అమెరికా గగనతలంలో చైనా గూఢచర్య బెలూన్
చైనాకు చెందిన ఓ గూఢచర్య బెలూన్ను తమ గగనతలంలో గుర్తించినట్లు అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ గురువారం ప్రకటించింది. మూడు బస్సుల పరిమాణంలో ఉన్న ఈ బెలూన్ విమానాల కన్నా ఎత్తులో ప్రయాణిస్తోందని వెల్లడించింది.
గాలుల వల్ల దారి తప్పిందన్న డ్రాగన్
బీజింగ్ పర్యటన రద్దు చేసుకున్న ఆంటోనీ బ్లింకన్
వాషింగ్టన్: చైనాకు చెందిన ఓ గూఢచర్య బెలూన్ను తమ గగనతలంలో గుర్తించినట్లు అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ గురువారం ప్రకటించింది. మూడు బస్సుల పరిమాణంలో ఉన్న ఈ బెలూన్ విమానాల కన్నా ఎత్తులో ప్రయాణిస్తోందని వెల్లడించింది. ఈ విషయాన్ని పలు మార్గాల ద్వారా చైనా దృష్టికి తీసుకెళ్లినట్లు అమెరికా తెలిపింది. ఈ నేపథ్యంలో కొన్ని గంటల్లో చైనాకు బయలుదేరాల్సి ఉన్న విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకన్ తన పర్యటనను అర్ధాంతరంగా వాయిదా వేసుకున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఉత్తర అమెరికాలో రాష్ట్రాల్లో భద్రతాపరంగా సున్నితమైన స్థావరాల మీదుగా ప్రయాణిస్తున్న ఈ బెలూన్ను కొన్ని రోజులుగా అమెరికా నిశితంగా పరిశీలిస్తోంది.
అణు క్షిపణి ప్రయోగ కేంద్రంపై నిఘా!
గురువారం ఈ బెలూన్ అణు క్షిపణుల ప్రయోగ కేంద్రం ఉన్న మోంటానా రాష్ట్ర గగనతలంలో ఉండటంతో అమెరికా అప్రమత్తమయింది. దాడి చేసి కూల్చేస్తే ఆ శకలాలు ప్రజలపై పడే అవకాశం ఉండడంతో ఆ ఆలోచనను అధికారులు పక్కనపెట్టారు. ఈ రకమైన బెలూన్ల వల్ల ఇప్పటి రోజుల్లో సమాచార చౌర్యానికి పెద్దగా అవకాశం లేకపోయినప్పటికీ చైనా దీనిని ఎందుకు పంపించి ఉంటుందోనని నిపుణులు విశ్లేషణ చేస్తున్నారు. ఈ బెలూన్ను తాము ట్రాక్ చేస్తున్నామని, అమెరికాతో కలిసి పనిచేస్తామని కెనడా పేర్కొంది.
వాతావరణ సర్వే కోసమే: చైనా
ఈ వివాదంపై చైనా తన స్పందనను వెలువరించింది. ఆ బెలూన్ ఒక ‘పౌర గగననౌక’ అని తెలిపింది. వాతావరణ పరిశోధనల కోసం దానిని తామే ప్రయోగించామని స్పష్టం చేసింది. గాలుల ప్రభావంతో పాటు, స్వయంచోదక సామర్థ్యం పరిమితంగా ఉండటం వల్ల దశ తప్పి అమెరికా గగనతలంలోకి పొరపాటున వచ్చిందని వివరించింది. ఈ ఘటనపై చింతిస్తున్నట్లు చైనా పేర్కొంది. అయితే ఈ స్పందనతో అమెరికా సంతృప్తి చెందలేదు. మరింత సమగ్రమైన వివరణ కోసం అగ్రరాజ్యం పట్టుపడుతోంది.
గూఢచర్య బెలూన్ అంటే..
ఓ పెద్ద బెలూన్కు సౌర శక్తితో పనిచేసే కెమెరా, రాడార్ లాంటి పరికరాలను బిగించి పక్క దేశాల మీదకి గూఢచర్యానికి పంపిస్తే దానినే స్పై బెలూన్ అని వ్యవహరిస్తారు. ఇవి సుమారు 80 వేల నుంచి 1.20 లక్షల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి. వీటిని నేరుగా నియంత్రించలేరు. అయితే లక్ష్యం వైపు వీస్తున్న గాలివాటుకు అనుగుణంగా బెలూన్ ఎత్తును మార్చడం ద్వారా దాని దిశను మార్చేందుకు ప్రయత్నిస్తారు.
శాటిలైట్లు ఉండగా బెలూన్ ఎందుకో..
గూఢచర్యంలో శాటిలైట్లకున్న సామర్థ్యం ముందు బెలూన్లు దిగదుడుపే. అయితే ఇప్పుడు స్పై శాటిలైట్లను గుర్తించి, కూల్చేసే సాంకేతికత అందుబాటులో ఉంది. శత్రు దేశం వీటిని గుర్తించి కూల్చేస్తే ఆర్థిక నష్టం ఎక్కువగా ఉంటుంది. దీనికి భిన్నంగా బెలూన్ల ప్రయోగానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. అందుకే మళ్లీ వీటిపై ఆసక్తి పెరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
Maldives: చైనా పరిశోధక నౌక మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. తిలాఫుషీ తీరంలో ఇది లంగరేసింది. -
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్