Foxconn Founder: తైవాన్ అధ్యక్ష రేసులో.. ఫాక్స్కాన్ వ్యవస్థాపకుడు
ఫాక్స్కాన్ (Foxconn) వ్యవస్థాపకుడు టెర్రో గౌ.. తైవాన్ అధ్యక్ష రేసులోకి దిగారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
తైపీ: తైవాన్ (Taiwan)లో వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ప్రముఖ బిలియనీర్, ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్కాన్ (Foxconn) వ్యవస్థాపకుడు టెర్రీ గౌ (Terry Gou) అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగుతున్నారు. ఈ ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రస్తుత అధికార డొమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (DPP)పై విమర్శలు గుప్పించారు. ‘‘అధికార పార్టీ విధానాలు తైవాన్ను చైనాతో యుద్ధం ముప్పులోకి నెట్టేశాయి’’ అని దుయ్యబట్టారు.
కాగా.. కొన్నేళ్లుగా అధ్యక్ష పదవి కోసం కలలు కంటున్న టెర్రీ గౌ (Terry Gou).. 2019 ఫాక్స్కాన్ చీఫ్ బాధ్యతల నుంచి దిగిపోయారు. అదే ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రతిపక్ష కువోమింగ్తాంగ్ పార్టీలో చేరారు. అయితే, ఆ పార్టీ తరఫున అభ్యర్థిగా నామినేట్ కాకపోవడంతో అప్పుడు తన ప్రయత్నాలను విరమించుకున్నారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ ప్రోగ్రోసివ్ పార్టీ అభ్యర్థి అయిన త్సాయి ఇంగ్ వెన్ (Tsai Ing-wen) అధ్యక్షురాలిగా విజయం సాధించారు.
అమెరికా ఎన్నికల్లో వివేకానందం! అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో రామస్వామి దూకుడు
తాజాగా మరోసారి కువోమింగ్తాంగ్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేసేందుకు ముందుకొచ్చారు. అయితే ఈ సారి కూడా టెర్రీ గౌను కాకుండా న్యూ తైపీ సిటీ మేయర్ హు యు ఇయ్ను ఎంపిక చేస్తూ ఈ ఏడాది మే నెలలో ప్రకటన చేసింది. దీంతో పార్టీ నుంచి బయటకు వచ్చిన టెర్రీ గత మూడు నెలలుగా ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు నేడు ప్రకటించారు.
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ యాపిల్కు ఫాక్స్కాన్ (Foxconn) ప్రధాన ముడిసరుకు సరఫరాదారుగా ఉంది. చైనాలో ఈ కంపెనీకి అనేక ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇక తైవాన్ను చైనా తమ భూభాగంగానే పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఇక్కడి ప్రధాన ప్రతిపక్షమైన కువోమింగ్తాంగ్ పార్టీకి చైనాతో మంచి అనుబంధం ఉంది. మరోవైపు, శాశ్వత స్వతంత్ర దేశంగా ప్రకటించుకునేందుకు ప్రయత్నిస్తున్న తైవాన్.. 2024 జనవరిలో అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి
ఆస్ట్రేలియాలోని ఓ మహిళా ఎంపీకి కొందరు దుండగులు డ్రగ్స్ ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. -
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్బ్యాంక్’ కమాండర్ హతం!
ఇజ్రాయెల్ బలగాలు జరిపిన కాల్పుల్లో హమాస్ వెస్ట్ బ్యాంక్ కమాండర్ ఆలా శ్రేతేహ్ హతమయ్యాడు. -
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
ఈక్వెడార్ సోషల్ మీడియా స్టార్, మోడల్ లాండీ పరాగా హత్య విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్స్టా వేదికగా చేసిన పోస్టు సహాయంతో ఆమెను నిందితులు హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. -
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
Canada: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. -
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
Brazil floods: బ్రెజిల్లో వరదల కారణంగా దాదాపు 60 మంది మృతి చెందారు. మరో 70 మంది ఆచూకీ గల్లంతైంది. దాదాపు 70 వేల మంది నిరాశ్రయులయ్యారు. -
ప్యాంటులో దాచిపెట్టి పాముల అక్రమ రవాణాకు యత్నం
ఫ్యాంటులో రహస్యంగా దాచిపెట్టి తరలిస్తున్న రెండు పాములను అమెరికాలోని మయామీ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది చివరి నిమిషంలో గుర్తించారు. -
గాజా శాంతిచర్చల్లో పురోగతి!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే విషయంలో గమనించదగ్గ పురోగతి కనిపించిందని ఈజిప్టు అధికార ప్రసారమాధ్యమాలు వెల్లడించాయి. -
నిజ్జర్ హత్యకేసు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో అరెస్టైన నిందితులు ముగ్గురికి పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. -
అమెరికాలో నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
అధిక మోతాదులో ఇన్సులిన్ను ఇచ్చి 17 మంది మరణానికి కారణమైన ఓ నర్సుకు అమెరికాలోని ఓ కోర్టు 700 ఏళ్లకు పైగా శిక్షను శనివారం విధించింది. -
రష్యా వాంటెడ్ జాబితాలో జెలెన్స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పేరును రష్యా తమ వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఆయన కంటే ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పనిచేసిన పెట్రో పొరొషెంకో పేరు కూడా అందులో కనిపించింది. -
రఫాపై దండయాత్ర జరిగితే రక్తపాతమే: డబ్ల్యూహెచ్వో
ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న రఫాపై ఇజ్రాయెల్ దాడి జరిపితే భారీ సంఖ్యలో పాలస్తీనా పౌరులు చనిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. -
హ్యూస్టన్ను ముంచెత్తిన వరదలు
ఎడతెరిపిలేని వానలతో టెక్సాస్లోని హ్యూస్టన్ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇళ్లపైకప్పులపై చేరి సాయం కోసం నిరీక్షిస్తున్న 300 మందికి పైగా ప్రజల్ని బలగాలు రక్షించాల్సి వచ్చింది. -
‘పారిస్ లక్ష్యాని’కి ఆమడదూరంలో దేశాల వాతావరణ ప్రణాళికలు
పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కర్బన ఉద్గారాల నిర్మూలనకు దేశాలు సమర్పించిన ప్రణాళికలు ఆశాజనకంగా లేవని తాజా అధ్యయనం పేర్కొంది. -
పాకిస్థాన్లో యోగా తరగతులు షురూ
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ ప్రాచీన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనమైన యోగా.. దాయాది దేశమైన పాకిస్థాన్లోనూ ఇప్పుడు అధికారికంగా ప్రవేశించింది. -
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
కొన్ని ఎకరాల వైశాల్యంలో ఉన్న విల్లాను ఉచితంగా ఇచ్చేందుకు ఒక దేశ ప్రభుత్వం ముందుకొచ్చింది..!
తాజా వార్తలు (Latest News)
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి
-
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి
-
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
-
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్బ్యాంక్’ కమాండర్ హతం!
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM