Earthquake: నేపాల్‌ రాజధాని కాఠ్‌మాండూలో భూకంపం

నేపాల్ (Nepal)లో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. ఈ ప్రభావం దిల్లీ-ఎన్సీఆర్‌ ప్రాంతంలోనూ కనిపించి స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. 

Updated : 22 Oct 2023 10:02 IST

కాఠ్‌మాండూ: నేపాల్ (Nepal) రాజధాని కాఠ్‌మాండూలో (Earthquake) ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టార్‌ స్కేల్‌పై 6.1 తీవ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. ధాడింగ్‌ జిల్లా జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం..  ఉదయం 7.39 గంటలకు ప్రకంపనలు మొదలయ్యాయి. బాగ్‌మతి, గండకి ప్రావిన్సుల్లోని ఇతర జిల్లాల్లోనూ కుదుపులు వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియరాలేదు. ఈ భూకంపం ప్రభావం దిల్లీ-ఎన్సీఆర్‌ ప్రాంతంలోనూ కనిపించి స్వల్ప ప్రకంపనలు వచ్చాయి.

ఉక్రెయిన్‌లోని పోస్టల్‌ డిపోపై రష్యా దాడి.. ఆరుగురు మృతి

టిబెటన్‌, ఇండియన్‌ టెక్టోనిక్‌ ప్లేట్లు కలిసే శిఖరంపై ఉన్న నేపాల్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. ప్రతి శతాబ్ద కాలానికి ఈ రెండు ప్లేట్లు ఒకదానికొకటి రెండు మీటర్ల మేర దగ్గరకు జరుగుతున్నాయి. దీని ఫలితంగా లోపల ఒత్తిడి ఏర్పడి భూకంపాలు వస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. 2015లో నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్‌ స్కేల్‌పై 7.8 తీవ్రత నమోదు కావడంతో దాదాపు 9 వేల మంది మృత్యువాతపడ్డారు. ‘పోస్ట్‌ డిజాస్టర్‌ నీడ్స్‌ అసెస్‌మెంట్‌’ నివేదిక ప్రకారం.. ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే దేశాల్లో నేపాల్ 11వ స్థానంలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని