Donald Trump: అణు దాడికి గతంలో ట్రంప్ ఉబలాటం.. శ్వేతసౌధం అధికారుల అవస్థలు
ట్రంప్(Donald Trump) అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కొత్తలో ఉత్తరకొరియాపై అణుదాడి చేయాలని ఉబలాటపడిపోయారు. దీంతో శ్వేత సౌధం అధికారులు ఆయన్ను అడ్డుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
ఇంటర్నెట్డెస్క్: డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉత్తరకొరియాపై అణుదాడి గురించి తీవ్రంగా ఆలోచించారు. ఈ విషయాన్ని ‘ట్రంప్ వర్సెస్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా’ పుస్తక రచయిత మైఖెల్ తెలిపారు. ఈ పుస్తకానికి సంబంధించిన అనుబంధ భాగం త్వరలోనే రానుంది. దీనిలో నాటి శ్వేతసౌధం చీఫ్ ఆఫ్ స్టాఫ్ జాన్ కెల్లీ అనుభవాలను రాశాడు. 2017లో ట్రంప్ శ్వేతసౌధంలో అడుగు పెట్టిన తర్వాత ఉత్తరకొరియాపై దుందుడుకు వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. ‘ప్రపంచం చూడని భయంకర పరిణామాలు ఉంటాయి’ ‘సర్వనాశనం చేస్తాం’ ‘లిటిల్ రాకెట్ మ్యాన్’ వంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఉ.కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ను కవ్వించారు. దీనికి తోడు ట్రంప్ ట్వీట్లు కూడా దుందుడుకుగా ఉన్నాయి. అప్పట్లో ఇవి జాన్ కెల్లీని తీవ్రంగా భయపెట్టాయి.
* అధ్యక్ష పదవి చేపట్టిన కొన్ని రోజులకే ఉత్తరకొరియాపై అణుదాడి చేసే వ్యూహంపై అధ్యక్ష కార్యాలయంలో ట్రంప్(Donald Trump) సీనియర్ అధికారులతో చర్చించారు. దాడి తర్వాత నిందను ఏదో ఒక దేశంపై వేస్తే ఎలా ఉంటుందని ఆయన అడిగారట.
* ఆ సమయంలో అధ్యక్షుడికి సర్దిచెప్పేందుకు కెల్లీ స్పందించాల్సి వచ్చింది. దాడి వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని, దీనికి తోడు దాడి బాధ్యత నుంచి తప్పించుకోవడం కష్టమని నచ్చజెప్పేందుకు యత్నించారు.
* ఆ తర్వాత కెల్లీ చొరవ తీసుకొని సీనియర్ సైనికాధికారులను శ్వేత సౌధానికి పిలిపించారు. అమెరికా-ఉత్తరకొరియా మధ్య యుద్ధం అవకాశాలు, వాటి పరిణామాలు, ఎంత మంది చనిపోతారు అన్న విషయాలను చెప్పించారు. ఆ విషయాలేవీ ట్రంప్(Donald Trump)ను ప్రభావితం చేయలేకపోయాయి. దీంతో దాడి తర్వాత అమెరికా ఎదుర్కొనే ఆర్థిక పర్యవసానాలను కూడా అధ్యక్షుడి దృష్టికి తెచ్చారు.
* ముందస్తు అణుదాడికి కాంగ్రెస్ అనుమతి ఉండాలని చెప్పడంతో ట్రంప్(Donald Trump) చిరాకుపడ్డారు. ‘నా వద్ద పెద్ద అణు బటన్ ఉంది’ అని 2018లో జనవరిలో ట్వీట్ చేయడం సంచలనం సృష్టించింది.
