్