Telangana News: విడివిడిగా ఉద్యోగ ప్రకటనలు!
రాష్ట్రంలో భారీగా చేపట్టిన ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఎలాంటి ఆటంకాలూ లేకుండా సజావుగా సాగేందుకు వీలుగా అన్నిరకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. 80,039 ఉద్యోగాలకు సంబంధించి వేర్వేరు నియామక సంస్థల
నియామకాలు ఆగకుండా సాగేలా చర్యలు
జారీకి ముందే విధిగా న్యాయసలహాలు
పక్కా కార్యాచరణకు ప్రభుత్వ సన్నాహాలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా చేపట్టిన ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఎలాంటి ఆటంకాలూ లేకుండా సజావుగా సాగేందుకు వీలుగా అన్నిరకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. 80,039 ఉద్యోగాలకు సంబంధించి వేర్వేరు నియామక సంస్థల ద్వారా వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. వీటితో పాటు పలు కీలక అంశాలపై సీఎస్ సోమేశ్కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశం చర్చించగా టీఎస్పీఎస్సీ అధికారులతో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు గురువారం భేటీ అయ్యారు. గతంలో నియామకాలకు సంబంధించి పలు కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్కు సంబంధించిన 23,000 పోస్టులు ఇలాంటి వివాదాల్లో ఉన్నందున వాటి నియామకాలు పూర్తికాలేదు. అందుకే కొత్తగా చేపడుతున్న ఉద్యోగాలకు న్యాయపరమైన ఆటంకాలు ఎదురవకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సమావేశంలో చర్చించి, పలు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వీలైనంత తక్కువ సంఖ్యలో పోస్టులకు విడివిడిగా నోటిఫికేషన్లు ఇవ్వాలనే ప్రతిపాదన ప్రధానమైంది. అలాగే నోటిఫికేషన్ల జారీకిముందు న్యాయసలహా తీసుకోవాలనే అంశంపైనా చర్చించారు. ఏకమొత్తంగా నోటిఫికేషన్ వెలువడితే దానిపై కోర్టులో కేసు పడితే ఆ ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయే వీలుంటుంది. అలాకాకుండా వివిధ కేటగిరి పోస్టులకు విడివిడిగా నోటిఫికేషన్ ఇస్తే.. కోర్టు కేసు పడి ఒకటీరెండు ఆగిపోయినా.. మిగిలిన వాటి ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అనుగుణంగా సీఎస్ అధ్యక్షతనగల రాష్ట్రస్థాయి నియామకాల కమిటీద్వారా కార్యాచరణను చేపట్టే వీలుంది.
జిల్లాలవారీగా నోటిఫికేషన్లు..
బుధవారం ప్రకటించిన ఉద్యోగాల్లో 27 శాఖలకు చెందినవి ఉన్నాయి. వీటిని జిల్లా, జోనల్, బహుళ జోనల్ పోస్టులుగా విభజించారు. ఇప్పటికే హోంశాఖకు ప్రత్యేకంగా పోలీసు నియామక మండలి ఉంది. దాని ద్వారా ఆ శాఖ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడుతుంది. ఉపాధ్యాయ పోస్టులకు విద్యాశాఖ డీఎస్సీ లేదా టీఆర్టీ ద్వారా నోటిఫికేషన్లు వెలువడతాయని తెలుస్తోంది. జిల్లా స్థాయి పోస్టులను ఏ జిల్లాకు ఆ జిల్లాలో భర్తీ చేయడానికి వీలుగా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఎంపిక కమిటీలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. నోటిఫికేషన్లు జిల్లాలవారీగా విడుదల చేస్తారు. వైద్యఆరోగ్య శాఖలకు ప్రత్యేక నియామక మండలి ఉంది. నీటిపారుదల శాఖ పోస్టులకు సైతం ప్రత్యేక నియామక మండలి ఏర్పాటు ఆలోచన ఉంది. సంక్షేమ శాఖలకు విడిగా, ఇంజినీరింగ్ సర్వీసు పోస్టులన్నింటి కోసం విడిగా ప్రత్యేక మండళ్లను ఏర్పాటు చేసి కేడర్వారీగా నియామకాలు జరపాలనే ప్రతిపాదనలను పరిశీలించనుంది.
టీఎస్పీఎస్సీ ద్వారా ఎలా..