* ట్రంప్ (Donald Trump) అధ్యక్ష కార్యాలయంలోకి వచ్చాక కూడా అసురక్షితమైన ఫోన్ నుంచి మిత్రులకు, ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు కాల్స్ చేసి ‘ఉత్తర కొరియాపై సైనిక దాడి’ గురించి చర్చించేవారు. పుస్తక రచయిత మైఖెల్ తన సరికొత్త అనుబంధంలో ఈ అంశాలను మొత్తం ప్రస్తావించారు. ఈ పుస్తకంలోని కీలక విషయాలు ఆంగ్లవార్త సంస్థ ఎన్బీసీ చేతికి చిక్కాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి
ఆస్ట్రేలియాలోని ఓ మహిళా ఎంపీకి కొందరు దుండగులు డ్రగ్స్ ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. -
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్బ్యాంక్’ కమాండర్ హతం!
ఇజ్రాయెల్ బలగాలు జరిపిన కాల్పుల్లో హమాస్ వెస్ట్ బ్యాంక్ కమాండర్ ఆలా శ్రేతేహ్ హతమయ్యాడు. -
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
ఈక్వెడార్ సోషల్ మీడియా స్టార్, మోడల్ లాండీ పరాగా హత్య విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్స్టా వేదికగా చేసిన పోస్టు సహాయంతో ఆమెను నిందితులు హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. -
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
Canada: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. -
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
Brazil floods: బ్రెజిల్లో వరదల కారణంగా దాదాపు 60 మంది మృతి చెందారు. మరో 70 మంది ఆచూకీ గల్లంతైంది. దాదాపు 70 వేల మంది నిరాశ్రయులయ్యారు. -
ప్యాంటులో దాచిపెట్టి పాముల అక్రమ రవాణాకు యత్నం
ఫ్యాంటులో రహస్యంగా దాచిపెట్టి తరలిస్తున్న రెండు పాములను అమెరికాలోని మయామీ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది చివరి నిమిషంలో గుర్తించారు. -
గాజా శాంతిచర్చల్లో పురోగతి!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే విషయంలో గమనించదగ్గ పురోగతి కనిపించిందని ఈజిప్టు అధికార ప్రసారమాధ్యమాలు వెల్లడించాయి. -
నిజ్జర్ హత్యకేసు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో అరెస్టైన నిందితులు ముగ్గురికి పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. -
అమెరికాలో నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
అధిక మోతాదులో ఇన్సులిన్ను ఇచ్చి 17 మంది మరణానికి కారణమైన ఓ నర్సుకు అమెరికాలోని ఓ కోర్టు 700 ఏళ్లకు పైగా శిక్షను శనివారం విధించింది. -
రష్యా వాంటెడ్ జాబితాలో జెలెన్స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పేరును రష్యా తమ వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఆయన కంటే ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పనిచేసిన పెట్రో పొరొషెంకో పేరు కూడా అందులో కనిపించింది. -
రఫాపై దండయాత్ర జరిగితే రక్తపాతమే: డబ్ల్యూహెచ్వో
ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న రఫాపై ఇజ్రాయెల్ దాడి జరిపితే భారీ సంఖ్యలో పాలస్తీనా పౌరులు చనిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. -
హ్యూస్టన్ను ముంచెత్తిన వరదలు
ఎడతెరిపిలేని వానలతో టెక్సాస్లోని హ్యూస్టన్ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇళ్లపైకప్పులపై చేరి సాయం కోసం నిరీక్షిస్తున్న 300 మందికి పైగా ప్రజల్ని బలగాలు రక్షించాల్సి వచ్చింది. -
‘పారిస్ లక్ష్యాని’కి ఆమడదూరంలో దేశాల వాతావరణ ప్రణాళికలు
పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కర్బన ఉద్గారాల నిర్మూలనకు దేశాలు సమర్పించిన ప్రణాళికలు ఆశాజనకంగా లేవని తాజా అధ్యయనం పేర్కొంది. -
పాకిస్థాన్లో యోగా తరగతులు షురూ
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ ప్రాచీన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనమైన యోగా.. దాయాది దేశమైన పాకిస్థాన్లోనూ ఇప్పుడు అధికారికంగా ప్రవేశించింది. -
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
కొన్ని ఎకరాల వైశాల్యంలో ఉన్న విల్లాను ఉచితంగా ఇచ్చేందుకు ఒక దేశ ప్రభుత్వం ముందుకొచ్చింది..!
తాజా వార్తలు (Latest News)
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి
-
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి