ఉక్రెయిన్పై రష్యా డ్రోన్ల దాడులు
ఉక్రెయిన్పై రష్యా దాడుల పర్వం కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి 16 డ్రోన్లతో పుతిన్ సేన విరుచుకుపడింది.
కీవ్: ఉక్రెయిన్పై రష్యా దాడుల పర్వం కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి 16 డ్రోన్లతో పుతిన్ సేన విరుచుకుపడింది. వీటిలో 11 లోహవిహంగాలను నేలకూల్చామని ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకటించింది. రాజధాని కీవ్, పశ్చిమ లివివ్ ప్రావిన్స్ సహా మధ్య, పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయని తెలిపింది. కీవ్ వైపు వచ్చిన డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చేసినట్లు నగరపాలక వ్యవస్థ అధిపతి సెర్హిల్ పోప్కో చెప్పారు. మూడు డ్రోన్లు పోలండ్ సరిహద్దుల్లోని ఒక జిల్లాను తాకాయి. మొత్తంమీద గడిచిన 24 గంటల్లో రష్యా దళాలు 34 వైమానిక దాడులు, ఒక క్షిపణి దాడి, విమాన విధ్వంసక వ్యవస్థలతో 57 రౌండ్ల కాల్పులు జరిపినట్లు శనివారం ఉదయం ఉక్రెయిన్ వాయుసేన ప్రకటించింది. దక్షిణ ఖేర్సన్ ప్రావిన్స్లో నింగి నుంచి పడ్డ శకలాల వల్ల ఏడు ఇళ్లు, ఒక ప్రాథమిక పాఠశాల దెబ్బతిన్నాయి. దొనెట్స్క్ ప్రావిన్స్లో జరిగిన శతఘ్ని గుళ్ల దాడుల్లో ఒకరు చనిపోగా, ముగ్గురు గాయపడ్డారు. 11 పట్టణాలు, గ్రామాలపై ఈ ప్రభావం కనిపించింది. జపోరిజియా నగరంలో రష్యా రాకెట్లు ఒక నివాస ప్రాంతంపై పడ్డాయి. ఫలితంగా కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయి.
క్రిమియాను సందర్శించిన పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శనివారం క్రిమియాను సందర్శించారు. రష్యాలో ఈ ప్రాంతం విలీనమై 9 ఏళ్లయిన సందర్భంగా ఆయన అక్కడికి వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన ఒక బాలల కేంద్రాన్ని సందర్శించారు. ఉక్రెయిన్ నుంచి పిల్లల తరలింపునకు ఆయనే బాధ్యుడంటూ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) ఆయనకు అరెస్టు వారెంటు జారీ చేసిన నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. భద్రతా కారణాలరీత్యా క్రిమియాను తమ ఆధీనంలో ఉంచుకోవడం అనివార్యమని పుతిన్ పేర్కొన్నారు.
ధాన్యం ఒప్పందాన్ని పొడిగించిన రష్యా, ఉక్రెయిన్
ఉక్రెయిన్ నుంచి ఆఫ్రికా, పశ్చిమాసియా, ఆసియాకు ఆహారధాన్యాల ఎగుమతికి వీలు కల్పించే ఒప్పందాన్ని పొడిగించాలని రష్యా, ఉక్రెయిన్ నిర్ణయించాయి. యుద్ధ సమయంలో చేపట్టిన ఈ చర్య వల్ల పేదలకు ఉపశమనం లభిస్తుంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఆహార ధాన్యాల ధరలు పెరగడం వల్ల అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఒప్పందం పొడిగింపు నిర్ణయాన్ని తుర్కియే అధ్యక్షుడు ఎర్దోగాన్.. ఐరాసలో ప్రకటించారు. 120 రోజుల పాటు ఈ పొడిగింపును ఇచ్చినట్లు ఉక్రెయిన్ ఉపప్రధాని ఒలెక్సాండర్ కుబ్రాకోవ్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..