Hyderabad: ఏక్ ఫసల్ భూముల్లో ఏకంగా విల్లాలు.. ప్రజాప్రతినిధులవే అధికం
హైదరాబాద్ చరిత్రలో అంతర్భాగమైన జంట జలాశయాల పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఎఫ్టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవెల్) పరిధిలోనే కొందరు ప్రజాప్రతినిధులు... మాజీ ప్రజాప్రతినిధులు విల్లాలు.. ఫామ్హౌస్ల నిర్మాణం ప్రారంభించడమే దానికి నిదర్శనం.
హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ ఎఫ్.టి.ఎల్. పరిధిలోనే నిర్మాణాలు
వాస్తవానికి ఇక్కడ ఒక పంట పండించుకోడానికే అనుమతి
ఈనాడు, హైదరాబాద్; న్యూస్టుడే, బండ్లగూడజాగీరు: హైదరాబాద్ చరిత్రలో అంతర్భాగమైన జంట జలాశయాల పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఎఫ్టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవెల్) పరిధిలోనే కొందరు ప్రజాప్రతినిధులు... మాజీ ప్రజాప్రతినిధులు విల్లాలు.. ఫామ్హౌస్ల నిర్మాణం ప్రారంభించడమే దానికి నిదర్శనం. వాస్తవంగా బాహ్యవలయ రహదారి, విమానాశ్రయం అందుబాటులోకి రావడం, జలాశయాల పరిసర ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతుండడంతో నేతలు ఈ భూములపై గతంలోనే కన్నేశారు. ముఖ్యంగా ఏక్ ఫసల్ పేరుతో ఉన్న దాదాపు రెండొందల ఎకరాల పట్టాభూములపై దృష్టి పెట్టారు.
హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ పరిసరాలు, నార్సింగి, బండ్లగూడజాగీరు ప్రాంతాల్లో ఏళ్లక్రితం నివాసమున్న పేదలు, రైతులకు ఇచ్చిన ఈ భూములను కొన్నారు. అయితే 111 జీవో అమలులో ఉండడంతో నిర్మాణాలకు వెనకడుగు వేస్తూ వచ్చారు. జీవో సవరణ నేపథ్యంలో కొద్దినెలల నుంచి ఈ పరిసరాల్లో నిర్మాణాలు ప్రారంభించారు. ప్రజాప్రతినిధుల అనుచరులు పట్టపగలే మట్టిని తరలించి జలాశయాలను పూడ్చేస్తున్నారు. కొంతమంది పోలీస్ అధికారులు కూడా దృష్టి పెట్టారు. వాస్తవానికి ఏక్ ఫసల్ భూములు అంటే జలాశయాల్లో నీళ్లు లేనప్పుడు ఒకపంట మాత్రమే పండించాలన్న నిబంధనతో ఇచ్చేవి. నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు.
111 జీవోను సవరించడంతో...
జంట జలాశయాల పరిధిని రెవెన్యూ, సాగునీటి శాఖల అధికారులు గతంలోనే నిర్ణయించారు. వర్షాకాలంలో జలాశయానికి ఎంత నీరు వస్తుందో అంచనా వేసి ఆ పరిధిని నిర్ణయించడాన్ని ఎఫ్.టి.ఎల్. అంటారు. దాని తర్వాత దాదాపు అర కిలోమీటరు వరకు బఫర్ జోన్ ఉంటుంది. అక్కడి వరకూ నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. దీంతోపాటు జంట జలాశయాల పరిరక్షణకు జారీ చేసిన 111 జీవో అధికారుల నిర్ణయానికి మరింత పదును పెంచింది. దీంతో ఎఫ్.టి.ఎల్.ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినా.. సరిహద్దు వరకు వెళ్లినా లేనిపోని ఇబ్బందులన్న భావనతో అక్రమార్కులు కొన్నేళ్ల క్రితం వరకూ మిన్నకుండిపోయారు. ఒకట్రెండు ఆక్రమణలున్నా... రెవెన్యూ అధికారులు వెంటనే చర్యలు చేపట్టేవారు. 111 జీవోను సవరించడంతో జంట జలాశయాల పరిసర ప్రాంతాల్లో ఫామ్హౌస్లు, అతిథిగృహాలు... విల్లాలను నిర్మించుకునేందుకు కొందరు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ జీవోను సవరించినందున బఫర్ జోన్ దాటిన తర్వాత జీ+1 నిర్మాణాలు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్న నిర్మాణాలు ఎఫ్.టి.ఎల్. పరిధిలో కావడం గమనార్హం.
* ఒక మాజీ ఎంపీ హిమాయత్సాగర్లోని ఏక్ ఫసల్ భూములను కొద్దిరోజుల నుంచి చదును చేయిస్తున్నారు. అక్కడ ఫామ్హౌస్ నిర్మించాలని నిర్ణయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్