China: అమెరికాలో ఆగిన తైవాన్ ఉపాధ్యక్షుడు.. రెచ్చిపోయిన చైనా
తైవాన్పై చైనా (China) మరోసారి బెదిరింపులకు పాల్పడింది. ఆ ద్వీపం చుట్టూ సైనిక విన్యాసాలు చేపట్టింది. యుద్ధ విమానాలతో డ్రిల్స్ నిర్వహిస్తోంది.
బీజింగ్: చైనా - తైవాన్ (China-Taiwan) మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ద్వీపం చుట్టూ బీజింగ్ శనివారం సైనిక్ డ్రిల్స్ (military drills)ను ప్రారంభించింది. తైవాన్ (Taiwan) ఉపాధ్యక్షుడు విలియం లాయ్ చెంగ్-తె అమెరికా (USA)లో ఆగడమే ఇందుక్కారణం. వేర్పాటువాదులు, విదేశీ శక్తుల కవ్వింపు చర్యలపై హెచ్చరిక గానే ఈ డ్రిల్స్ చేపట్టినట్లు చైనా రక్షణ మంత్రి వెల్లడించారు. అసలేం జరిగిందంటే..
శాశ్వత స్వతంత్ర దేశంగా ప్రకటించుకునేందుకు ప్రయత్నిస్తున్న తైవాన్.. పశ్చిమ దేశాలతో తమ దౌత్యబంధాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల పరాగ్వే (Paraguay) పర్యటనకు వెళ్లిన తైవాన్ ఉపాధ్యక్షుడు విలియం లాయ్.. మధ్యలో శాన్ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ నగరాల్లో ఆగారు. అంతేగాక, అమెరికా మీడియా సంస్థ బ్లూమ్బర్గ్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వూలో ‘తైవాన్ స్వతంత్ర దేశం’ అని లాయ్ పేర్కొన్నారు. ఇక, పరాగ్వేలోనూ అమెరికా అధికారులతో ఆయన చర్చలు జరిపారు.
‘అప్పుడే వినుంటే.. ఆ చిన్నారులు బతికేవారేమో’: రాకాసి నర్సును పట్టించిన భారత సంతతి వైద్యుడు
అయితే ఈ ద్వీపం తమ దేశంలోని భాగమని చెబుతున్న చైనా.. లాయ్ పర్యటనపై గుర్రుమంది. ఇది పూర్తిగా అమెరికా, తైవాన్ అధికారిక డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ కలిసి చేస్తున్న ‘రెచ్చగొట్టే చర్యే’ అని బీజింగ్ మండిపడింది. తమ భూభాగంలోని ప్రాంతాలకు విదేశాలతో సంబంధాలు నెరిపే హక్కు లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే తైవాన్ చుట్టూ సైనిక విన్యాసాలను ప్రారంభించింది. సైనిక బోట్లు, విమానాలను మోహరించింది. సైనికులతో డ్రిల్స్ చేపట్టింది. క్షిపణులను మోసే బోట్లు, యుద్ధ విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నట్లు బీజింగ్ మీడియా వర్గాలు వెల్లడించాయి.
చొచ్చుకొచ్చిన యుద్ధ విమానాలు: తైవాన్
చైనా డ్రిల్స్ను తైవాన్ రక్షణ శాఖ తీవ్రంగా ఖండించింది. ‘‘శనివారం ఉదయం నుంచి చైనా మిలిటరీకి చెందిన 42 యుద్ధ విమానాలు మా ఎయిర్ డిఫెన్స్ జోన్లోకి చొచ్చుకొచ్చాయి. 26 యుద్ధ విమానాలు తైవాన్ జలసంధి మధ్య లైన్ను దాటుకొని వచ్చాయి. ఇది పూర్తిగా రెచ్చగొట్టే చర్యే. చైనా సైన్యం నుంచి ముప్పును ఎదుర్కొనేందుకు, మా స్వతంత్రతను కాపాడుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. మా బలగాలను కూడా మోహరించాం’’ అని తైవాన్ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి
ఆస్ట్రేలియాలోని ఓ మహిళా ఎంపీకి కొందరు దుండగులు డ్రగ్స్ ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. -
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్బ్యాంక్’ కమాండర్ హతం!
ఇజ్రాయెల్ బలగాలు జరిపిన కాల్పుల్లో హమాస్ వెస్ట్ బ్యాంక్ కమాండర్ ఆలా శ్రేతేహ్ హతమయ్యాడు. -
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
ఈక్వెడార్ సోషల్ మీడియా స్టార్, మోడల్ లాండీ పరాగా హత్య విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్స్టా వేదికగా చేసిన పోస్టు సహాయంతో ఆమెను నిందితులు హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. -
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
Canada: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. -
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
Brazil floods: బ్రెజిల్లో వరదల కారణంగా దాదాపు 60 మంది మృతి చెందారు. మరో 70 మంది ఆచూకీ గల్లంతైంది. దాదాపు 70 వేల మంది నిరాశ్రయులయ్యారు. -
ప్యాంటులో దాచిపెట్టి పాముల అక్రమ రవాణాకు యత్నం
ఫ్యాంటులో రహస్యంగా దాచిపెట్టి తరలిస్తున్న రెండు పాములను అమెరికాలోని మయామీ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది చివరి నిమిషంలో గుర్తించారు. -
గాజా శాంతిచర్చల్లో పురోగతి!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే విషయంలో గమనించదగ్గ పురోగతి కనిపించిందని ఈజిప్టు అధికార ప్రసారమాధ్యమాలు వెల్లడించాయి. -
నిజ్జర్ హత్యకేసు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో అరెస్టైన నిందితులు ముగ్గురికి పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. -
అమెరికాలో నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
అధిక మోతాదులో ఇన్సులిన్ను ఇచ్చి 17 మంది మరణానికి కారణమైన ఓ నర్సుకు అమెరికాలోని ఓ కోర్టు 700 ఏళ్లకు పైగా శిక్షను శనివారం విధించింది. -
రష్యా వాంటెడ్ జాబితాలో జెలెన్స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పేరును రష్యా తమ వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఆయన కంటే ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పనిచేసిన పెట్రో పొరొషెంకో పేరు కూడా అందులో కనిపించింది. -
రఫాపై దండయాత్ర జరిగితే రక్తపాతమే: డబ్ల్యూహెచ్వో
ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న రఫాపై ఇజ్రాయెల్ దాడి జరిపితే భారీ సంఖ్యలో పాలస్తీనా పౌరులు చనిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. -
హ్యూస్టన్ను ముంచెత్తిన వరదలు
ఎడతెరిపిలేని వానలతో టెక్సాస్లోని హ్యూస్టన్ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇళ్లపైకప్పులపై చేరి సాయం కోసం నిరీక్షిస్తున్న 300 మందికి పైగా ప్రజల్ని బలగాలు రక్షించాల్సి వచ్చింది. -
‘పారిస్ లక్ష్యాని’కి ఆమడదూరంలో దేశాల వాతావరణ ప్రణాళికలు
పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కర్బన ఉద్గారాల నిర్మూలనకు దేశాలు సమర్పించిన ప్రణాళికలు ఆశాజనకంగా లేవని తాజా అధ్యయనం పేర్కొంది. -
పాకిస్థాన్లో యోగా తరగతులు షురూ
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ ప్రాచీన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనమైన యోగా.. దాయాది దేశమైన పాకిస్థాన్లోనూ ఇప్పుడు అధికారికంగా ప్రవేశించింది. -
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
కొన్ని ఎకరాల వైశాల్యంలో ఉన్న విల్లాను ఉచితంగా ఇచ్చేందుకు ఒక దేశ ప్రభుత్వం ముందుకొచ్చింది..!
తాజా వార్తలు (Latest News)
-
ప్రశ్నించడమే నేరమా?.. 8 నెలల గర్భిణిపై వైకాపా నాయకుల దాడి
-
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి
-
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
-
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్బ్యాంక్’ కమాండర్ హతం!
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM