Congo Fever: ఇరాక్ను వణికిస్తోన్న ప్రాణాంతక కాంగో ఫీవర్
జంతువుల్లో కనిపించే రక్తం పీల్చే పేలు (Tick Bite) విస్తృత వ్యాప్తితో ఇరాక్ వణికిపోతోంది. జంతువుల నుంచి మానవులకు వ్యాపిస్తోన్న ఈ ప్రాణాంతక వ్యాధి కేసులు ఇటీవల భారీగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఈఏడాది రికార్డు స్థాయిలో కేసులు
ఇంటర్నెట్ డెస్క్: జంతువుల్లో కనిపించే రక్తం పీల్చే పేలు (Tick Bite) విస్తృత వ్యాప్తితో ఇరాక్ వణికిపోతోంది. జంతువుల నుంచి మానవులకు వ్యాపిస్తోన్న ఈ ప్రాణాంతక వ్యాధి కేసులు ఇటీవల భారీగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, ఈవ్యాధి బారినపడి ఈ ఏడాది ఇప్పటికే 19 మంది ప్రాణాలు కోల్పోయారు. జ్వరం, ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదమున్న ఈ వైరస్తో మరణాల రేటు అధికంగా ఉండడం కలవరపెడుతోంది. దీన్ని ఎదుర్కొనేందుకు ఇరాక్ గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య కార్యకర్తలు పీపీఈ కిట్లు ధరించి పశువులపై క్రిమిసంహారకాలను పిచికారి చేయడాన్ని విస్తృతం చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
మరణాల రేటు అధికం..
నైరోవైరస్ అని పిలిచే క్రిమియన్-కాంగో హెమోరేజిక్ ఫీవర్ (CCHF) అనేది పేలు (Tick Bite) ద్వారా జంతువుల్లో వ్యాపిస్తుంది. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెల్లో వైరస్ వాహకంగా ఈ పేలు పనిచేస్తుంది. అలా వైరస్ బారినపడిన పశువుల రక్తాన్ని తాకినప్పుడు లేదా వైరస్ ఉన్న పేలు కుట్టినప్పుడు లేదా పశువధ కేంద్రాల్లోని స్త్రావాల ద్వారా మానవులకు సోకుతుంది. వైరస్ సోకిన వ్యక్తుల రక్తం, మలం, చెమట కణాల ద్వారా ఇతర వ్యక్తులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తులకు శ్వాస ఆడకపోవడం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, తీవ్ర జ్వరంతోపాటు ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం జరిగి చివరకు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రమాదకర వ్యాధి కారణంగా ఇరాక్లో ఇప్పటివరకు 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆఫ్రికా, ఆసియా, మధ్యతూర్పు ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి మరణాల రేటు 10 నుంచి 40 శాతం ఉందని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది.
43ఏళ్లలో తొలిసారి ఈస్థాయిలో..
సీసీహెచ్ఎఫ్కు కారణమయ్యే వైరస్ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్లు లేవు. వేగంగా వ్యాపించే ఈ వ్యాధి వల్ల మానవ శరీరంలో అంతర్గతంగా, బాహ్య అవయవాల నుంచి రక్తస్రావం అవుతుంది. ఇలా ప్రాణాంతకమైన ఈ వ్యాధి సోకిన ప్రతి ఐదులో రెండో వంతు కేసుల్లో మరణాలు సంభవిస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ప్రతిఏడాది ఇరాక్లో ఐదు కంటే తక్కువ కేసులే నమోదవుతుండగా ఈసారి మాత్రం ఊహించని విధంగా కేసులు నమోదవుతున్నట్లు అక్కడి ధీ ఖార్ ప్రావిన్సులోని వైద్యాధికారి హైదర్ హ్యాన్టౌక్ వెల్లడించారు. ఇరాక్లో 1979లో తొలిసారి వైరస్ వెలుగు చూడగా.. గడిచిన 43ఏళ్లలో ఈ స్థాయిలో కేసులను ఎన్నడూ చూడలేదన్నారు. అయితే రైతులు, కబేళాలో పనిచేసే కార్మికులు, పశువైద్యుల్లోనే ఈ కేసులు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
కారణం అదేనా..
ఇరాక్లో ఈ వ్యాధి విపరీతంగా వ్యాప్తి చెందడానికి చాలా కారణాలు ఉన్నాయని ఇరాక్లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి అహ్మద్ జౌటెన్ పేర్కొన్నారు. కొవిడ్ కారణంగా 2020-2021 మధ్య కాలంలో పశువుల్లో క్రిమిసంహారక పిచికారి చేయకపోవడం, గ్లోబర్ వార్మింగ్ వంటివి వ్యాధి వ్యాప్తికి పలు కారణాలుగా అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తోన్న ఈ పేలు వ్యాధిని అరికట్టేందుకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. గ్రామాల్లోని ఆరోగ్య కార్యకర్తలు పీపీఈ కిట్లు, అద్దాలు, మాస్కులు ధరించి పశువులపై క్రిమిసంహారక మందులను పిచికారి చేస్తున్నారు. అయితే, జులై మాసంలో అక్కడ పండుగలు ఉండడం, జంతు మాంసం విక్రయాలు భారీగా పెరగనుండడంతో ఈ కేసుల సంఖ్య మరింత అధికంగా ఉండవచ్చని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు. -
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్