రాష్ట్రంలోని ప్రధాన నియామక సంస్థ టీఎస్పీఎస్సీకి ఏయే బాధ్యతలు అప్పగించాలనే దానిపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు గురువారం టీఎస్పీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శిలతో సమావేశమయ్యారు. ఏయే నియామకాలు చేపట్టాలి, కమిషన్ సన్నద్ధత, కోర్టు కేసులు, వాటి పరిష్కారం, నోటిఫికేషన్లు ఎలా ఇవ్వాలి అనే అంశాలపై చర్చించారు. మొదటి నుంచి గ్రూపు-1, 2, 3, 4 నియామకాలు సర్వీసు కమిషన్ద్వారా జరుగుతున్నాయి. ఈసారి ఆ పోస్టులను పూర్తిగా ఇవ్వాలా, కొన్నింటిని జిల్లా ఎంపిక కమిటీలకు ఇవ్వాలా అనే దానిపైనా చర్చ జరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీధి ఒక్కటే.. తండ్రిది ఏపీ.. కుమారుడిది తెలంగాణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. -
బతికుండగానే పూడ్చిపెట్టారు..
ముక్కుపచ్చలారని పసిగుడ్డు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు.. ప్రాణాలతో గుంతలో వేసి మట్టితో పూడ్చేశారు. -
నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు ఎఫ్ఆర్సీఎస్ గౌరవం
కష్టతరమైన శస్త్రచికిత్సల విజయవంతం, పేద రోగులకు సేవలు అందించినందుకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ నగరి బీరప్పకు అరుదైన గౌరవం దక్కింది. -
మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్కు మాతృవియోగం
మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాం నాయక్ మాతృ వియోగం పొందారు. -
‘ఆపరేషన్ కగార్’తో అమాయకుల ప్రాణాలు బలి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ను చేపట్టి.. అమాయక ఆదివాసీ ప్రజల ప్రాణాలు తీస్తోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. -
అంధులకు వీఐపీ దర్శనం
యాదాద్రి ప్రధాన ఆలయంలో శనివారం ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముగ్గురు అంధులు స్వామివారిని దర్శించుకునేందుకు రాగా.. అక్కడే విధుల్లో ఉన్న ఆలయ ఈవో భాస్కర్రావు కంటపడ్డారు. -
శిక్షలో పక్షపాతం తగదు
విద్యారుణాలకు సంబంధించి నకిలీ రుణ మంజూరు పత్రాల జారీ వ్యవహారంలో బాధ్యులైన అధికారులకు శిక్ష విధించడంలో పక్షపాతం చూపడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. -
ఎకరాకు 12 క్వింటాళ్ల జొన్నలు ప్రభుత్వమే కొంటుంది
రాష్ట్ర ప్రభుత్వం జొన్నల కొనుగోలులో నిబంధనలను సడలించి రైతులకు మరింత వెసులుబాటు కల్పించింది. ఎకరాకు 8.85 క్వింటాళ్లను మాత్రమే మద్దతు ధరకు కొనాలన్న గరిష్ఠ పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. -
టీఎస్సెట్ నోటిఫికేషన్ విడుదల
అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ నియామకాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష ‘తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2024’ నోటిఫికేషన్ విడుదలైంది. -
పోల్ 2023.. కేఎంఆర్..!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు క్రమంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. భారాస ప్రత్యర్థుల్ని నియంత్రించాలనే ప్రధాన ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ నిందితులు ప్రత్యేక వాట్సప్ గ్రూప్లను ఏర్పాటు చేసినట్లు తాజా దర్యాప్తులో తేలింది. -
50 శాతంపైగా పెరిగిన కరెంటు వినియోగం
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో హైదరాబాద్తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్, వినియోగం అనూహ్యంగా పెరుగుతున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. -
రోహిత్ కేసు పునర్విచారణ ప్రారంభం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఎనిమిదేళ్లకు కేసు పునర్విచారణ జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. -
వడదెబ్బకు 19 మంది మృత్యువాత
రాష్ట్రంలో వారం రోజులుగా హడలెత్తిస్తున్న ఎండలకు తాళలేక రైతులు, దినసరి కూలీలు, వృద్ధులు అసువులు బాస్తున్నారు. శనివారం పలు జిల్లాల్లో ఏకంగా 19 మంది మృతిచెందారు. -
మధుమేహంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి
భారత్లో మధుమేహం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. -
7న మేడిగడ్డకు జ్యుడిషియల్ విచారణ కమిటీ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 7న విశ్రాంత జడ్జి పినాకి చంద్రఘోష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. -
అవినీతి చెక్పోస్టులకు అడ్డుకట్ట!
రాష్ట్రంలో రవాణాశాఖ చెక్పోస్టులను శాశ్వతంగా రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటిపై ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. -
నేడు నీట్-యూజీ ప్రవేశపరీక్ష
నీట్-యూజీ (ఎంబీబీఎస్) ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. -
ఇదీ సంగతి!