France Protests: రణరంగంలా ఫ్రాన్స్.. చనిపోయిన ఆ టీనేజర్ ఎవరు..?
France Protests: ఐరోపా దేశం ఫ్రాన్స్లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ టీనేజర్ మృతి వల్ల.. ఐదురోజులుగా అక్కడ ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది.
పారిస్: ఐదురోజులుగా ఐరోపా దేశం ఫ్రాన్స్(France) రణరంగాన్ని తలపిస్తోంది. తీవ్రస్థాయి నిరసనలు, లూటీలతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఉంది. ఈ ఆందోళనలను కట్టడి చేసేందుకు 45 వేల మంది బలగాలను మోహరించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్.. యువత ఇంటిపట్టునే ఉండేలా చూడాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల టీనేజర్ మృతి చెందడం ఈ పరిస్థితికి దారితీసింది. (France Protests)
మంగళవారం పోలీసు కాల్పుల్లో చనిపోయిన ఆ యువకుడు పేరు నేహల్. అల్జీరియా సంతతికి చెందిన నేహల్.. తన తల్లి వద్ద ఉంటూ, ఒక డెలివరీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడికి రగ్బీ ఆట అంటే చాలా ఇష్టమట. అందుకే పైరేట్స్ ఆఫ్ నాన్టెర్రె రగ్బీ క్లబ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతడికి చదువు మీద పెద్దగా ఆసక్తి లేదని, ఎలక్ట్రీషియన్గా శిక్షణ పొందాడని తెలుస్తోంది. నేర చరిత్ర ఏమీ లేనప్పటికీ.. స్థానిక పోలీసులకు మాత్రం అతడు సుపరిచితుడు కావడం గమనార్హం.
అయితే మంగళవారం రోజు ట్రాఫిక్ చెక్పాయింట్ వద్ద పోలీసులు అతడి కారు ఆపేందుకు ప్రయత్నించారు. ఆ వాహనం నడుపుతున్న అతడు చూడటానికి పిల్లాడిలా కనిపించేసరికి వారు ఆపాలనుకున్నారు. అంతేగాకుండా అతడి వద్ద పాలిష్ నంబర్ ప్లేట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అయితే నేహల్ కారు ఆపకుండా.. తమ మీదకు కారు పోనిచ్చేందుకు యత్నించాడని చెప్పారు. తమతో పాటు రోడ్డుపై ఉన్న ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు. ఆ కాల్పుల్లో అతడు మృతి చెందాడు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ప్రాథమిక నివేదిక ప్రకారం..ఆ ఆధికారి ఆయుధం వాడే విషయంలో చట్టపరమైన షరతుల ఉల్లంఘన జరిగిందని తేలింది. దాంతో ఆ అధికారి కావాలనే కాల్పులకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ కేసులో జాతి వివక్ష ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాతి వివక్ష వల్లే ఆ పోలీసు తన బిడ్డ ప్రాణాలు తీశాడని నేహల్ తల్లి ఆరోపించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ఫ్రాన్స్ రణరంగంలా మారిపోయింది. ప్రత్యక్ష సాక్షులు, సీసీటీవీ దృశ్యాలు.. అధికారి చెప్పిన స్టోరీకి విరుద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దానివల్లే ఆ టీనేజర్ మృతి ఘటన ప్రజాగ్రహానికి దారితీసిందని పలు మీడియా కథనాలు వెల్లడించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
పాకిస్థాన్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియమితులయ్యారు. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు. -
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
WWE మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ను బిల్ట్ రివార్డ్స్ సీఈఓ అంకుర్ జైన్ వివాహం చేసుకున్నారు. వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్