బుర్రా వేడెక్కుతుంది జాగ్రత్త!
‘ఆయన మండిపడుతున్నారు... వారిపై భగభగ లాడుతున్నారు’... మానవ ఉద్వేగాల తీవ్రతను తెలపటానికి తరచూ వినిపించేవే ఈ విశేషణాలు! కానీ ఇవి కేవలం విశేషణాలు కావనీ... సహజ లక్షణాలేననీ, ముఖ్యంగా మండే ఎండల ప్రభావం మన బుర్రలపైనా, ఆలోచనలపైనా ఉంటుందంటున్నారు నిపుణులు.
ఉద్వేగాలపైనా ఎండల ప్రభావం
నిస్పృహ, నేరాలు పెరగొచ్చంటున్న నిపుణులు
‘ఆయన మండిపడుతున్నారు... వారిపై భగభగ లాడుతున్నారు’... మానవ ఉద్వేగాల తీవ్రతను తెలపటానికి తరచూ వినిపించేవే ఈ విశేషణాలు! కానీ ఇవి కేవలం విశేషణాలు కావనీ... సహజ లక్షణాలేననీ, ముఖ్యంగా మండే ఎండల ప్రభావం మన బుర్రలపైనా, ఆలోచనలపైనా ఉంటుందంటున్నారు నిపుణులు. ఉష్ణోగ్రతలు పెరిగితే ఉద్వేగాలూ పెరిగి నిరాశ నిస్పృహలతో నేరాలకూ దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు.
ఒక్క డిగ్రీ సెంటీగ్రేడు పెరిగినా..
వేగంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావం వివిధ రంగాలపై ఎలా ఉంటుందనే దానిపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. వీటిపైనే పరిశోధనలు, అధ్యయనాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏటా అన్ని దేశాల్లోనూ పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతల వల్ల మానవాళిపై పడే ప్రభావం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ధ్రువాల్లో మంచు కరగటం, సముద్రమట్టాలు పెరగటం... భారీగా జంతుజాలం నశించటంలాంటి ఉపద్రవాల గురించి శాస్త్రవేత్తలు పదేపదే హెచ్చరిస్తునే ఉన్నారు. అయితే కేవలం ఈ భౌతికపరమైన మార్పులు, సవాళ్లే కాకుండా మానసికంగా కూడా ఎండలు మనకు ఇబ్బందులు సృష్టిస్తున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు! అధిక ఉష్ణోగ్రతలకు, మానసిక ఆరోగ్యానికి ఉన్న బంధంపై నిశిత శోధన సాగుతోంది. వాతావరణంలో వేడి పెరిగితే... మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని, నిరాశ నిస్పృహ, కుంగుబాటు లక్షణాలతోపాటు నేరప్రవృత్తీ పెరుగుతోందనేది వైద్య నిపుణులు, శాస్త్రవేత్తల ప్రాథమిక భావన! మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా సగటున ఒక డిగ్రీ సెంటీగ్రేడు మించినా అది మానసిక కుంగుబాటుకు, ఉద్వేగాలకు కారణం కావొచ్చని అమెరికాలోని జార్జ్టౌన్ విశ్వవిద్యాలయం ఆరోగ్య విభాగం తేల్చింది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగితే... అమెరికా, మెక్సికోల్లో కుంగుబాటుతో కూడిన ఆత్మహత్యలు పెరుగుతున్నాయని స్టాన్ఫర్డ్ ఆర్థికవేత్త మార్షల్ బుర్కే అధ్యయనం పేర్కొంది. ‘‘పర్యావరణ మార్పులు సామాజిక బంధాల్లో మార్పులకు కారణమవుతున్నాయి. వాటి ప్రభావం మానసిక ఆరోగ్యంపై ఉంటోంది. కాబట్టి పర్యావరణ సమస్యలను కేవలం భౌతిక దృష్టితో కాకుండా ఈ కోణంలోనూ ఎక్కువగా చూడాలి’’ అని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఆచార్యుడు, క్లైమెట్సైకియాట్రీ అలయెన్స్ అధ్యక్షుడు రాబిన్ కూపర్ అంటున్నారు.
నిద్ర దెబ్బతిని.. దుష్ప్రభావాలు పెరిగి..
పరిశోధనల ప్రకారం... పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన బుర్రలపైనా ప్రభావం చూపుతున్నాయి. మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్లు, హార్మోన్లు ప్రభావితమై ఆరోగ్యానికి అత్యంత కీలకమైన నిద్ర దెబ్బతింటోందని నిపుణులు చెబుతున్నారు. ‘‘ఎండను తట్టుకునే ఎయిర్ కండిషనింగ్ సౌకర్యాలు అందరికీ అందుబాటులో ఉండవు. పెరిగిన ఎండలతో నాణ్యమైన నిద్రకు ఆటంకం కలుగుతుంది. దాని దుష్ప్రభావాలు భావోద్వేగాల్లో మార్పు నుంచి మొదలెడితే అనేకరకాలుగా ఉంటాయి. వేడిమి కారణంగా న్యూరోట్రాన్స్మిటర్ సెరొటోనిన్ (మూడ్ నియంత్రణలో కీలకమైంది) ప్రభావితమవుతుంది. మన భావోద్వేగాలను నియంత్రించటంలో అదే కీలకం’’ అని బ్రౌన్ విశ్వవిద్యాలయం పరిశోధకుడు జోష్ వివరించారు. ఇప్పటికే మానసిక సమస్యలతో సతమతమవుతున్నవారికి ఇబ్బందులు ఎక్కువ కావొచ్చన్నది అంచనా. అందుకే కేవలం భౌతిక అనర్థాల గురించే కాకుండా పర్యావరణ మార్పులను ప్రతి ఒక్కరూ తమ మానసిక సమస్యగా కూడా పరిగణించి జాగ్రత్త పడాలన్నది శాస్త్రవేత్తల హెచ్చరిక!
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?