ఇండియానాపొలిస్‌లో కాల్పుల కలకలం

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఇండియానా రాష్ట్రం ఇండియానాపొలిస్‌లో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. ఓ పోలీసు అధికారి, మరో నలుగురు గాయపడ్డారు.

Published : 25 Mar 2024 04:28 IST

ఒకరి మృతి.. ఐదుగురికి గాయాలు

ఇండియానాపొలిస్‌: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఇండియానా రాష్ట్రం ఇండియానాపొలిస్‌లో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. ఓ పోలీసు అధికారి, మరో నలుగురు గాయపడ్డారు. తూర్పు వాషింగ్టన్‌ కాలనీలోని ఓ బార్‌ పార్కింగ్‌ ప్రదేశంలో అర్ధరాత్రి సమయంలో ఘర్షణ ఏర్పడింది. ఆ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఘర్షణకు కారణమైన వ్యక్తులు పోలీసులపైకి కాల్పులు జరిపారు. దీంతో ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుతో పాటు మరో నలుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని