YS Viveka Murder Case: వివేకా హత్యకు పథక రచన జగన్దేనేమో!
ఎన్నికల్లో గెలిచేందుకు జగనే... వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు పథక రచన చేసి ఉంటారన్నది తన అభిప్రాయమని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు. ‘2018లో జగన్పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడి జరిగింది.
ఎన్నికల్లో గెలుపు కోసం కోడికత్తి కేసులానే దీన్నీ చేసుంటారు
అప్పట్లో జగన్కు చికిత్స చేసిన వైద్యులకు అధికారంలోకి వచ్చాక కీలక పదవులు
సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివేకానందరెడ్డి అల్లుడు రాజశేఖర్రెడ్డి
ఈనాడు, అమరావతి-ఈనాడు డిజిటల్, కడప: ఎన్నికల్లో గెలిచేందుకు జగనే... వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు పథక రచన చేసి ఉంటారన్నది తన అభిప్రాయమని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు. ‘2018లో జగన్పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడి జరిగింది. జగన్ భుజానికి గాయమైంది. అది తన మెడపై తగలాల్సిందని, తాను వేగంగా స్పందించి చేయి అడ్డుపెట్టడం వల్ల చేతికి గాయమైందని జగన్ అప్పట్లో చెప్పారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేయించుకుని, హైదరాబాద్ వెళ్లి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. తనకు చికిత్స చేసిన ఇద్దరు ప్రైవేటు వైద్యులకు అధికారంలోకి వచ్చాక కీలక పదవులు (డాక్టర్ సాంబశివారెడ్డిని మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్గా, డాక్టర్ చంద్రశేఖర్రెడ్డిని ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్గా నియమించారు) ఇచ్చారు. ప్రభుత్వ కొనుగోళ్ల వ్యవహారాల్ని పర్యవేక్షించే బాధ్యతల్ని వారికి అప్పగించారు. ఆ దాడి లాగే, ఎన్నికల్లో గెలవడం కోసం మా మామ హత్యకూ జగనే పథక రచన చేసి ఉంటారు’ అని రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు.వివేకా హత్యలో కుటుంబసభ్యుల ప్రమేయం ఉందని అప్పట్లోనే సందేహించి ఉంటే 2019 ఎన్నికల్లో జగన్, అవినాష్రెడ్డి ఓడిపోయేవారని అని అన్నారు.‘వివేకా చనిపోయాక ఆయన వ్యక్తిగత జీవితం గురించి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారంపై ఫిర్యాదు చేయడానికి 2019 మార్చి 23న నేను, సునీత సైబరాబాద్ పోలీసుస్టేషన్కు బయల్దేరాం. అంతలో వైఎస్ భారతి, విజయమ్మ, సజ్జల రామకృష్ణారెడ్డి మా ఇంటికి వచ్చారు. వివేకా హత్యకు సంబంధించి మేం ఏ చేసినా సజ్జలకు చెప్పాలని భారతి సూచించారు. అప్పటికి మాకు కుటుంబ సభ్యులెవరిపైనా సందేహాల్లేవు. అప్పట్లోనే సందేహం వ్యక్తంచేస్తే జగన్, అవినాష్రెడ్డి రాజకీయంగా చాలా ఇబ్బంది పడేవారు’ అని పేర్కొన్నారు. ‘వివేకా హత్య జరిగిన రోజు.. జగన్ హైదరాబాద్ నుంచి సాయంత్రానికి పులివెందుల చేరుకున్నారు. విలేకరుల సమావేశంలో ఏం మాట్లాడాలో సజ్జలతో చర్చించారు. అప్పటికి వివేకా ఇంట్లో లేఖ దొరికిన విషయంగానీ, అందులో డ్రైవర్ ప్రసాద్ పేరు ఉన్నట్లుగానీ నాకు, పోలీసులకు తప్ప ఎవరికీ తెలియదు. అయితే జగన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఆ లేఖ గురించి ప్రస్తావించారు. వివేకా హత్యను రాజకీయాలతో ముడిపెట్టి జగన్ మాట్లాడటం మాకు నచ్చలేదు. అదే విషయాన్ని ఆ తర్వాత ఆయనకు చెప్పాను’ అని రాజశేఖర్రెడ్డి వెల్లడించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెన్నుపోటు
‘2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం వివేకాకు అసలు ఇష్టం లేదు. ఆయన రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. జగన్ ఒత్తిడి మేరకే పోటీ చేశారు. అమెరికాలో ఉన్న నాకు ఎర్ర గంగిరెడ్డి ఫోన్ చేసి... వివేకాను పోటీకి ఒప్పించాలని కోరారు. తెదేపా నాయకులు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి చేతులు కలిపారని, వివేకా అయితేనే గెలవగలరని చెప్పారు. ఆ ఎన్నికల్లో తనకంటే బలహీన అభ్యర్థి అయిన బీటెక్ రవిపై కేవలం 30 ఓట్ల తేడాతో వివేకా ఓడిపోయారు. అవినాష్రెడ్డి కుటుంబానికి ఎర్ర గంగిరెడ్డి దగ్గరయ్యాడని తెలిసింది. ఆ ఎన్నికల తర్వాత ప్రొద్దుటూరులో తన సోదరుడి పేరు మీద ఎర్ర గంగిరెడ్డి రూ.కోటి విలువైన వ్యవసాయ భూములు కొన్నాడు. ఆ ఎన్నికల్లో వివేకా కోసం కాకుండా, తన కోసం పనిచేసేందుకు శివశంకర్రెడ్డికి రూ.70 లక్షలిచ్చానని బీటెక్ రవి నాకు చెప్పారు. మా బంధువులైన భాస్కర్రెడ్డి, అవినాష్రెడ్డిలతో పాటు, శివశంకర్రెడ్డి ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలోని ఓట్లు వివేకాకు పడకుండా చేయడం వల్లే ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం చేసిన అప్పులు తీర్చడానికి మేం హైదరాబాద్లోని రెండు ఇళ్లు, ఒక ఫ్లాటు, హిమాచల్ ప్రదేశ్లోని జల విద్యుత్ కేంద్రంలో 10 శాతం వాటా అమ్ముకోవాల్సి వచ్చింది’ అని వాంగ్మూలంలో రాజశేఖర్రెడ్డి వివరించారు.
వివేకాతో వారికి ఎప్పటి నుంచో విభేదాలు
‘వివేకానందరెడ్డికి, భాస్కర్రెడ్డి కుటుంబానికి ఎప్పటి నుంచో విభేదాలున్నాయి. 2017లో ప్రభుత్వ భూమిని స్థానిక శ్రీకృష్ణ ఆలయ కమిటీకి కేటాయించేలా వివేకా ప్రయత్నించారు. అది అవినాష్రెడ్డికి ఇష్టం లేదు. సర్వే జరగకుండా అడ్డుకున్నారు. తాను కుటుంబసభ్యుల కోసం ఎన్ని త్యాగాలు చేసినా వారు తనంటే అసూయతోనే ఉంటున్నారని చనిపోవడానికి 2, 3 నెలల ముందు వివేకా నాతో చెప్పి బాధపడ్డారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి బతికున్నప్పుడు... ఆయన, వివేకా ఒకరికి ఒకరు బాసటగా నిలిచేవారు. ఒకరు ఎంపీగా పోటీ చేస్తే, మరొకరు ఎమ్మెల్యేగా పోటీ చేసేవారు. అవసరాన్ని బట్టి అటూ ఇటూ మారేవారు. రాజశేఖర్రెడ్డి మరణించాక... ఆ స్థానం నుంచి పోటీకి భాస్కర్రెడ్డి పేరును జగన్ ప్రతిపాదించారు. కానీ వివేకాకు అది ఇష్టంలేదు. భాస్కర్రెడ్డి, మనోహర్రెడ్డిల అభిమతానికి విరుద్ధంగా వివేకా ఒక భూ వివాదం సెటిల్మెంట్లో పాల్గొన్నారు. అప్పటి నుంచి వారు మరింత కక్ష పెంచుకున్నారు’ అని తెలిపారు.
రాజకీయంగా వాడుకోవాలనుకున్నారు
‘వివేకా హత్య జరిగిన రోజు కడప మాజీ మేయర్ సురేష్, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి ఒక కంప్లెయింట్ రాసుకుని వచ్చి, నా భార్య సునీతను సంతకం పెట్టాలన్నారు. దానిలో తెదేపా నాయకులు సతీష్రెడ్డి, ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి పేర్లను అనుమానితులుగా పేర్కొన్నారు. ఆ ముగ్గురూ తెదేపా నాయకులు కావడంతో ఈ నేరం వారే చేశారనడానికి నిర్ధిష్టమైన ఆధారమేదీ లేకపోయినా, కేసును రాజకీయ కోణంలో మలుపు తిప్పుతున్నారని గుర్తించడంతో ఆమె సంతకం చేయలేదు’ అని రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు.
గుండెపోటు అని నేనెప్పుడూ చెప్పలేదు
‘2019 మార్చి 15న నేను సీఐ శంకరయ్యకు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుగులో రాసి ఉన్న ఒక కాగితాన్ని నాకు సీబీఐ అధికారులు చూపించారు. ఆ రోజు నేను ఎలాంటి స్టేట్మెంటూ ఇవ్వలేదు. ఆ రోజు హైదరాబాద్ నుంచి వేకువజామునే బయల్దేరామని, వివేకా హత్య గురించి కృష్ణారెడ్డి ఫోన్ చేసే సమయానికే మేం కర్నూలుకు చేరుకున్నామని రాసి ఉంది. ఆ రోజు ఉదయం 6.15కి కృష్ణారెడ్డి నుంచి ఫోన్ వచ్చింది. అప్పటికి హైదరాబాద్లోనే ఉన్నాం. 7.30కి హైదరాబాద్ నుంచి బయల్దేరాం. వివేకా గుండెపోటుతో చనిపోయి ఉంటారని, మంచం మీద నుంచి కింద పడటం వల్లే దెబ్బలు తగిలి ఉంటాయని నేను అన్నట్టుగా రాశారు. అదీ నిజం కాదు. నేను ఎప్పుడూ అలా చెప్పలేదు. 2019 మార్చి 29న పులివెందుల ఎస్డీపీవో డి.నాగరాజాకి నేను మరో స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. అదీ నిజం కాదు. దాన్నీ సృష్టించారు. 2019 మార్చి 15న సీఐ శంకరయ్య నాకు నోటీసు ఇచ్చినట్లుగా అందులో పేర్కొన్నారు. నాకు పోలీసులు ఎలాంటి నోటీసూ ఇవ్వలేదు. కేసును తప్పుదారి పట్టించేందుకే పోలీసులే ఆ తప్పుడు స్టేట్మెంట్లన్నీ సృష్టించారు’ రాజశేఖర్రెడ్డి అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
నాలుగో రోజూ 46 డిగ్రీలపైనే..
రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. శుక్రవారం 10 జిల్లాల్లోని 20 మండలాల్లో 46.3 నుంచి 46.7 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. -
రిజిస్ట్రార్ కోర్టు ముందు లిస్ట్ కావాల్సిన కేసు ఇక్కడికెలా వచ్చింది?
ప్రస్తుతం తెలంగాణలో విచారణ జరుగుతున్న ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ భారాస నేత, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సతీష్చంద్ర శర్మ, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం జులైకి వాయిదా వేసింది. -
దోస్త్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ఆన్లైన్లో 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. -
‘టానిక్’కు మినహాయింపుల్లోనే మతలబు!
రాష్ట్రంలో ఎలైట్ వైన్షాప్ ‘టానిక్’ ఏర్పాటు సమయంలో ఇచ్చిన వెసులుబాట్లలోనే మతలబు ఉన్నట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిర్ధారణకు వచ్చింది. -
మీ భూమి మీది కాదు
ఆ ఆస్తి మాదే... రికార్డుల్లో మా పేరే ఉంది, మాకేం భయం... అనుకుంటే పొరపాటే. రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. -
జగన్ వంచనకు ఏడు ప్రాణాలు బలి
పింఛన్ల రాజకీయ క్రీడ ఏడుగురిని బలి తీసుకుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారుల వైఫల్యం పేద కుటుంబాలకు పెద్దదిక్కును దూరం చేస్తున్నాయి. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
ఇటీవల కన్నుమూసిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
ఆరు రోజులుగా నక్కి.. ఎరకు చిక్కి
శంషాబాద్ విమానాశ్రయ రన్వే మైదానంలోకి గత నెల 27న చొరబడి అందరినీ కంగారుకు గురి చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. -
వామనరావు దంపతుల హత్య కేసు.. సీబీఐకి అప్పగించేందుకు సిద్ధం
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని హైవేలో 2021 ఫిబ్రవరి 17న జరిగిన న్యాయవాదులు గట్టు వామనరావు దంపతుల హత్యకేసు దర్యాప్తును సీబీఐ లేదా సీఐడీకి అప్పగించడానికి తమకు అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. -
కోర్టులో నేరుగా హాజరుపరచాలని కవిత దరఖాస్తు
ప్రస్తుతం దిల్లీ మద్యం కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు ముందు విచారణ జరిగే సమయంలో తనను నేరుగా హాజరుపరచాలంటూ భారాస ఎమ్మెల్సీ కవిత దరఖాస్తు దాఖలుచేశారు. -
సులభతర వాణిజ్య విధానంలో మరిన్ని సంస్కరణలు
సులభతర వాణిజ్య విధానం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-ఈఓడీబీ)లో అత్యుత్తమ సేవలు కొనసాగించాలని, ఇందుకోసం మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి ఆదేశించారు. -
నిబంధనలు ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్ కళాశాలలపై చర్యలు
తెలంగాణలో నిబంధనలను ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్ కళాశాలలపై విద్యాశాఖ కొరడా ఝుళిపించింది. ఇంటర్ విద్యామండలి ఆదేశాలను విస్మరించి వేసవి సెలవుల్లో కళాశాలలను నిర్వహించడం, ప్రవేశాలు కల్పించినందుకుగాను ఒక్కో కళాశాలపై రూ.లక్ష చొప్పున జరిమానా విధించినట్లు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వం కోరితే.. పదోన్నతులకు టెట్ మినహాయింపునిస్తాం
తెలంగాణలో 2010 కన్నా ముందు నియమితులై 1 నుంచి 5 తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే వెంటనే ఉత్తర్వులిస్తామని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఛైర్మన్ యోగేశ్ సింగ్ తెలిపారు. -
టెట్ పరీక్షల షెడ్యూలు విడుదల
ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024 షెడ్యూలును విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. -
6న ఈసెట్
టీఎస్ ఈసెట్-2024 ప్రవేశ పరీక్ష మే 6వ తేదీన ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. -
ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు
ఎండల తీవ్రత దృష్ట్యా జాతీయ ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ అనితా రామచంద్రన్ ఆదేశించారు. -
ఆర్టీసీ రిజర్వేషన్ ఛార్జీలపై మినహాయింపు
దూరప్రాంత బస్ సర్వీసుల్లో రిజర్వేషన్ ఛార్జీలపై టీఎస్ఆర్టీసీ కొత్త నిర్ణయం తీసుకుంది. -
40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం రూ.32 వేలు, గరిష్ఠంగా రూ.2,95,460 ఉండాలని వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఛైర్మన్ శివశంకర్ను రాష్ట్ర గెజిటెడ్ అధికారుల (టీజీవోల) సంఘం కోరింది. -
రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక పరిణామం
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో ముఖ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై దర్యాప్తు ముగిసిన దశలో కీలక మలుపు తిరిగింది. -
హెచ్సీయూ వీసీ, నేతలపై నమోదైన కేసులో ఆధారాల్లేవు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు నివేదికను పోలీసులు హైకోర్టుకు సమర్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!