The Iconic India Club: లండన్లో ఇండియా క్లబ్ ఇక గత చరిత్రే
భారత స్వాతంత్య్ర ఉద్యమంలో లండన్లో ఎందరో జాతీయవాదులకు సమావేశ మందిరంగా, ఇటీవలి దశాబ్దాలలో పరాయిగడ్డపై మాతృభూమి వాతావరణాన్ని అనుభవానికి తెచ్చే భవనంగా వెలిగిన ‘ఇండియా క్లబ్’ ఆదివారం నుంచి శాశ్వతంగా మూతపడనున్నది.
నేటి నుంచి కనుమరుగు
లండన్: భారత స్వాతంత్య్ర ఉద్యమంలో లండన్లో ఎందరో జాతీయవాదులకు సమావేశ మందిరంగా, ఇటీవలి దశాబ్దాలలో పరాయిగడ్డపై మాతృభూమి వాతావరణాన్ని అనుభవానికి తెచ్చే భవనంగా వెలిగిన ‘ఇండియా క్లబ్’ ఆదివారం నుంచి శాశ్వతంగా మూతపడనున్నది. బ్రిటన్లో మొట్టమొదటి భారతీయ రెస్టారెంట్లలో ఒకటి ఈ క్లబ్లోనే 1946లో ప్రారంభమైంది. ప్రవాసులకు దోశలు, పకోడీల వంటి భారతీయ వంటకాలను అందించింది. క్లబ్ గోడలపై భారతదేశ మాజీ ప్రధానమంత్రుల చిత్రపటాలు అలంకరించి ఉంటాయి. స్వతంత్ర భారతదేశ తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్, చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్లు కూడా ఇండియా క్లబ్ను సందర్శించారు. లండన్లోని భారతీయ వృత్తి నిపుణులకు ఇక్కడి హోటల్ సరసమైన ధరలకు ఆహార పదార్థాలు అందించేది. వారు ఇక్కడ సమావేశమై రాజకీయాలు, ఇతర అంశాల గురించి చర్చించుకోవడం, తమ భవిష్యత్తుకు పథకాలు వేసుకోవడం వంటివి చేసేవారు. ఈ క్లబ్ను స్థాపించిన వీకే కృష్ణమీనన్ స్వతంత్ర భారతానికి బ్రిటన్లో తొలి హైకమిషనర్ అయ్యారు. 26 గదుల శ్ట్రాండ్ కాంటినెంటల్ హోటల్ మొదటి అంతస్తులో ఇండియా క్లబ్ ఉంది. హోటల్ శిథిలం కాకుండా నిరోధించి, విజయవంతంగా నడుపుతున్న పార్సీ దంపతులు యాద్ గార్ మార్కర్, ఫ్రెనీలకు ప్రస్తుత యజమానులు 1997లో నోటీసు ఇచ్చారు. భవనాన్ని ఖాళీ చేయాలని, అక్కడ కొత్తగా ఆధునిక హోటల్ నిర్మించాలని నిర్ణయించుకున్నామని తెలిపింది. ఇండియా క్లబ్ను వేరే చోటుకు మార్చాలని ప్రయత్నిస్తున్నట్లు యాద్ గార్ కుమార్తె, హోటల్ నిర్వాహకురాలు ఫిరోజా తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!